అన్వేషించండి

AP Elections 2024: ఎన్టీఆర్ ఢిల్లీ పెద్దలను ఎదిరిస్తే, చంద్రబాబు మాత్రం మోకరిల్లారు: వైసీపీ నేతలు ఫైర్

Gudivada Amarnath News: ఏపీ సీఎం వైఎస్ జగన్ ని ఎదుర్కోలేక ప్రతిపక్ష పార్టీలు ఏకమై ఎన్నికల బరిలోకి దిగుతున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.

Andhra Pradesh News: విశాఖపట్నం: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కొనలేక ప్రతిపక్ష పార్టీలు ఏకమై ఎన్నికల బరిలోకి దిగుతున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) అన్నారు. వైసీపీ ఉమ్మడి విశాఖ జిల్లాల డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమని చంద్రబాబు (TDP Chief Chandrababu)కు తెలుసునని, అందుకే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు 2019 మినహా మిగతా అన్ని ఎన్నికల్లోను వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని, ఆయనకు పొత్తులు కొత్త కాదన్నారు. 

దేశమంతా ఎన్నికలకు సిద్ధం, పొత్తుల కోసం చంద్రబాబు సిద్ధం 
ఎన్నికల సంగ్రామానికి రాష్ట్రాలు, దేశం సిద్ధమవుతుంటే.. చంద్రబాబు మాత్రం పొత్తుల కోసం ఎక్కే గడప దిగే గడప అన్న చందంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో జరగనున్న ఎన్నికలకు మేము సిద్ధం అని సీఎం జగన్ ధైర్యంగా చెబుతుంటే, చంద్రబాబు మాత్రం కేంద్ర మంత్రి అమిత్ షా ఇంటిదగ్గర తాను సిద్ధం అని చెప్పుకుంటున్నాడని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యనించారు. జగన్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే అని గతంలో విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు వారితో పెట్టుకున్న పొత్తుపై ప్రజలకు ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నించారు. 
‘బీజేపీకి, వైసిపికి మధ్య అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ చంద్రబాబు నిరంతరం తప్పుపడుతూ వచ్చారు. బీజేపీ, వైసీపీకి ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాలే ఉన్నాయి తప్ప, వ్యక్తిగత సంబంధాలు లేవని జగన్ ప్రజల సాక్షిగా, ప్రధాని మోదీకి చెప్పిన విషయం చంద్రబాబుకు గుర్తులేదా?. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ  అంశాన్ని తమ మీద నెట్టేయాలని చంద్రబాబు చూశాడని, ఈ విషయంలో ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్తారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన అంశాల మీద చంద్రబాబు ప్రజలకు ఇప్పుడు సమాధానం చెప్పగలరా?. కాంగ్రెస్ పార్టీతో సంబంధం పెట్టుకున్న చంద్రబాబు, ఇప్పుడు బిజెపితోను, ప్రాంతీయ పార్టీలతోనూ పొత్తు పెట్టుకోవడాన్ని చూస్తే ఆయనలో ఓటమి భయం స్పష్టమవుతుందని’ మంత్రి అమర్నాథ్ అన్నారు.  

ఢిల్లీ పెద్దలను ఎదిరించిన ఎన్టీఆర్
తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ ఆనాడు ఢిల్లీ పెద్దలను ఎదిరిస్తే, నేడు చంద్రబాబు వాళ్ళ ముందు మోకరిల్లడం ప్రజలు హర్షించరని అమర్నాథ్ అన్నారు. ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చిన వైసీపీదే అంతిమ విజయమని ఆయన స్పష్టం చేశారు. తమ కూటమి సీఎం అభ్యర్థి చంద్రబాబు అని లోకేష్ ఇప్పటికే ప్రకటించారని, అప్పుడు పవన్ కళ్యాణ్ కు అక్కడ పవర్ ఏముంటుందని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు.  ప్రజలు, సంక్షేమం, అభివృద్ధి గురించి మాత్రమే జగన్ ఆలోచిస్తున్నారని.. పొత్తుల గురించి ఆలోచన లేదన్నారు. తాము ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటామని, పార్టీలతో పొత్తు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కాపులు వైసీపీకి మద్దతు ఇస్తారా అనే విషయంపై మంత్రి అమర్నాథ్ స్పందించారు. గత ఎన్నికల్లో 175 సీట్లలో 31 సీట్లను కాపులకు ఇచ్చామన్నారు. వారిలో 29 మంది గెలిచారని, చాలామందికి జగన్ పదవులు ఇచ్చారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కాపు సంక్షేమానికి 35 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. మరే పార్టీ కాపులకు ఇంత ప్రయోజనం చేయలేదన్నారు. 

అంబటి రాంబాబు ట్వీట్
CM CM అని అరిసిన ఓ కాపులారా! 
CM అంటే చీఫ్ మినిస్టరా?
CM అంటే సెంట్రల్ మినిస్టరా?
CM అంటే చంద్రబాబు మనిషా?
CM అంటే చీటింగ్ మనిషా ? అని అంబటి రాంబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget