అన్వేషించండి

Ambati Rambabu: పోలవరం చాలా టఫ్ సబ్జెక్ట్, ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకు కూడా అర్థం కాలేదు: అంబటి రాంబాబు

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు చాలా టఫ్ సబ్జెక్ట్ అని, అది ఎవరికీ అర్థం కాదు అని, ఎందుకంటే తనకు కూడా అర్థం కాలేదు కాబట్టి అని ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ambati Rambabu sensational on Polavaram Project | అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సోమవరం సందర్శించారు. ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని, తిరిగి దారిలోకి తెచ్చి, పోలవరం పూర్తి చేయాలంటే మరో నాలుగు సీజన్లు పడుతుందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీ నీటిపారుదలశాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవం ప్రాజెక్ట్ చాలా కాంప్లికేటెడ్ విషయం, దాని గురించి ఎవరికి అర్థం కాదన్నారు. ఎందుకంటే పోలవరం తనకు కూడా అర్థం కాలేదు అన్నారు అంబటి రాంబాబు. 

ఆ విషయం చెప్పిన తొలి వ్యక్తిని తానేనన్న అంబటి 
పోలవరం ప్రాజెక్టును పలుమార్లు సందర్శించి, సంబంధిత శాఖ అధికారులతో ఎన్నోసార్లు సుదీర్ఘంగా చర్చలు జరిపిన తరువాత ఓ విషయం అర్థమైందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యే ప్రాజెక్టు కాదని చెప్పిన తొలి వ్యక్తిని తానేనని ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. చంద్రబాబు ఇదే విషయాన్ని చెప్పారని, ఇందులో కొత్తదనం ఏముందని ఏపీ ప్రభుత్వాన్ని, టీడీపీ నేతలను ప్రశ్నించారు. 2019కు ముందు చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదం కారణంగానే పోలవరం నేటికి పూర్తి కావడం లేదని మరో సంచలనానికి తెరలేపారు.

2022లోనే పూర్తి చేస్తామన్నాం, కానీ వివరణ ఇచ్చాం 
పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు, ఆయనకు సంబంధించిన మీడియా దుష్ప్రచారం చేస్తోందని, కానీ ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టును జగన్ కాంప్లికేటెడ్ చేశాడు, నాశనం చేశాడని, పోలవరం పూర్తి చేయాలంటే ఇంకా నాలుగేళ్లు పడుతుందని చంద్రబాబు చెప్పారని అంబటి రాంబాబు గుర్తుచేశారు. 2019కి ముందు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి అసెంబ్లీ ఎన్నికలు వెళ్తాని చంద్రబాబు ప్రభుత్వం చెప్పింది. అదే విధంగా 2022లో ప్రాజెక్టు పూర్తిచేసి ఎన్నికలు వెళ్తామని మేం చెప్పాం. కానీ పోలవరంపై పూర్తి స్థాయిలో సమీక్ష చేసి, నివేదికల అనంతరం ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యేది కాదని తాను చెప్పినట్లు అంబటి పేర్కొన్నారు.

‘పోలవరం ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి చేయడానికి మేం ప్రయత్నించాం. ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ చాలా కీలకమైనది. ఎగువ, దిగువ.. రెండు కాఫర్ డ్యామ్ లు కట్టిన తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయాలి. కానీ మీరు ముందుగానే డయాఫ్రమ్ వాల్ కట్టారు. నదిని సైతం డైవర్షన్ చేయాలని ప్రయత్నించారు. ఎందుకంటే 2018లోనే పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లి విజయం సాధించాలని చంద్రబాబు భావించారు. నది డైవర్షన్ వీలుకాకపోవడంతో కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తి కాలేదు. కాఫర్ డ్యామ్ పూర్తయితే.. నది డైవర్షన్ కాలేదు కనుక 54 గ్రామాలు మునిగిపోతాయి. అందుకే నీళ్ల డైవర్షన్ చేసి, కాఫర్ డ్యామ్ లు పూర్తి చేసి డయాఫ్రమ్ వాల్ కట్టాలి. ఈ చారిత్రాత్మక తప్పిదంతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదు. 

ఇప్పుడు పరిస్థితి ఏంటంటే డయాఫ్రమ్ వాల్ కట్టాలి. సమాంతరంగా మరో డయాఫ్రమ్ వాల్ కట్టాల్సి ఉంది. దీనికి అదనంగా మరో రూ.900 కోట్లు ఖర్చు అవుతుంది. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ కట్టకపోతే ఇలాగే జరుగుతుంది. చంద్రబాబు హయాంలో స్పిల్ వే పైనుంచి నీళ్లు వెళ్లాయి. వైసీపీ హయాంలో కాఫర్ డ్యామ్ పూర్తి చేసి గ్రామాలు నీట మునగకుండా చేశాం.  అక్కడ ఇసుక పొరలు ఎక్కువగా ఉండటంతో స్పిల్ వే కట్టేందుకు అవకాశం తక్కువగా ఉంది. దాంతో నిపుణులు గోదావరి నదిని దారి మళ్లించాలని సూచించారు. 

డయాఫ్రమ్ వాల్ వేయడానికి రూల్ ఏంటంటే.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ లు పూర్తి కావాలి. దాంతోపాటు నది ప్రవాహాన్ని దారి మళ్లించాలి. తరువాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తిచేసి, అనంతరం కాఫర్ డ్యామ్ లు తొలగిస్తారు అని అంబటి రాంబాబు తెలిపారు. కానీ వరద రావడం వల్ల కాఫర్ డ్యామ్ కొంతమేర కొట్టుకుపోయింది. నీళ్లు ప్రవహించకుండా జగన్ అడ్డుకోలేదని చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ చేసిన ఒక్క తప్పిదం ఏంటంటే 2022లో పోలవరం పూర్తి చేస్తామని చెప్పడమే అని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు వైఎస్సార్ కల, ఆశయం అని అంబటి వివరించారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Railway Guidelines For Ghee : రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
Embed widget