అన్వేషించండి

CM Delhi Tour : 26న ఢిల్లీకి ఏపీ సీఎం జగన్ - ఎజెండా ఏమిటంటే ?

సీఎం జగన్ 26వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ రోజు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు.

 

CM Delhi Tour :   ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు.   ఈ ఈనెల 27న జరగబోయే నీతి ఆయోగ్‌ కీలక సమావేశానికి సీఎం జగన్‌ హాజరు కానున్నారు. సీఎం జగన్‌ నీతి ఆయోగ్‌ సమావేశం అనంతరం ప్రధాని మోడీ, హోం శాఖా మంత్రి అమిత్‌ షాలతో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరుతూ సీఎంవో వర్గాలు పీఎంవోకు సమాచారం అందిచినట్లు ;తెలుస్తోంది. అదే క్రమంలో అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌కు కూడా సీఎంవో వర్గాలు ఆయన పేషీకి సమాచారం అందించారు.  ఈనెల 27వ తేదీన నీతి ఆయోగ్‌ బృందం ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో సమావేశం కానుంది. 

ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు లేదా ఆర్థికశాఖ మంత్రులు పాల్గొనున్నారు. ఇందుకోసం సీఎం జగన్‌ ఈనెల 26వ తేదీ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. అదే రోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను కలుసుకునే అవకాశం ఉంది. మరుసటి రోజు విజ్ఞాన్‌ భవన్‌లో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొంటారు.ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయడంపై ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. అలాగే విభజన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌, నిధులు విధుల విభజన, ప్రత్యేక హోదా గురించి మాట్లాడనున్నారు. పునర్విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9లో పొందుపరిచిన 91 సంస్థల ఏర్పాటు, షెడ్యూల్‌ 10 కింద చేర్చిన 142 ఇతర సంస్థల విభజన అంశాన్ని నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్ ప్రస్తావించే అవకాశం ఉంది.  

గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్ కేటగిరీలో చేర్చిన ఈసీ- జనసేన నుంచి జారిపోయినట్టేనా!`
   
అదే రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మోదీ అపాయింట్‌మెంట్‌ కోసం ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నీతి ఆయోగ్‌ ముగిసిన తరువాత సీఎం జగన్‌ ప్రధానితో భేటీ అయ్యేలా అధికారులు షెడ్యూల్ రెడీ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మోదీ, అమిత్ షాలతో రాజకీయ చర్చలు కూడా జరిపే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి తాము ఎప్పుడూ వ్యతిరేకంగా లేమని అందుకే ఏపీలో తమకు వ్యతిరేకంగా ఏర్పడే కూటమిలో చేరవద్దని విజ్ఞప్తి చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల తర్వాత కూడా తమ మద్దతు పూర్తిగా బీజేపీకే ఉంటుందనే హామీ జగన్ ఇస్తారని అంటన్నారు. 

ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన అవినాష్- వెకేషన్ బెంచ్‌ ముందుకు వచ్చేలా ప్రయత్నాలు

మరో వైపు వైసీపీ విముక్త ఏపీ కోసం..  తాము కృషి చేస్తామని బీజేపీ నేతలు కూడా కలిసి రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిస్తున్నారు. పవన్ ప్రతిపాదనను హైకమాండ్ వద్ద పెట్టామని చెబుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ తీసుకునే నిర్ణయాలు కీలకం కాబోతున్న తరుణంలో జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు  చేసుకునే అవకాశం ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Janasena Party Structure Restructuring: పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - నిర్మాణ సమాచార సేకరణ కమిటీల నియామకం.. జనసైనికులే కాబోయే నాయకులు!
పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - నిర్మాణ సమాచార సేకరణ కమిటీల నియామకం.. జనసైనికులే కాబోయే నాయకులు!
Breaking News: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్
బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్
AP Employees Retirement Age Increase : ఏపీలో ఉద్యోగులకు పదవీ విరమణ వయసు మరో రెండేళ్లు..  చంద్రబాబు వ్యూహం ఏమిటి?
ఏపీలో ఉద్యోగులకు పదవీ విరమణ వయసు మరో రెండేళ్లు..  చంద్రబాబు వ్యూహం ఏమిటి?
Chandrababu Naidu Jonnagiri Gold Mines: తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవాలాయల చుట్టూ జగన్ - జొన్నగిరిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవాలాయల చుట్టూ జగన్ - జొన్నగిరిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Jonnagiri Gold Mines: తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవాలాయల చుట్టూ జగన్ - జొన్నగిరిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తప్పులు కప్పిపుచ్చుకోవడానికి దేవాలాయల చుట్టూ జగన్ - జొన్నగిరిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో అసలేం జరిగింది? సీఐ నాగరాజు చేసిన తప్పిదాలివే
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో అసలేం జరిగింది? సీఐ నాగరాజు చేసిన తప్పిదాలివే
ఏపీలో ఉద్యోగులకు పదవీ విరమణ వయసు మరో రెండేళ్లు..  చంద్రబాబు వ్యూహం ఏమిటి?
AP Employees retirement age increase | ఏపీలో ఉద్యోగులకు పదవీ విరమణ వయసు మరో రెండేళ్లు..  చంద్రబాబు వ్యూహం ఏమిటి?
Muharram Holiday 2026: మొహర్రం సెలవు జూన్ 25 or 26? ఆషూరా తేదీ, ప్రభుత్వ సెలవు ఎప్పుడు?
మొహర్రం సెలవు జూన్ 25 or 26? ఆషూరా తేదీ, ప్రభుత్వ సెలవు ఎప్పుడు?
Telangana New CS: తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు! గతంలో ఇక్కడ పనిచేసిన ఐఏఎస్
తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు! గతంలో ఇక్కడ పనిచేసిన ఐఏఎస్
Cristiano Ronaldo Ignores Lionel Messi: మెస్సి పేరు వినగానే రొనాల్డోకు పెరిగిన బీపీ.. విలేకరిపై మొహం తిప్పేస్తూ లైవ్ లోనే షాకింగ్ రియాక్షన్ 
మెస్సి పేరు వినగానే రొనాల్డోకు పెరిగిన బీపీ.. విలేకరిపై మొహం తిప్పేస్తూ లైవ్ లోనే షాకింగ్ రియాక్షన్
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ.. ఇరాన్‌పై సైనిక చర్యను అడ్డుకుంటూ అమెరికా సెనేట్ తీర్మానం!
డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ.. ఇరాన్‌పై సైనిక చర్యను అడ్డుకుంటూ US సెనేట్ తీర్మానం
Magnesium Deficiency : మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్ పెరుగుతుందా? బీపీ, నిద్ర, గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం ఇదే
మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్ పెరుగుతుందా? బీపీ, నిద్ర, గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం ఇదే
Embed widget