అన్వేషించండి

YSRCP : గందరగోళంలో వైసీపీ అధినేత జగన్ - ఆఖరి సిద్ధం సభపై నీలినీడలు - కెబినెట్ భేటీ అయినా ఉంటుందా ?

CM Jagan : ఎన్నికలకు వెళ్లే ముందు కొన్ని రకాల పనులు చేయాలనుకున్న సీఎం జగన్‌కు పరిస్థితులు అనుకూలించడం లేదు. ప్రధాని మోదీని కలవాలనుకున్నా అపాయింట్‌మెంట్ దొరకడం లేదు.

CM Jagan :  ఆఖరి సిద్ధం సభలో మేనిఫెస్టో ప్రకటించేందుకు సీఎం జగన్ రెడీ అయ్యారు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అద్దంకిలో ఆఖరి సిద్దం సభను నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే సభ రెండు సార్లు వాయిదా పడింది. చివరిగా పదో తేదీని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు రోజులకో సారి సభా ఏర్పాట్లను పరిశీలిస్తున్న విజయసాయిరెడ్డి పదిహేను లక్షల మంది వస్తారని అంచనా అని ప్రకటిస్తున్నారు. అయితే సిద్ధం సభ మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

సీఎం  జగన్  ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో సమావేశవ్వాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు. అపాయింట్‌మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోదీ  దగ్గర భరోసా తీసుకుని కొత్త కొత్త  స్కీముల్ని ఇంప్లిమెంట్ చేసి.. ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు. ఇందు కోసమే ఆఖరి మంత్రి వర్గ సమావేశాన్ని కూడా ప్లాన్ చేశారు. ఇప్పటికే కొత్తగా పెట్టాల్సిన కొన్ని స్కీములపై పార్టీ నేతలు, సీనియర్లతో చర్చించారు. ఈ ప్రకారం రైతు, డ్వాక్రా రుణ మాఫీ చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే అధికారంలో ఉన్నాం కాబట్టి హామీలు ఇస్తే బలంగా ఉండవని పాక్షికంగా అమలు చేసేందుకు జీవోలు రిలీజ్ చేసి అయినా ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నారు. అందు కోసం కొంత అర్థికపరమైన మద్దతు అవసరం. 

ప్రధాని మోదీని  కలిసి ఇదే అంశంపై విజ్ఞప్తి చేయాలని అనుకుంటున్నట్లగా తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏపీకి ఇచ్చే అప్పు పరిమితిలో ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ ఏడాదే ఇస్తే.. రెండు స్కీముల్ని పరిమితంగా అమలు చేసేందుకు జీవో ఇచ్చి.. కొంత మంది కి రుణమాఫీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాలా బిజీగా ఉన్నారు. పదమూడో తేదీ వరకు తీరిక లేని పర్యటనలు ఉండనున్నాయి. పదమూడో తేదీ లేదా ఆ తర్వాత రోజు ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. అప్పటి వరకూ మోదీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను చుట్టేయనున్నారు. ఈ క్రమంలో మోదీ అపాయింట్మెంట్ దొరకడం అంత సులువుగా కనిపించడం లేదు. 

ఇదే అంశంపై ఢిల్లీకీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల్ని పంపినా..  పెద్దగా ప్రయోజనం కలగలేదు. ప్రధాని మోదీ  చెబితే  పనైపోతుందన్న అంచనాలో ఉన్నారు. అందుకే ప్రధానిని  కలిసేందుకు సీఎం జగన్ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అనుకున్నట్లుగా జరిగితే కేబినెట్‌లో నిర్ణయాలు తీసుకుని. జీవోలు ఇచ్చేస్తే.. ఇక  ఎలక్షన్ కోడ్ వచ్చినా  సమస్య ఉండదని అనుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఖాతాల్లో డబ్బులు వేయవచ్చని  అుకుంటున్నారు. అందుకే చివరి కేబినెట్ భేటీని.. సిద్ధం సభను పదే పదే వాయిదా వేస్తూ వస్తున్నారు. 

ఇప్పటికీ ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ దొరుకుతుందన్న  నమ్మకంతో సీఎం  జగన్ ఉన్నారని.. మరో వారం రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున ఈ లోపే.. ప్రధానిని కలిసి అనుమతులు తీసుకుని ఆ తర్వాతే బాపట్ల సిద్ధం  సభను నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.                      

టాప్ హెడ్ లైన్స్

Tirumala Anjaneya Swamy Idol Stolen: తిరుమలలో కలకలం - మొదటి ఘాట్ రోడ్డులో ఆంజనేయస్వామి విగ్రహం మాయం!
తిరుమలలో కలకలం - మొదటి ఘాట్ రోడ్డులో ఆంజనేయస్వామి విగ్రహం మాయం!
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
Nandamuri Deepika: ఎన్టీఆర్ వదిన రాజకీయాల్లోకి వస్తారా? సేవా కార్యక్రమాల్లో హరికృష్ణ పెద్ద కోడలు
ఎన్టీఆర్ వదిన రాజకీయాల్లోకి వస్తారా? సేవా కార్యక్రమాల్లో హరికృష్ణ పెద్ద కోడలు

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
విజయవాడలో పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
కొత్త మారుతి కారు కొనాలనుకుంటున్నారా? వెంటనే బుక్ చేసుకోండి, మరోసారి ధరల పెంపు!
మారుతి సుజుకీ గట్టి షాక్‌ ఇవ్వబోతోంది, కొత్త కారు కొనేవాళ్ల జేబుకు చిల్లు!
CPM West Bengal Revival: బెంగాల్‌లో ఎర్రజెండా పునరుజ్జీవం సాధ్యమేనా? టీఎంసీ సంక్షోభం.. సీపీఎంకు దక్కే ఛాన్స్ ఎంత?
బెంగాల్‌లో ఎర్రజెండా పునరుజ్జీవం సాధ్యమేనా? టీఎంసీ సంక్షోభం.. సీపీఎంకు దక్కే ఛాన్స్ ఎంత?
Embed widget