అన్వేషించండి

YS Jagan: వైఎస్ జగన్‌, వైసీపీ నేతలపై ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘన కేసులు - పిలిచినప్పుడు విచారణకు రావాలని నోటీసులు

Guntur Police: వైఎస్ జగన్ తో పాటు వైసీపీ నేతలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. పిలిచినప్పుడు విచారణకు రావాలని 41ఏ నోటీసులు పోలీసులు ఇచ్చారు.

Election code violation case On Jagan:  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు గుంటూరు జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి.  ఫిబ్రవరి 19, 2025న గుంటూరు మిర్చియార్డులో జగన్ పర్యటించారు. అయితే ఆ పర్యటనకు అనుమతి తీసుకోలేదు. అప్పట్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయినప్పటికీ ఈ పర్యటనకు అనుమతి తీసుకోకుండా.. పర్యటించారు. దీంతో  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు ఆరోపణలపై నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ పర్యటనలో అనుమతి లేకుండా వైసీపీ నేతలు హంగామా సృష్టించారని, నిబంధనలకు విరుద్ధంగా పర్యటన జరిగిందని పోలీసులు తెలిపారు.  

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టని వైసీపీ               

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని నిలబెట్టలేదు. అయినప్పటికీ  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో జగన్ మిర్చి రైతులను పరామర్శించేందుకు యార్డుకు వచ్చారని, అనుమతి లేకుండా ఈ పర్యటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు.  జగన్‌తో పాటు వైసీపీ నేతలు కావటి మనోహర్, లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వెంకటరమణ, కొడాలి నాని, అంబటి రాంబాబు, నందిగం సురేశ్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులపై కేసు నమోదైంది. నల్లపాడు పోలీసులు పై నేతలందరికీ నోటీసులు జారీ చేశారు. పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని సూచించారు.

వైసీపీ ఎన్నికల్లో పాల్గొనకపోయినా, మైక్‌లు వాడకపోయినా కేసు నమోదు చేశారని అంబటి రాంబాబు అప్పట్లో ఆరోపించారు. ఎన్నికల్లో పోటీతో సంబంధం లేకుండా.. రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తే అనుమతి తీసుకోవాల్సి ఉంటుదని పోలీసులు చెబుతున్నారు.   

అభ్యర్థిని నిలబెట్టలేదు కాబట్టి కోడ్ వర్తించదని వైసీపీ నేతల వాదన              

జగన్ మిర్చియార్డు పర్యటనకు ఎలాంటి అనుమతి తీసుకోలేదు.  పోలీసులకు సమాచారం కూడా ఇవ్వలేదు. మిర్చియార్డులో రైతులను పరామర్శించే సమయంలో జగన్ కూడా ఇబ్బంది పడ్డారు.మిర్చికోరు వల్ల మాట్లాడలేకపోయారు. తాను కేవలం రైతుల్ని పరామర్శించానని.. మైక్ తో మాట్లాడలేదని కేవలం వ్యక్తిగత పర్యటనే అని.. దీనికి పోలీసు అనుమతి అవసరం లేదని వైసీపీ నేతలు వాదించారు. కానీ పెద్ద ర్యాలీ నిర్వహించడంతో.. పోలీసులు ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని చెప్పి కేసులు పెట్టారు.                  

ఇక నిబంధనలు అతిక్రమించిన కేసుల్లో కఠిన చర్యలు తీసుకోనున్న పోలీసులు                  

అప్పట్లో కేసులు పెట్టి సైలెంట్ గా ఉండిపోయారు. కానీ ఇటీవలి కాలంలో వైఎస్ జగన్.. పదే పదే  పోలీసులకు ఇచ్చిన అనుమతుల్ని ఉల్లంఘిస్తూ పర్యటనలు చేస్తున్నారు. ఫలితంగా మరణాలుకూడా సంభవిస్తున్నాయి. మళ్లీ ఆయన ప్రభుత్వాన్నే నిందిస్తున్నారు. అందుకే నిబంధనలు ఎక్కడ ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. పాత కేసుల విషయంలోనూ అలాగే చర్యలు ప్రారంభించినట్లుగా భావిస్తున్నారు 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati capital of AP: జగన్ సీఎం అయితే రాజధానిని మార్చలేరా? - ఖచ్చితంగా మార్చవచ్చు.. ఇవే మార్గాలు!
జగన్ సీఎం అయితే రాజధానిని మార్చలేరా? - ఖచ్చితంగా మార్చవచ్చు.. ఇవే మార్గాలు!
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధతపై తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం..
ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధతపై తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం..
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Affordable Mileage Cars: రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
Embed widget