అన్వేషించండి

YS Jagan: వైఎస్ జగన్‌, వైసీపీ నేతలపై ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘన కేసులు - పిలిచినప్పుడు విచారణకు రావాలని నోటీసులు

Guntur Police: వైఎస్ జగన్ తో పాటు వైసీపీ నేతలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. పిలిచినప్పుడు విచారణకు రావాలని 41ఏ నోటీసులు పోలీసులు ఇచ్చారు.

Election code violation case On Jagan:  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు గుంటూరు జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి.  ఫిబ్రవరి 19, 2025న గుంటూరు మిర్చియార్డులో జగన్ పర్యటించారు. అయితే ఆ పర్యటనకు అనుమతి తీసుకోలేదు. అప్పట్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయినప్పటికీ ఈ పర్యటనకు అనుమతి తీసుకోకుండా.. పర్యటించారు. దీంతో  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు ఆరోపణలపై నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ పర్యటనలో అనుమతి లేకుండా వైసీపీ నేతలు హంగామా సృష్టించారని, నిబంధనలకు విరుద్ధంగా పర్యటన జరిగిందని పోలీసులు తెలిపారు.  

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టని వైసీపీ               

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని నిలబెట్టలేదు. అయినప్పటికీ  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో జగన్ మిర్చి రైతులను పరామర్శించేందుకు యార్డుకు వచ్చారని, అనుమతి లేకుండా ఈ పర్యటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు.  జగన్‌తో పాటు వైసీపీ నేతలు కావటి మనోహర్, లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వెంకటరమణ, కొడాలి నాని, అంబటి రాంబాబు, నందిగం సురేశ్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులపై కేసు నమోదైంది. నల్లపాడు పోలీసులు పై నేతలందరికీ నోటీసులు జారీ చేశారు. పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని సూచించారు.

వైసీపీ ఎన్నికల్లో పాల్గొనకపోయినా, మైక్‌లు వాడకపోయినా కేసు నమోదు చేశారని అంబటి రాంబాబు అప్పట్లో ఆరోపించారు. ఎన్నికల్లో పోటీతో సంబంధం లేకుండా.. రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తే అనుమతి తీసుకోవాల్సి ఉంటుదని పోలీసులు చెబుతున్నారు.   

అభ్యర్థిని నిలబెట్టలేదు కాబట్టి కోడ్ వర్తించదని వైసీపీ నేతల వాదన              

జగన్ మిర్చియార్డు పర్యటనకు ఎలాంటి అనుమతి తీసుకోలేదు.  పోలీసులకు సమాచారం కూడా ఇవ్వలేదు. మిర్చియార్డులో రైతులను పరామర్శించే సమయంలో జగన్ కూడా ఇబ్బంది పడ్డారు.మిర్చికోరు వల్ల మాట్లాడలేకపోయారు. తాను కేవలం రైతుల్ని పరామర్శించానని.. మైక్ తో మాట్లాడలేదని కేవలం వ్యక్తిగత పర్యటనే అని.. దీనికి పోలీసు అనుమతి అవసరం లేదని వైసీపీ నేతలు వాదించారు. కానీ పెద్ద ర్యాలీ నిర్వహించడంతో.. పోలీసులు ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని చెప్పి కేసులు పెట్టారు.                  

ఇక నిబంధనలు అతిక్రమించిన కేసుల్లో కఠిన చర్యలు తీసుకోనున్న పోలీసులు                  

అప్పట్లో కేసులు పెట్టి సైలెంట్ గా ఉండిపోయారు. కానీ ఇటీవలి కాలంలో వైఎస్ జగన్.. పదే పదే  పోలీసులకు ఇచ్చిన అనుమతుల్ని ఉల్లంఘిస్తూ పర్యటనలు చేస్తున్నారు. ఫలితంగా మరణాలుకూడా సంభవిస్తున్నాయి. మళ్లీ ఆయన ప్రభుత్వాన్నే నిందిస్తున్నారు. అందుకే నిబంధనలు ఎక్కడ ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. పాత కేసుల విషయంలోనూ అలాగే చర్యలు ప్రారంభించినట్లుగా భావిస్తున్నారు 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
Balakrishna : యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
6 అడుగుల ఆజానుబాహులకు బెస్ట్‌ ఆప్షన్లు - కంఫర్ట్‌తో పాటు రైడింగ్‌ ఫన్‌ ఇచ్చే మోటార్‌సైకిళ్లు!
6 అడుగులకు పైగా ఎత్తున్న 30+ ఏజ్‌ వాళ్లకు బెస్ట్‌ బైక్‌లు - సిటీ రోడ్లకు చక్కగా సరిపోతాయి!
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
Embed widget