అన్వేషించండి

Kiran Rijiju In AP: ఆక్వా రంగంలో ఏపీ టాప్ పాజిషన్ - కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కితాబు

Kiran Rijiju In AP: ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగంలో దేశంలోనే ముందంజులో ఉందని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు.

Kiran Rijiju In AP: ఆక్వా రంగ ఎగుమతులే జీడీపీ ఎదుగుదలలో అత్యంత కీలకమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో మత్స్యసంపద అపారంగా ఉందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పర్యటన..
కేంద్ర భూ విజ్ఞానశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో సముద్ర తీరంలో చేపట్టాల్సిన పలు ప్రతిపాదనలపై ఇరువురు చర్చించారు. మచిలీపట్టణంలోని సముద్ర తీర ప్రాంతాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పరిశీలించారు. స్థానికంగా ఉన్న మత్స్యకారులతో ఆయన సమావేశం అయ్యారు. వారికి కావాల్సిన మౌళిక సదుపాయాలు, లభ్యం అవుతున్న మత్స్య సంపదను గురించి వాకబు చేశారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో...
రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు  వేటుకూరి సూర్యనారాయణరాజు,  పివిఎన్ మాధవ్ లు ఆయనకు స్వాగతం పలికారు. పార్టీ నాయకులతో మంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్దితులు, అధికార పార్టీ అనుసరిస్తున్న విధానాలు, బీజేపీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలను గురించి రాష్ట్ర నాయకత్వం వివరించింది.

సముద్ర తీరం కేంద్రంగా కార్యకలాపాలు...
దేశ వ్యాప్తంగా ఉన్న 7 వేల కిలోమీటర్ల సముద్ర తీరాన్ని కేంద్రంగా చేసుకొని పలు ప్రతిపాదనలను సిద్దం చేశామని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. ఇండియా జీడీపీ ప్రపంచంలోనే అయిదవ స్థానంలో ఉందని, ప్రపంచంలోనే మూడవ స్థానానికి చేరుకోవాలని ప్రధాని‌ నరేంద్ర మోదీ ఆలోచనగా తెలిపారు. ఆక్వా రంగ ఎగుమతులే జీడీపీ ఎదుగుదలలో అత్యంత కీలకంగా ఉన్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మత్స్యసంపద అపారమని, ఈ క్రమంలో తాను సైతం ఆంధ్రప్రదేశ్ ను కేంద్రంగా చేసుకొని పర్యటనలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

మత్స్యకారులకు అధునాతన టెక్నాలజీ...
మత్స్యకారులకి అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తున్నామని కేంద్ర మంత్రి  కిరణ్‌ రిజిజు  వెల్లడించారు.  మత్స్యకారులకి అత్యాధునిక పరికరాలు అందిస్తామని, సముద్రంలో వేటలో ఉండగా వచ్చే ప్రకృతి వైపరీత్యాలు,  ఇతర వాతావరణ సమస్యలు ధీటుగా  ఎదుర్కునే విధంగా  మత్స్యకారులకు అవగాహన కల్పిస్తామన్నారు. సకాలంలో వారికి సమాచారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  టెక్నాలజీ సహకారంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లినపుడు మత్స్య సంపద ఎక్కడ ఎక్కువగా ఉంటుందనేది ముందుగానే తెలియ చేసే సాంకేతికతను అందుబాటులోకి తెస్తామన్నారు. 

ఆక్వాలో ఏపీ టాప్...
ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగంలో దేశంలోనే ముందంజులో ఉందని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. ఆక్వా సాగు పై మరింత సానుకూల పరిస్దితులు తీసుకువచ్చేందుకు అవసరం అయిన సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావటం ద్వారా మరింత అభివృద్ధి ని సాధించగలమని అన్నారు. ఇప్పటికే ఆక్వా రంగంలో ఎగుమతులు ఆశాజనకంగా ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాతావరణ పరిస్దితులు కూడ ఆక్వా రంగానికి ఉపయోగపడుతున్నాయని చెప్పారు. 
Also Read: Sajjala News: ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల క్లారిటీ, షర్మిలపైనా కీలక వ్యాఖ్యలు 

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Breaking News: పార్టీ మారడం లేదన్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. కేక్ కట్ చేసి కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్
పార్టీ మారడం లేదన్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. కేక్ కట్ చేసి కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Rains In AP and Telangana: రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Embed widget