అన్వేషించండి

అమరావతిలో అవినీతి-అసెంబ్లీలో మళ్లీ అదే సీన్ రిపీట్

అమరావతి నిర్మాణాల్లో బాబు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు సీఎం జగన్. ఐటీ శాఖ అప్రైజల్‌ రిపోర్ట్‌ లో అన్ని విషయాలు ఉన్నాయని వాటి ఆధారంగానే అధికారులు చంద్రబాబుకు నోటీసులు పంపారని చెప్పారు. 

ఏపీకి రాజధానిగా అమరావతిని నిర్ణయించడమే పెద్ద స్కామ్ అని, తాత్కాలిక భవనాల పేరుతో అమరావతి నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందనేది వైసీపీ ఆరోపణ. జగన్ సీఎం అయిన తర్వతా జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే అమరావతి వ్యవహారంపై టీడీపీని పూర్తిగా కార్నర్ చేశారు. తాజాగా జరిగిన బడ్జెట్ సమావేశాల చివరి రోజు కూడా అమరావతి వ్యవహారం హైలెట్ అయింది. అమరావతి నిర్మాణాల పేరుతో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, ఆ డబ్బంతా చంద్రబాబు అకౌంట్లకు దారి మళ్లించారని ఆరోపించారు సీఎం జగన్. గతంలో కూడా వైసీపీ నేతలు ఇవే ఆరోపణలు చేశారు, వాటిపై విచారణకు ఆదేశించారు, అయితే ఇప్పుడు అవే ఆరోపణలు తిరిగి చేశారంతే. సమావేశాల్లో చంద్రబాబు అవినీతిని సోదాహరణంగా వివరించిన నేతలు, ఆ సొమ్ముని ఎలా రికవరీ చేస్తారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. 

అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్.. భవన నిర్మాణాల్లో చంద్రబాబు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు సీఎం జగన్. కాంట్రాక్టు సంస్థలను బెదిరించి భారీ వసూళ్లకు పాల్పడ్డారని, ఆ సొమ్ముని బోగస్ కంపెనీల్లో జమ చేశారని, వాటిని తిరిగి తన అకౌంట్లకు మళ్లించుకున్నారని అన్నారు. ఐటీ శాఖ అప్రైజల్‌ రిపోర్ట్‌ లో ఈ వాస్తవాలన్నీ ఉన్నాయని చెప్పారు. 

షాపూర్ జీ పల్లోంజీ కంపెనీకి చంద్రబాబు కాంట్రాక్ట్ పనులను అప్పగించారని, వాటి విలువ 7వేల కోట్ల రూపాయలని అన్నారు జగన్. ఆ సంస్థనుంచి చంద్రబాబు 143 కోట్ల రూపాయలు వసూలు చేశారని ప్పారు. చంద్రబాబు బెదిరింపుల వల్లే ఆయన చెప్పిన బోగస్‌ కంపెనీలకు నిధులు మళ్లించామని షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధులు ఐటీ శాఖకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించారని అన్నారు జగన్. 

ఐటీ దాడులతో వెలుగులోకి..
ఐటీశాఖ దాడులతో చంద్రబాబు అవినీతి బయటపడిందని అన్నారు జగన్. ఐటీ శాఖ ముందుగా షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ నివాసంలో 2019 నవంబర్‌లో సోదాలు నిర్వహించిందని, అక్కడ లభించిన సమాచారంతో 2020 ఫిబ్రవరిలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ నివాసంలో సోదాలు చేశారని చెప్పారు. ఆ సమాచారంతో ఐటీ శాఖ తయారు చేసిన అప్రైజల్‌ రిపోర్ట్‌ లో అన్ని విషయాలు ఉన్నాయన్నారు. వాటి ఆధారంగానే ఐటీ అధికారులు చంద్రబాబుకు ఇప్పుడు నోటీసులు పంపారని చెప్పారు జగన్. 

అన్ని పనులూ ఆ కంపెనీకే.. 
కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో టిడ్కో ఇళ్లు, అమరా­వతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణంతో పాటు రాజధానిలో ఇతర నిర్మాణ పనులను కలిపి 2018 నాటికి రూ.7 వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్‌ పనులు దక్కించుకుందని, అందులో కమీషన్లు వసూలు చేయడానికి చంద్రబాబు తన పీఏ శ్రీనివాస్‌ ను రంగంలోకి దింపారన్నారు జగన్. 

హయగ్రీవమ్, అన్నై షలాఖా, నయోలిన్, ఎవరెట్‌ అనే బోగస్ కంపెనీలు సృష్టించి, వాటికి షూపూర్ జీ పల్లోంజీ సంస్థ నుంచి బోగస్ కాంట్రాక్ట్ లు ఇచ్చినట్టు రికార్డులు సృష్టించి నిధులు మళ్లించారని ఆరోపించారు జగన్. ఆ కంపెనీలకు బోగస్‌ సబ్‌ కాంట్రాక్టుల కింద డబ్బులు ఇచ్చిన తర్వాత వాటిని వసూలు చేసి చంద్రబాబుకు అప్పగించే బాధ్యతను ఆర్వీఆర్‌ రఘు, కృష్ణ, నారాయణ్, శ్రీకాంత్, అనికేత్‌ బలోటాలకు అప్పగించారన్నారు. చంద్రబాబుకి దుబాయ్ లో 15.14 కోట్ల రూపాయలను దినార్ల రూపంలో అందించారని చెప్పారు. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణంలో కూడా చంద్రబాబుకు ఇలానే మూడు నెలల్లో రూ.371 కోట్లు అందాయన్నారు. 

ఆ రోజు అధికారాన్ని అడ్డుపెట్టుకుని 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, ఇప్పుడు మరో నలుగురిని ప్రలోభాల ద్వారా లాక్కున్నారన్నారు జగన్. దోచుకో పంచుకో తినుకో(డీపీటీ) పనులు అప్పుడు జరిగాయని, ఇప్పుడు తమ హయాంలో డీబీటీ ద్వారా ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతోందని చెప్పారు జగన్. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Heatwave Alert in AP: ఏపీలో భానుడి భగభగలు.. 19 మండలాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక!
ఏపీలో భానుడి భగభగలు.. 19 మండలాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక!
Amaravati News: అమరావతిపై వైసీపీ విష‌ప్ర‌చారం.. మావిగ‌న్ పేరు వింటేనే జ‌నం న‌వ్వుకుంటున్నారు: మంత్రి నారాయణ
అమరావతిపై వైసీపీ విష‌ప్ర‌చారం.. మావిగ‌న్ పేరు వింటేనే జ‌నం న‌వ్వుకుంటున్నారు: మంత్రి నారాయణ
Macherla ASI Suspension: ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి వేధింపులు.. మాచర్ల ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు
ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి లైంగిక వేధింపులు.. మాచర్ల ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు
Talliki Vandanam Scheme: ఇంట్లో ప్రతి విద్యార్థికి రూ.15 వేలు.. తల్లికి వందనం దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే
ఇంట్లో ప్రతి విద్యార్థికి రూ.15 వేలు.. తల్లికి వందనం దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే

వీడియోలు

Payyavula Kesav on Botsa | జగన్ విషయంలో బొత్స అన్నమాటలనే కదా మేం చెప్పాం
Vybhav Sooryavanshy: హేజిల్‌వుడ్డా.. గాడిదగుడ్డా...? Title:దిగ్గజ బౌలర్లను ఉతికారేస్తున్న వైభవ్
Accident on Vijayawada Highway: విజయవాడ హైవేపై BMWపై బోల్తా పడిన ట్యాంకర్
Vaibhav Suryavanshi about Bumrah Bowling | బుమ్రా బౌలింగ్‌పై వైభవ్ కామెంట్స్
Who is Mukul Choudhary KKR IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో ముకుల్ సునామీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 CSK VS DC Result Update: ఎట్ట‌కేల‌కు చెన్నై బోణీ.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన సీఎస్కే.. స‌త్తా చాటిన ఓవ‌ర్ట‌న్.. ఢిల్లీకి వ‌రుస‌గా రెండో ఓట‌మి
ఎట్ట‌కేల‌కు చెన్నై బోణీ.. అన్ని రంగాల్లో స‌త్తా చాటిన సీఎస్కే.. స‌త్తా చాటిన ఓవ‌ర్ట‌న్.. ఢిల్లీకి వ‌రుస‌గా రెండో ఓట‌మి
Heatwave Alert in AP: ఏపీలో భానుడి భగభగలు.. 19 మండలాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక!
ఏపీలో భానుడి భగభగలు.. 19 మండలాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక!
Macherla ASI Suspension: ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి వేధింపులు.. మాచర్ల ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు
ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి లైంగిక వేధింపులు.. మాచర్ల ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు
Telangana Inter Results 2026 link: తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డ్ కీలక ప్రకటన.. రిజల్ట్స్ ఏ టైమ్‌కు వస్తాయి
తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డ్ కీలక ప్రకటన.. రిజల్ట్స్ ఏ టైమ్‌కు వస్తాయి
Roja supports DMK: కాంగ్రెస్ కూటమికి తమిళనాడులో రోజా మద్దతు - జగన్ అనుమతించారా?
కాంగ్రెస్ కూటమికి తమిళనాడులో రోజా మద్దతు - జగన్ అనుమతించారా?
Singer Mangli Case : మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు - ఆ ప్రచారం బాధాకరం... డైరెక్టర్ వేణు రియాక్షన్
మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు - ఆ ప్రచారం బాధాకరం... డైరెక్టర్ వేణు రియాక్షన్
HYDRA Demolitions: రంగనాథ్ ప్రభుత్వ ఏజెంట్ అని విమర్శలు! అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతాయన్న హైడ్రా కమిషనర్!
రంగనాథ్ ప్రభుత్వ ఏజెంట్ అని విమర్శలు! అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతాయన్న హైడ్రా కమిషనర్!
Singer Mangli : లాయర్‌పై సింగర్ మంగ్లీ కంప్లైంట్ - బెదిరించి ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ...
లాయర్‌పై సింగర్ మంగ్లీ కంప్లైంట్ - బెదిరించి ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ...
Embed widget