అన్వేషించండి

AP Ration Ragada : ఏపీలో కోటి మందికి రేషన్ కట్ చేస్తున్నారా..? నిజమేంటి..?

నెలాఖరులోపు రేషన్ తీసుకునే వారందరూ ఈ-కేవైసీ చేయించుకోకపోతే సరుకులు నిలిపివేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ-కేవైసీ చేయించుకోవడానికి పేదలు పోటీ పడుతున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు ఉన్న పేద ప్రజలంతా ఆధార్ సెంటర్ల వద్దకు క్యూ కట్టారు. రేషన్ కార్డులో ఉన్న కుటుంబసభ్యులందరూ ఈ-కేవైసీ చేయించుకోకపోతే వారికి వచ్చే నెల నుంచి రేషన్ ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంగా పనులు మానుకుని పేదలంతా ఆధార్ సెంటర్ల ముందు బారులు తీరుతున్నారు. అక్కడక్కడా తొక్కిసలాట జరుగుతోంది. 

వంద శాతం లబ్దిదారుల ఈ-కేవైసీ పూర్తి చేయాలని ఏపీ లక్ష్యం..! 

కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా రేషన్ తీసుకునే విధంగా సంస్కరణలు తీసుకు వచ్చింది. ఈ సంస్కరణలు అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది. అలా అమలు చేసినందుకు అదనపు రుణం కూడా ఏపీ ప్రభుత్వానికి మంజూరు చేసింది. ఈ సంస్కరణలు పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే తమ రాష్ట్రంలో ఉన్న లబ్దిదారులందరి ఈ - కేవైసీని పూర్తి చేయాల్సి ఉంది. అలా పూర్తి చేస్తేనే మాన్యువల్ పద్దతి నుంచి ఈ పోస్ యంత్రాల ద్వారా రేషన్ ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ పూర్తిచేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోంది. కేంద్రం ఈ - కేవైసీకి పూర్తి స్థాయిలో ఒత్తిడి తేవడానికి కారణం పక్కదారి పడుతున్న రేషన్‌ను కాపాడుకోవడమే. అనర్హులు, చనిపోయినవారు, వలస వెళ్లినవారు ఇలా అనేక మంది ఈ-కేవైసీ చేయించుకోలేరు. దాని వల్ల వారిని అర్హుల జాబితా నుంచి తొలగించవచ్చు.

వాలంటీర్లు సహకరించడం లేదని ఆధార్ కేంద్రాలకు లబ్దిదారుల పరుగు..! 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  కేంద్ర సంస్కరణలను వేగంగా అమలు చేసే విధానంలో భాగంగా వచ్చే నెలలోపు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. ఈ-కేవైసీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయకపోతే రేషన్ పంపిణీ నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఏపీలో దాదాపుగా కోటి యాభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా  4 కోట్ల 31 లక్షల మందికి రేషన్ పంపిణీ చేస్తున్నారు. వీరిలో దాదాపుగా కోటి మంది ఇప్పటికీ ఈ కేవైసీ చేయించుకోలేదు. ప్రభుత్వం వాలంటీర్లకు బాధ్యతలు అప్పగించింది. కానీ వాలంటీర్లు ఇదో అదనపు పనిగా భావించి పెద్దగా పట్టించుకోవడంలేదు. దీంతో ఎక్కువ మంది ఆధార్ కేంద్రాలకు వెళ్తున్నారు. దీంతో గందరగోళం ఏర్పడుతోంది. నిజానికి ఈ - కేవైసీ చేయించుకోవడానికి ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన పనిలేదు. 

వాలంటీర్లు చేస్తారు కంగారు వద్దన్న ప్రభుత్వం ! 

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ -కేవైసీ నమోదు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఏపీలో ఇంకా పది శాతం మందికిపైగా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాల్సి ఉందని... రేషన్ కార్డులను తొలగిస్తామని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పౌర సరఫరాల శాఖ ఎక్స్ ఆఫీసియో సెక్రటరీ కోన శశిధర్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ చేయించుకోవాలని అలా చేయించుకుంటే ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చన్నారు. అసలు ఆధార్ కార్డు లేని వాళ్లు మాత్రమే .. ఆధార్ నమోదు చేయించుకోవాలని మిగతా వారికి వాలంటీర్ ఈ-కేవైసీ చేస్తారని శశిధర్ స్పష్టం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kadapa Tipu Sultan Issue: కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
Jana Sena leader allegations: పోర్ట్ స్టేడియం లీజు వ్యవహారంలో భారీ కుంభకోణం - జనసేన తీవ్ర ఆరోపణలు
పోర్ట్ స్టేడియం లీజు వ్యవహారంలో భారీ కుంభకోణం - జనసేన తీవ్ర ఆరోపణలు
YSRCP: డిజిటల్ వార్‌కు వైఎస్ఆర్‌సీపీ భారీ ఏర్పాట్లు - జగనన్న టెక్ ఫోర్స్ రెడీ - ఏపీలో పొలిటికల్ వార్ అంతా ఆన్‌లైన్లోనే!
డిజిటల్ వార్‌కు వైఎస్ఆర్‌సీపీ భారీ ఏర్పాట్లు - జగనన్న టెక్ ఫోర్స్ రెడీ - ఏపీలో పొలిటికల్ వార్ అంతా ఆన్‌లైన్లోనే!
Collectors meeting second day: ఆగస్టు 15న రెండున్నర లక్షల ఇళ్ల గృహప్రవేశాలు - కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం
ఆగస్టు 15న రెండున్నర లక్షల ఇళ్ల గృహప్రవేశాలు - కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Josh Inglis Smashes Fastest Fifty: చెపాక్ మైదానంలో జోష్ ఇంగ్లిస్ విధ్వంసం.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన లక్నో హిట్టర్! సరికొత్త ఐపీఎల్ రికార్డు
చెపాక్ మైదానంలో జోష్ ఇంగ్లిస్ విధ్వంసం.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన లక్నో హిట్టర్! సరికొత్త ఐపీఎల్ రికార్డు
Who is S Keerthana: విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
Tamil Nadu Cabinet Ministers: తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
KTR: ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీకి షాక్! బండి సంజయ్ కుమారుడ్ని అరెస్ట్ చేయకపోవడంపై కేటీఆర్ ఫైర్
ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీకి షాక్! బండి సంజయ్ కుమారుడ్ని అరెస్ట్ చేయకపోవడంపై కేటీఆర్ ఫైర్
Tamil Nadu CM Vijay: విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతున్న ఫస్ట్ తమిళ్ సినిమా... జన నాయగన్ కాదు - అయినా దళపతికి స్పెషల్
విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతున్న ఫస్ట్ తమిళ్ సినిమా... జన నాయగన్ కాదు - అయినా దళపతికి స్పెషల్
CM Vijay: సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 3 ఫైళ్లపై విజయ్ సంతకాలు.. అధికారులకు కీలక ఆదేశాలు
సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 3 ఫైళ్లపై విజయ్ సంతకాలు.. అధికారులకు కీలక ఆదేశాలు
Agnimitra Paul: ఎవరీ అగ్నిమిత్ర పాల్? 23 క్రిమినల్ కేసులు... బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నుంచి బెంగాల్ బీజేపీ క్యాబినెట్‌లోకి
ఎవరీ అగ్నిమిత్ర పాల్? 23 క్రిమినల్ కేసులు... బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నుంచి బెంగాల్ బీజేపీ క్యాబినెట్‌లోకి
Anna Konidela : అమ్మతో పవన్ కల్యాణ్... బిడ్డతో అన్నా లెజినోవా - రేర్ ఫ్యామిలీ ఫోటో
అమ్మతో పవన్ కల్యాణ్... బిడ్డతో అన్నా కొణిదెల - రేర్ ఫ్యామిలీ ఫోటో
Embed widget