అన్వేషించండి

CM Jagan Europe Tour : నెలాఖరులో యూరప్ టూర్‌కు సీఎం జగన్..! కారణం ఏమిటంటే..?

యూరప్ టూర్‌కు వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు. కుటుంబ సమేతంగా ఆయన వెళ్లనున్నారు. పెద్ద కుమార్తె చదువుల నిమిత్తం వెళ్తున్నట్లుగా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ నెలాఖరులో ఆయన కుటుంబసభ్యులతో కలిసి యూరప్‌లో పర్యటించే అవకాశం ఉంది. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటనగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఐదు రోజుల పాటు లండన్, పారిస్‌లలోని పర్యాటక ప్రాంతాలను ఆయన సందర్శించే అవకాశం ఉంది. అయితే జగన్ వెళ్లేది వ్యక్తిగత పర్యటనే కానీ పర్యాటక  ప్రాంతాలు చూసేందుకు కాదని కుమార్తె చదువు అంశంపై అని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి కుమార్తె హర్షా రెడ్డి గతంలో లండన్‌లోని ప్రసిద్ధ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆ తర్వాత ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత బిజినెస్‌ స్కూల్ అయిన ఇన్‌సీడ్ క్యాంపస్‌లో సీటు దక్కించుకున్నారు. 
  
గత ఏడాది ఆగస్టులో ఆమె ఇన్‌సీడ్ క్యాంపస్‌లో చేరేందుకు వెళ్లే సమయంలో సీఎం జగన్ ప్రత్యేకంగా బెంగళూరు వెళ్లి సెండాఫ్ ఇచ్చి వచ్చారు.  లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చేర్పించడానికి 2017లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ స్వయంగా లండన్ వెళ్లారు. ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభించే ముందు ఓ సారి కుమార్తెను చూసి వచ్చారు. అక్కడ ఇన్‌సీడ్ క్యాంపస్‌లో జరిగే కార్యక్రమంలో తల్లిదండ్రులు కూడా పాల్గొనాల్సి ఉంటుంది కాబట్టి.. అందుకే వెళ్తున్నారని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ చిన్న కుమార్తె కూడా అమెరికాలో విద్యనభ్యసిస్తున్నారు. కరోన ాకారణంగా ఆమె ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చినట్లుగా తెలుస్తోంది. 
  
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్‌ మోహన్ రెడ్డికి ఇది మూడో విదేశీ పర్యటన. ఇంతకు ముందు జరిపిన రెండు పర్యటనలు కూడా పూర్తి వ్యక్తిగత పర్యటనలే. బాధ్యతలు చేట్టిన కొత్తలో ఓసారి జెరూసలెం వెళ్లారు. అది ఆధ్యాత్మిక పర్యటన. ఆ తర్వాత మరోసారి ఆమెరికా వెళ్లారు. తన చిన్న కుమార్తెను అక్కడ ఓ కాలేజీలో చేర్పించేందుకు వెళ్లారు. అది కూడా పూర్తి వ్యక్తిగత పర్యటనే. అయితే అక్కడ వైసీపీ ఎన్నారై విభాగం నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు యూరప్‌కు వెళ్లడం మూడో విదేశీ పర్టన అవుతుంది. 

జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో బెయిల్‌ మీద ఉన్నారు. బెయిల్ షరతుల్లో భాగంగా.. ఆయన విదేశాలకు వెళ్లాలంటే.. కోర్టు పర్మిషన్ తీసుకోవాలి.  అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి డిప్లమాటిక్ పాస్ పోర్ట్ తీసుకున్నారు.  డిప్లమాటిక్ పాస్ పోర్టుతో చాలా దేశాలకు వీసా తీసుకోకుండా నేరుగా వెళ్లిపోవచ్చు. కానీ కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. ఈ మేరకు సీబీఐ కోర్టులో పర్మిషన్ తీసుకున్నారో లేదో స్పష్టత లేదు. 

 

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget