అన్వేషించండి

CM Jagan: ఎన్నికల వేళ మహిళలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్, ఈ నెల 7న నిధులు విడుదల

YSR Cheyutha: వైఎస్సార్ చేయూత నిధులను ఈ నెల 7వ తేదీన సీఎం జగన్ విడుదల చేయనున్నారు. మహిళల అకౌంట్లలో నిధులు జమ చేయనున్నారు.

YSR Congress Party: ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంక్షేమ పథకాల నిధులను విడుదల చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేయాల్సిన డబ్బులను ముందే విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా మరో సంక్షేమ పథకం నిధులను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. అవే వైఎస్సార్ చేయూత పథకం నిధులు. ఈ నెల 7వ తేదీన  అనకాపల్లిలో కంప్యూటర్ బటన్ నొక్కి వైఎస్సార్ చేయూత డబ్బులను మహిళల అకౌంట్లలో సీఎం జగన్ జమ చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. జగన్ సభకు అధికారులు  ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉన్న మహిళలకు  ఏడాదికి రూ.18,750  ఇస్తున్నారు. ఇప్పుటికే మూడు విడతలుగా ఇవ్వగా.. చివరి విడత నిధులను 7న జమ చేయనున్నారు.

ఈ పథకంలో 31 లక్షల 23 వేల 466 మంది మహిళలు లబ్ధిదారులుగా ఉండగా.. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రూ.14, 129 కోట్లు అందించారు. ఎన్నికల వేళ వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు నిధులతో పాటు లేఖలు అందించనున్నారు. వైఎస్ జగన్ పేరుతో ఉన్న ఈ లేఖలను మహిళలకు వాలంటీర్లు అందించనున్నారు. ఈ లేఖలో ఇప్పటివరకు ఎన్ని నిధులు ఇచ్చామనే లెక్కలతో పాటు తమ ప్రభుత్వానికి అండగా ఉండాలనే ఎన్నికల సందేశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. మార్చి 10 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశమున్న నేపథ్యంలో మహిళలను ఆకట్టుకునేందుకు వైఎస్సార్ చేయూత నిధులను జగన్ విడుదల చేస్తున్నారు. మహిళల ఓట్లను ఆకట్టుకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోని మహిళలకు ఏడాదికి రూ.18,750 ఆర్థిక సాయం చేస్తున్నారు. అనకాపల్లిలో జరిగే సభలో మహిళలకు జగన్ మరిన్ని ఎన్నికల హామీలపై ప్రకటన చేసే అవకాశముందని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళల దినోత్సవం జరగనుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని 7వ తేదీన వైఎస్సార్ చేయూత నిధులు విడుదల చేస్తున్న జగన్.. మహిళలకు వరాలు ప్రకటించే అవకాశముందని సమాచారం. ఇప్పటికే 78.94 లక్షల మందికి వైఎస్సార్ ఆసరా ద్వారా జగన్ సర్కార్ డ్వాక్రా రుణమాఫీ చేసింది. వచ్చే ఎన్నికల్లో మహిళా ఓటు బ్యాంక్‌ను ఆకట్టుకునేందుకు మరోసారి డ్వాక్రా రుణమాఫీపై జగన్ హామీ ఇచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు ఈ నెల 10వ తేదీన అద్దంకిలో సిద్దం సభకు వైసీపీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభలో వైసీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టోపై దాదాపు కసరత్తు పూర్తైంది. మేనిఫెస్టోను కూడా సిద్దం చేశారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ హామీలను మేనిఫెస్టోలో పొందుపర్చినట్లు టాక్ నడుస్తోంది. అలాగే ఆసరా ఫించన్లను రూ.4 వేలకు పెంచడంపై కూడా మేనిఫెస్టోలో హామీ ఇవ్వనున్నారని సమాచారం. అలాగే రూ.400కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి హామీలు ఉండే అవకాశముంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Embed widget