అన్వేషించండి

అమరావతిలో అవినీతి-అసెంబ్లీలో మళ్లీ అదే సీన్ రిపీట్

అమరావతి నిర్మాణాల్లో బాబు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు సీఎం జగన్. ఐటీ శాఖ అప్రైజల్‌ రిపోర్ట్‌ లో అన్ని విషయాలు ఉన్నాయని వాటి ఆధారంగానే అధికారులు చంద్రబాబుకు నోటీసులు పంపారని చెప్పారు. 

ఏపీకి రాజధానిగా అమరావతిని నిర్ణయించడమే పెద్ద స్కామ్ అని, తాత్కాలిక భవనాల పేరుతో అమరావతి నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందనేది వైసీపీ ఆరోపణ. జగన్ సీఎం అయిన తర్వతా జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే అమరావతి వ్యవహారంపై టీడీపీని పూర్తిగా కార్నర్ చేశారు. తాజాగా జరిగిన బడ్జెట్ సమావేశాల చివరి రోజు కూడా అమరావతి వ్యవహారం హైలెట్ అయింది. అమరావతి నిర్మాణాల పేరుతో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, ఆ డబ్బంతా చంద్రబాబు అకౌంట్లకు దారి మళ్లించారని ఆరోపించారు సీఎం జగన్. గతంలో కూడా వైసీపీ నేతలు ఇవే ఆరోపణలు చేశారు, వాటిపై విచారణకు ఆదేశించారు, అయితే ఇప్పుడు అవే ఆరోపణలు తిరిగి చేశారంతే. సమావేశాల్లో చంద్రబాబు అవినీతిని సోదాహరణంగా వివరించిన నేతలు, ఆ సొమ్ముని ఎలా రికవరీ చేస్తారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. 

అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్.. భవన నిర్మాణాల్లో చంద్రబాబు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు సీఎం జగన్. కాంట్రాక్టు సంస్థలను బెదిరించి భారీ వసూళ్లకు పాల్పడ్డారని, ఆ సొమ్ముని బోగస్ కంపెనీల్లో జమ చేశారని, వాటిని తిరిగి తన అకౌంట్లకు మళ్లించుకున్నారని అన్నారు. ఐటీ శాఖ అప్రైజల్‌ రిపోర్ట్‌ లో ఈ వాస్తవాలన్నీ ఉన్నాయని చెప్పారు. 

షాపూర్ జీ పల్లోంజీ కంపెనీకి చంద్రబాబు కాంట్రాక్ట్ పనులను అప్పగించారని, వాటి విలువ 7వేల కోట్ల రూపాయలని అన్నారు జగన్. ఆ సంస్థనుంచి చంద్రబాబు 143 కోట్ల రూపాయలు వసూలు చేశారని ప్పారు. చంద్రబాబు బెదిరింపుల వల్లే ఆయన చెప్పిన బోగస్‌ కంపెనీలకు నిధులు మళ్లించామని షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధులు ఐటీ శాఖకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించారని అన్నారు జగన్. 

ఐటీ దాడులతో వెలుగులోకి..
ఐటీశాఖ దాడులతో చంద్రబాబు అవినీతి బయటపడిందని అన్నారు జగన్. ఐటీ శాఖ ముందుగా షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ నివాసంలో 2019 నవంబర్‌లో సోదాలు నిర్వహించిందని, అక్కడ లభించిన సమాచారంతో 2020 ఫిబ్రవరిలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ నివాసంలో సోదాలు చేశారని చెప్పారు. ఆ సమాచారంతో ఐటీ శాఖ తయారు చేసిన అప్రైజల్‌ రిపోర్ట్‌ లో అన్ని విషయాలు ఉన్నాయన్నారు. వాటి ఆధారంగానే ఐటీ అధికారులు చంద్రబాబుకు ఇప్పుడు నోటీసులు పంపారని చెప్పారు జగన్. 

అన్ని పనులూ ఆ కంపెనీకే.. 
కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో టిడ్కో ఇళ్లు, అమరా­వతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణంతో పాటు రాజధానిలో ఇతర నిర్మాణ పనులను కలిపి 2018 నాటికి రూ.7 వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్‌ పనులు దక్కించుకుందని, అందులో కమీషన్లు వసూలు చేయడానికి చంద్రబాబు తన పీఏ శ్రీనివాస్‌ ను రంగంలోకి దింపారన్నారు జగన్. 

హయగ్రీవమ్, అన్నై షలాఖా, నయోలిన్, ఎవరెట్‌ అనే బోగస్ కంపెనీలు సృష్టించి, వాటికి షూపూర్ జీ పల్లోంజీ సంస్థ నుంచి బోగస్ కాంట్రాక్ట్ లు ఇచ్చినట్టు రికార్డులు సృష్టించి నిధులు మళ్లించారని ఆరోపించారు జగన్. ఆ కంపెనీలకు బోగస్‌ సబ్‌ కాంట్రాక్టుల కింద డబ్బులు ఇచ్చిన తర్వాత వాటిని వసూలు చేసి చంద్రబాబుకు అప్పగించే బాధ్యతను ఆర్వీఆర్‌ రఘు, కృష్ణ, నారాయణ్, శ్రీకాంత్, అనికేత్‌ బలోటాలకు అప్పగించారన్నారు. చంద్రబాబుకి దుబాయ్ లో 15.14 కోట్ల రూపాయలను దినార్ల రూపంలో అందించారని చెప్పారు. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణంలో కూడా చంద్రబాబుకు ఇలానే మూడు నెలల్లో రూ.371 కోట్లు అందాయన్నారు. 

ఆ రోజు అధికారాన్ని అడ్డుపెట్టుకుని 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, ఇప్పుడు మరో నలుగురిని ప్రలోభాల ద్వారా లాక్కున్నారన్నారు జగన్. దోచుకో పంచుకో తినుకో(డీపీటీ) పనులు అప్పుడు జరిగాయని, ఇప్పుడు తమ హయాంలో డీబీటీ ద్వారా ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతోందని చెప్పారు జగన్. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad New Year Celebrations: హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
Aravalli Mountains:అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!

వీడియోలు

Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
Vijay Hazare trophy 2025 | విజయ్ హజారే ట్రోఫీలో తొలిరోజే రికార్డుల మోత మోగించిన బిహార్ బ్యాటర్లు
ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad New Year Celebrations: హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
Aravalli Mountains:అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
Embed widget