అన్వేషించండి

Chinta Mohan Comments: ఏపీలో కూటమిదే అధికారం, బీజేపీతో పొత్తు చంద్రబాబు చేసిన తప్పు: చింతా మోహన్

Andhra Pradesh Elections 2024: ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని, వైసీపీ ఓడిపోతుందని కాంగ్రెస్ నేత చింతా మోహన్ అన్నారు. చంద్రబాబు మరోసారి సీఎం అవుతారని ఢిల్లీలో చింతా మోహన్ చెప్పారు.

Chinta Mohan predicts TDP BJP Janasena will win AP Elections 2024| ఢిల్లీ: ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుకు అనుకూల పవనాలు వీచాయని, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రావడం ఖాయం, చంద్రబాబు సీఎం అవుతారని చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఏకంగా రూ.4000 కోట్ల నుంచి రూ.5000 కోట్లు ఖర్చు పెట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. ఈ నగదు ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరిచ్చారో దర్యాప్తు సంస్థలు చెప్పాలన్నారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆ మొత్తంలో 5 శాతం కూడా ఖర్చు చేయలేక పోయిందన్నారు.

తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థి రూ.80 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. రిజర్వ్‌డ్ నియోజకవర్గం గూడురు నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి రూ.45 కోట్లు ఎన్నికలకు ఖర్చు చేశారని చెప్పారు. ఈ డబ్బును ఓ పోలీస్ అధికారి హోటల్లో పెట్టుకుని డిస్ట్రిబ్యూట్ చేశారని, పోలీస్ వ్యవస్థ ఇలా ఉంటే ప్రజలకు ఏం ప్రయోజనం ఉందని ప్రశ్నించారు. 

నోట్లతో అద్భుతాలు చేసినా జగన్‌ ఓటమి! 
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన అధికారం కోసం అద్భుతాలు చేశారని, ఎన్నికల్లో రూ.4 వేల నుంచి రూ.5 వేల కోట్లు ఎలా తీసుకువచ్చి ఖర్చు చేశారో అని చింతా మోహన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అధికారంలోకి రావడానికి జగన్, పార్టీ నేతలు అక్రమాలు, అధికార దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోపించారు. వారి పేపర్లో ఏపీలో అధికారంలోకి వచ్చేది వైసీపీ అని వార్తలు వచ్చాయన్నారు. కానీ ఏపీలో సీఎం జగన్, ప్రధాని మోదీపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. ఏపీలో వైసీపీ ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. జగన్ ను పెంచి పోషిస్తున్న ప్రధాని మోదీకి పరాభవం తప్పదన్నారు. బీజేపీకి 150 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. 

బీజేపీతో పొత్తు, చంద్రబాబు చేసిన తప్పు..
చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుని పొరపాటు చేశారని, లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తే చంద్రబాబుకు 150 సీట్లు వచ్చేవని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. బీజేపీతో పొత్తు వల్ల కూటమికి సీట్లు తగ్గుతాయి, కానీ చంద్రబాబు అధికారంలోకి వస్తారని స్పష్టం చేశారు. ఏపీలో ఎంత ఖర్చు చేసినా, జగన్ ఓడిపోవడం ఖాయమైందన్నారు. జగన్ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ అంతగా క్యాష్ చేసుకోలేకపోయిందని, చంద్రబాబు పార్టీ దాన్ని క్యాష్ చేసుకుందని చెప్పారు. ఓడిపోతున్నామని తెలిసినా తమదే విజయమని జగన్ ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

జగన్ కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయింది కానీ, వ్యతిరేక ఓటు కూటమికి వెళ్లిందన్నారు. తిరుపతి లోకసభ నియోజకవర్గం పరిధిలోనే వైసీపీ 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిందని ఆరోపించారు. అధికారం ఉంటే డబ్బు వస్తుందని, డబ్బు ఉంటే అధికారం వస్తుందని జగన్ భావించారని చెప్పారు. అన్నీ తెలిసి కూడా, వ్యవస్థలన్నీ విఫలమయ్యాయని, ఎన్నికల సంఘం పూర్తిగా బలహీన పడిపోతోందన్నారు. పోలీసులు సైతం వైసీపీ నేతలకు సహకరించగా, వారికి ఆధారాలు తామెందుకు ఇస్తామని చింతా మోహన్ ప్రశ్నించారు. ఏది ఏమైతేనేం వైసీపీ ప్రభుత్వ వ్యతిరేఖ ఓట్లు, జగన్ ను వ్యతిరేకించే వారు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేశారని పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget