అన్వేషించండి

Discoms on Power Supply: నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా, పవర్ కట్స్ పై ఏపీ విద్యుత్‌ పంపిణీ సంస్థల వివరణ ఇలా

Discoms on Power Supply: రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా జరుగుతుందని, రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రకటించాయి.

Discoms on Power Supply: 
రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా జరుగుతుందని, రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రకటించాయి. సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు స్వల్పకాలిక మార్కెట్‌ నుంచి రోజుకి దాదాపు 40 మిలియన్‌ యూనిట్లు ప్రతి యూనిట్‌ కు రూ  9.10 వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. 

పంపిణి సంస్థల వివరణ ఎంటేంటే...
 రాష్ట్రంలో  అన్నిరంగాలకు ఎలాంటి కోతలు, పరిమితులు లేకుండా నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసినట్లు  విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రకటించాయి. ఈనెల ఒకటో తేదీన  డిమాండు  సరఫరా మధ్య స్వల్ప అంతరం ఏర్పడిన సమయంలో పారిశ్రామిక రంగానికి స్వల్పంగా విద్యుత్‌ సరఫరా తగ్గించి గృహ, వ్యవసాయ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డిస్కంలు స్పష్టం చేశాయి. రాష్ట్రంలో ఆదివారం మొత్తం 206.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సరఫరా జరిగిందని, రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్‌ సరఫరాలో ఏ విధమైన  అంతరాయాలు కానీ లోడ్‌ షెడ్డింగ్‌ కానీ లేదని స్పష్టం చేశారు. 
సెప్టెంబర్‌ 1వ తేదీన రాష్ట్రంలో నెలకొన్న గ్రిడ్‌ డిమాండ్‌ – సరఫరా  పరిస్థితులను బట్టి పారిశ్రామిక రంగానికి కొద్దిమేర విద్యుత్‌ సరఫరా తగ్గించి, ప్రాధాన్యతా రంగాలైన గృహ, వ్యవసాయ రంగాలను ప్రాధాన్యం ఇచ్చి అంతరాయాలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేసినట్లు పేర్కొన్నాయి. వ్యవసాయ, గృహ వినియోగ రంగాలను పాధాన్యతా రంగాలుగా పరిగణించి అంతరాయాలు లేని విద్యుత్‌ సరఫరా చేయాలని  విద్యుత్‌ సంస్థలు భావించినట్లుగా తెలిపారు. ఇందులో భాగంగానే డిమాండు ఎక్కువగా ఉన్నప్పుడు పరిశ్రమలకు కొంత మేరకు సరఫరా తగ్గించి వ్యవసాయ, గృహ వినియోగదారులకు పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరా చేస్తామని  విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌ కు డిస్కింలు తమ అభ్యర్ధన పంపాయి. విద్యుత్‌ పంపిణీ సంస్థల అభ్యర్ధన  మేరకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి సెప్టెంబర్ 2న ఈనెల 5 వ తేదీ నుంచి  రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి  స్వల్పంగా  విద్యుత్‌ వాడకంలో పరిమితులు విధించవచ్చని  ఆదేశాలు ఇచ్చారు. 

పరిశ్రమలకు పరిమితుల తొలగింపు 
మారిన వాతావరణ పరిస్థితులు, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న  అల్పపీడన  పరిస్థితులతో పడుతున్న వర్షాల దృష్ట్యా గ్రిడ్‌ డిమాండ్‌ కొంత మేర తగ్గిందని వెల్లడించాయి. గత రెండు రోజులుగా  ఎటువంటి విద్యుత్‌  కొరత లేదని, విద్యుత్‌ సౌధ లో సోమవారం ట్రాన్స్‌కో సీఎండీ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కె. విజయానంద్‌  ట్రాన్స్‌కో, జెన్‌కో, ఏపీపీసీసీ అధికారులతో రాబోయే రెండు వారాలపాటు విద్యుత్‌ డిమాండు, సరఫరా పరిస్థితిపై కూలంకుషంగా సమీక్షించారు. ప్రస్తుతం  లోడ్‌ కొద్దిమేర తగ్గి  సరఫరా పరిస్థితి మెరుగుపడటంతో పారిశ్రామిక వినియోగదారులకు అధికారిక లోడ్‌ షెడ్డింగ్‌  విధించే  అవసరం ఉందని, పేర్కొన్నాయి. దీంతో విద్యుత్‌ పంపిణీ సంస్థలు  పారిశ్రామిక రంగానికి  విద్యుత్‌ వాడకంపై పరిమితి  నిబంధనల అమలును రద్దు చేసుకున్నట్లుగా తెలిపారు.  వినియోగదారులందరూ  ఈ విషయాన్ని  గ్రహించాలని,   రాష్ట్రంలో  ఏవిధమైన లోడ్‌ షెడ్డింగ్‌ కానీ, విద్యుత్‌ వాడకంలో పరిమితులు కానీ  లేవని స్ఫష్టం చేశాయి. మెరుగుపడిన సరఫరా పరిస్థితి వల్ల  కమిషన్‌ ఇచ్చిన  పారిశ్రామిక  విద్యుత్‌  వాడకంలో  పరిమితి – నియంత్రణ  ఉత్తర్వులను  అమలు చేయడం లేదన్నారు.  ఈ విషయం   కమిషన్‌ కు నివేదించాలని  పంపిణీ సంస్థలు నిర్ణయం తీసుకున్నాట్లుగా తెలిపారు. 

సెప్టెంబర్‌ నెల 15 వ తేదీ వరకు స్వల్పకాలిక  మార్కెట్‌ నుండి  రోజుకి దాదాపు 40 మిలియన్‌ యూనిట్లు ప్రతి  యూనిట్‌  కు రూ  9.10 వెచ్చించి వినియోగదారుల సౌకర్యార్ధం కొనుగోలు చేస్తున్నట్లుగా డిస్కింలు వెల్లడించాయి. సరఫరా పరిస్థితి అదుపు తప్పకుండా నిరంతరాయం అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నారని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా  గృహ,  వ్యవసాయ, వాణిజ్య – పారిశ్రామిక  రంగాలకు సరఫరా అంతరాయం లేకుండా చేయడానికి అన్ని రకాలుగా  కృషి  చేస్తున్నట్లు ప్రకటించాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
New Kia Seltos: అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
Dhandoraa OTT : ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget