అన్వేషించండి

Andhra Pradesh Assembly: ఏపీ అసెంబ్లీలో ఇక డిజిటల్ అటెండన్స్ - స్పీకర్ కీలక నిర్ణయం - వైసీపీ ఎమ్మెల్యేల కోసమే !

Digital attendance : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇక డిజిటల్ అటెండెన్స్ అమలు చేస్తున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Digital attendance in Ap Assembly: ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష వ్యూహాలకు అడ్డుకట్ట వేస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీసుకున్న సాంకేతిక నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.  ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సంప్రదాయ అటెండెన్స్ విధానానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వస్తి పలికారు. వైసీపీ సభ్యులు సభకు హాజరు కాకుండానే బయట రిజిస్టర్లలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నందున ఈసారి  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  ఆధారిత డిజిటల్ అటెండెన్స్  వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం, ఎమ్మెల్యేలు కేవలం లాబీల్లో సంతకాలు చేస్తే సరిపోదు.. సభ లోపలికి వచ్చి తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటేనే అక్కడ అమర్చిన ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు వారి ముఖాలను గుర్తించి హాజరును నమోదు చేస్తాయి.           

జగన్ కు ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకూ అసెంబ్లీ బహిష్కరిస్తామని ప్రకటన       

 జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. అయితే, రాజ్యాంగ నిబంధనల ప్రకారం వరుసగా 60 రోజుల పనిదినాల పాటు సభకు గైర్హాజరైతే సభ్యత్వం రద్దయ్యే ప్రమాదం ఉంది. ఈ ముప్పు నుంచి తప్పించుకోవడానికి, కేవలం రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్ళిపోతున్నారు కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు.  కానీ, స్పీకర్ తెచ్చిన కొత్త  ఏఐ నిబంధనతో ఇప్పుడు వారు కచ్చితంగా సభ లోపలికి అడుగుపెట్టాల్సిందే. లోపలికి వచ్చి సీట్లలో కూర్చున్నారంటే, అది సాంకేతికంగా అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లే అవుతుంది.                       

దొంగ సంతకాలు పెట్టిపోతున్నారని స్పీకర్ ఆగ్రహం                                  

గవర్నర్ ప్రసంగం  ఒక్క రోజే హాజరు కావాలనుకుంటున్న  నేతలకు ఈ డిజిటల్ నిఘా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సభ జరుగుతున్నంత సేపు సీట్లలో కూర్చుని అటెండెన్స్ రికార్డ్ చేయించుకోకపోతే, ఆ రోజు వారు గైర్హాజరైనట్లుగానే పరిగణిస్తారు.  వరుసగా ఇలాంటి గైర్హాజరు నమోదైతే అనర్హత వేటు పడే అవకాశం ఉండటంతో, ఇష్టం లేకపోయినా సభలో కూర్చోవాల్సిన అనివార్య పరిస్థితి వైసీపీ సభ్యులకు ఏర్పడింది. కేవలం సాంకేతికతను ఉపయోగించి ప్రతిపక్షం అనుసరిస్తున్న  సంతకాల రాజకీయాన్ని స్పీకర్ అడ్డుకున్నట్లేనని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.                                

కొత్త వ్యవస్థతో అసెంబ్లీకి హాజరు తప్పని సరి                  

ప్రజల సమస్యలపై చర్చించాల్సిన ప్రజాప్రతినిధులు, కేవలం పదవులను కాపాడుకోవడానికి పడుతున్న పాట్లను ఈ వ్యవస్థ ఎండగడుతోంది. కేవలం జీతభత్యాలు, పదవి రక్షణ కోసం కాకుండా, సభా మర్యాదలను గౌరవించి చర్చల్లో పాల్గొనేలా చేయడమే ఈ ఏఐ అటెండెన్స్ ప్రధాన ఉద్దేశమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆధునిక సాంకేతికతతో అసెంబ్లీలో సభ్యుల జవాబుదారీతనం పెరుగుతుందని,  దొంగ సంతకాల  సంస్కృతికి శాశ్వతంగా తెరపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
AP CM Chandrababu: బెంగాల్‌లో రాష్ట్రపతికి చేదు అనుభవం.. ఘాటుగా స్పందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
బెంగాల్‌లో రాష్ట్రపతికి చేదు అనుభవం.. ఘాటుగా స్పందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Vijaya brand controversy: విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పాలు - ఏపీ లింక్ - గుత్తా అమిత్ సంచలన వ్యాఖ్యలు
విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి, పాలు - ఏపీ లింక్ - గుత్తా అమిత్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
IND vs NZ T20 World Cup 2026 Final: భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన SKY
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget