అన్వేషించండి

YSRCP MP Pilli Issue : ఆధారాలున్నాయన్న వైఎస్ఆర్‌సీపీ ఎంపీ - చాన్సే లేదన్న ప్రభుత్వం ! ఇద్దరిలో ఎవరు కరెక్ట్ ?

ఏపీలో ధాన్యం స్కాం కలకలం రేపుతోంది. రైతుల్ని దోచేస్తున్నారని అధికార పార్టీ ఎంపీ అంటే.. అలాంటిదేమీ జరగదని ప్రభుత్వం తేల్చేసింది.

ఏపీలో ధాన్యం రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని అధికార వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.  ధాన్యం కొనుగోళ్లలో పెద్ద కుంభకోణం జరుగుతోందని... ఉమ్మడి తూ.గో జిల్లాలో 17వేల మంది రైతుల ఆధార్ లింక్ చేయకుండా రైస్ మిల్లుల యజమానులు, అధికారులు మోసం చేశారని ఆయన ఆరోపించారు.  తన వద్ద ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని.. సీఐడీ విచారణ కోరతానని ప్రకటించారు.  సీఐడీ విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. సొంత పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం ఉలిక్కి పడింది. 

సీఎం జగన్ పది రోజుల విదేశీ టూర్ - వైఎస్ఆర్‌సీపీ నేతలకు ఫుల్ హోం వర్క్ !

వెంటే పౌరసరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు సమీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పిల్లి సుభాష్ మాట్లాడింది స్కాం గురించి కాదన్నారు.  బోస్ ఈకేవైసీలో జరుగుతోన్న జాప్యం గురించి మాత్రమే మాట్లాడారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. పిల్లి సుభాష్ చెప్పిన వివరాల మీద అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నామని వెల్లడించారు. ఎంపీ సూచించిన విధంగా సీబీసీఐడీ విచారణ చేపట్టాల్సినంత అవసరం లేదన్నారు.  

అధికారులు కూడా ఇదే రీతిన స్పందించారు. ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణానికి సంబంధించి ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలపై కలెక్టర్లతో మాట్లాడుతున్నామని పౌర సరఫరాల శాఖ ఎండీ వీర పాండియన్ తెలిపారు. ఎంపీ చెప్పినట్లుగా అవతవకలు జరిగే ఆస్కారమే లేదని తేల్చేశారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్. నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలు నమోదు చేసి.. మిగతా రెండు ఎకరాలు వేరే వాళ్ల పేర్ల మీద నమోదు చేసే చాన్స్ లేదన్నారు.  తూర్పు గోదావరి జిల్లాలో 68 వేల మంది రైతులుంటే..51 వేల మంది మాత్రమే ఈ కేవైసీ నమోదు చేసుకున్నారని వీరపాండియన్ తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద ఇంకా 22 శాతం ఈ కేవైసీ పూర్తి కావాల్సి ఉందని, దాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.  

అనంత టీడీపీకి అసలైన సమస్య సొంత నేతలే ! చంద్రబాబు చక్కదిద్దగలరా ?

తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ఎంపీ బోస్ చెప్పినప్పటికీ..అధికారులు మాత్రం అలా జరిగే చాన్స్ లేదన్నారు. మరో వైపు కలెక్టర్‌ను కలిసి ఆధారాలు సమర్పించి సీఐడీ విచారణ కోరుతానని ప్రకటించిన బోస్ ఆ తర్వాత సైలెంటయ్యారు. పార్టీ హైకమాండ్ ఈ అంశంపై ఇక మాట్లాడవద్దని ఆదేశించడంతో ఆయన  ఆగిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Earthquake: విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున పలుచోట్ల ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు
విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున పలుచోట్ల ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
రాయల్ ఎన్‌ఫీల్డ్ లైట్‌వింగ్ హెల్మెట్ రివ్యూ - స్టైల్, సేఫ్టీ, కంఫర్ట్ ఎలా ఉన్నాయి?
రూ.4,500కే రాయల్ ఎన్‌ఫీల్డ్ మాడ్యులర్ హెల్మెట్ - మీ డబ్బుకు తగ్గ వాల్యూ ఇస్తుందా?
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Embed widget