అన్వేషించండి

AP News: రిజిస్ట్రేషన్‌ శాఖలో ఇ–స్టాంపింగ్‌ సేవలు ప్రారంభించిన సీఎం జగన్

రిజిస్ట్రేషన్‌ శాఖలో ఇ–స్టాంపింగ్‌ సేవలు ప్రారంభించిన సీఎం

రిజిస్ట్రేషన్‌ శాఖలో ఇ–స్టాంపింగ్‌ సేవలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఇకపై రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభతరం అవుతాయని ఆయన అన్నారు.
వర్చువల్ గా ఇ స్టాంపింగ్ సేవలను ప్రారంభించిన జగన్..
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ గా ఇ స్టాంపింగ్ సేవలను వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. దీని వలన రిజిస్ట్రేషన్‌ సేవలు ఇక సులభతరం అవుతాయని జగన్ అన్నారు. ప్రజలే నేరుగా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు చెల్లించే విధంగా, ఇ–స్టాంపింగ్‌ విధానం అమలులోకి తీసుకువచ్చామని చెప్పారు. ప్రజలే స్వయంగా దస్తావేజులు తయారు చేసుకుని సులభతరంగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధానం ఆవిష్కరణ జరగటం నూతన శకానికి నాందిగా జగన్ అభివర్ణించారు.
సురక్షితమయిన ఇ–స్టాంపింగ్‌ ప్రయోజనాలు...
ఇ–స్టాంపింగ్‌ విధానం సురక్షితమైందని, భద్రత పరంగా, ఎలాంటి సాంకేతిక సమస్యలు లేనిదని అధికారులు వెల్లడించారు. www.shcilestamp.com వెబ్‌సైట్‌లో, ఇ–స్టాంపింగ్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఇ–స్టాంపులు ఆన్‌లైన్‌లో దృవీకరించుకోవచ్చని, నగదు, చెక్కు, ఆన్‌లైన్‌ (నెఫ్ట్, ఆర్టీజీఎస్, పీఓఎస్, యూపీఐ) ద్వారా సులభంగా చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంది. ఎస్‌బీఐ, ఆప్కాబ్, యూనియన్‌ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన బ్రాంచ్‌లు, సీఎస్‌సీ కేంద్రాలు, స్టాంప్‌ అమ్మకందార్లు, స్టాక్‌హోల్డింగ్‌ బ్రాంచ్‌లు కలిపి మొత్తం 1400 కు పైగా కేంద్రాల వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. మరొక 1000కి పైగా కేంద్రాల వద్ద త్వరలో ఈసేవలు అందుబాటులోకి రానున్నాయని స్పష్టం చేశారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో క్రయవిక్రయాలు నిర్వహించే పౌరులందరూ 1400 కు పైగా ఎంపిక చేసిన కేంద్రాల వద్ద ఇ–స్టాంపింగ్‌ ద్వారా స్టాంప్‌ పేపర్లు కొనుగోలు చేసి సులభంగా స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, యూజర్‌ ఛార్జీలను చెల్లించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్టాంప్‌ మరియు రిజిస్ట్రేషన్‌ శాఖ సెంట్రల్‌ రికార్డు నిర్వహించే ఏజెన్సీ అయిన స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా  ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం అందిస్తున్న మరొక ప్రజాహితమైన కార్యక్రమంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి  డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఐటీ సలహాదారు శేషిరెడ్డి, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్‌ కమిషనర్, ఐజీ రామకృష్ణ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్‌ డీఐజీ (గుంటూరు) జి.శ్రీనివాసరావు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రతినిధులు హజరయ్యారు.

వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా పథకానికి జాతీయ స్థాయి గుర్తింపు.. 
డాక్టర్‌ వైయస్సార్‌ ఉచిత పంటల బీమా పథకానికి జాతీయ స్ధాయిలో గుర్తింపు లభించింది. ఈ మేరకు అవార్డు గెలుచుకోవడంపై వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన పీఎంఎఫ్‌బీవై జాతీయ సదస్సులో ఇన్నోవేషన్‌ కేటగిరీలో ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హరికిరణ్‌కు.. కేంద్ర వ్యవసాయ కార్యదర్శి మనోజ్‌ అహుజా అందించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ను కలిసి, భారత ప్రభుత్వం అందజేసిన అవార్డుకు సంబంధించిన వివరాలను గురించి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సి.హరికిరణ్‌ వివరించారు. అధికారులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత సమర్ధవంతంగా పనిచేయాలని, దిగుబడుల అంచనాలలో టెక్నాలజీ వినియోగం పెంచాలని దిశానిర్ధేశం  చేశారు. సాగు చేసిన ప్రతి ఎకరా పంట వివరాలను అత్యంత పారదర్శకంగా ఈ–క్రాప్‌ ద్వారా నమోదు చేయడం, తద్వారా ఉచిత పంటల బీమా పథకాన్ని కేవలం ఈ–క్రాప్‌ నమోదు ఆధారంగా అమలు చేయడం ద్వారా యూనివర్శల్‌ కవరేజిని సాధించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సొంతం చేసుకుందని అధికారులు చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: గొడ్డలి పార్టీకి ఓటమి భయం.. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
గొడ్డలి పార్టీకి ఓటమి భయం.. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
CM Chandrababu: 31 ఏళ్ల కిందట సీఎంగా తొలిసారి.. ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేను: పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు
31 ఏళ్ల కిందట సీఎంగా తొలిసారి.. ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేను: పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు
Kotamreddy On Vijayasai Reddy Sajjala Issue: చొక్కా పట్టుకుని కొట్టారు.. విజయసాయిరెడ్డి-సజ్జల వివాదంపై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
చొక్కా పట్టుకుని కొట్టారు.. విజయసాయిరెడ్డి-సజ్జల వివాదంపై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
APSRTC: ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. వినూత్న ప్రయోగానికి ఆర్టీసీ నిర్ణయం
ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. వినూత్న ప్రయోగానికి ఆర్టీసీ నిర్ణయం

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raidurgam Hit and Run Incident: రాయదుర్గం హిట్ అండ్ రన్ ఘటనలో ఒకరు మృతి.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడి అరెస్ట్
రాయదుర్గం హిట్ అండ్ రన్ ఘటనలో ఒకరు మృతి.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడి అరెస్ట్
Weapons Missing In Hyderabad: బొల్లారంలో ఆర్మీ మద్రాస్ యూనిట్లో ఆయుధాలు మిస్సింగ్, సెలవు ఇవ్వలేదని ఉద్యోగి నిర్వాకమా?
బొల్లారంలో ఆర్మీ మద్రాస్ యూనిట్లో ఆయుధాలు మిస్సింగ్, సెలవు ఇవ్వలేదని ఉద్యోగి నిర్వాకమా?
Kotamreddy On Vijayasai Reddy Sajjala Issue: చొక్కా పట్టుకుని కొట్టారు.. విజయసాయిరెడ్డి-సజ్జల వివాదంపై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
చొక్కా పట్టుకుని కొట్టారు.. విజయసాయిరెడ్డి-సజ్జల వివాదంపై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana Congress Politics: ఢిల్లీలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ ఏం చెబుతారు! కొండా సురేఖ వెనక్కి తగ్గుతారా..
ఢిల్లీలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ ఏం చెబుతారు! కొండా సురేఖ వెనక్కి తగ్గుతారా..
Vijayawada Crime News: పోలీసులపై కత్తితో దాడి చేసిన నిందితుడు.. కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న సిబ్బంది
పోలీసులపై కత్తితో దాడి చేసిన నిందితుడు.. కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Kitchen Sink Drain : కిచెన్​లో సింక్​తో ప్రాబ్లమా? ప్లంబర్ అవసరం లేకుండా ముసుకుపోయిన సింక్ డ్రెయిన్ ఇలా క్లీన్ చేసేయండి
కిచెన్​లో సింక్​తో ప్రాబ్లమా? ప్లంబర్ అవసరం లేకుండా ముసుకుపోయిన సింక్ డ్రెయిన్ ఇలా క్లీన్ చేసేయండి
CM Chandrababu: 31 ఏళ్ల కిందట సీఎంగా తొలిసారి.. ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేను: పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు
31 ఏళ్ల కిందట సీఎంగా తొలిసారి.. ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేను: పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు
Sadhguru Donation to Nepal: నేపాల్ వరద భాదితులకు సద్గురు రూ.1 కోటి విరాళం, 5 దేశాలతో హిమాలయ బోర్డు ఏర్పాటుకు పిలుపు
నేపాల్ వరద భాదితులకు సద్గురు రూ.1 కోటి విరాళం, 5 దేశాలతో హిమాలయ బోర్డు ఏర్పాటుకు పిలుపు
Embed widget