అన్వేషించండి

అమరావతిలో అవినీతి-అసెంబ్లీలో మళ్లీ అదే సీన్ రిపీట్

అమరావతి నిర్మాణాల్లో బాబు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు సీఎం జగన్. ఐటీ శాఖ అప్రైజల్‌ రిపోర్ట్‌ లో అన్ని విషయాలు ఉన్నాయని వాటి ఆధారంగానే అధికారులు చంద్రబాబుకు నోటీసులు పంపారని చెప్పారు. 

ఏపీకి రాజధానిగా అమరావతిని నిర్ణయించడమే పెద్ద స్కామ్ అని, తాత్కాలిక భవనాల పేరుతో అమరావతి నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందనేది వైసీపీ ఆరోపణ. జగన్ సీఎం అయిన తర్వతా జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే అమరావతి వ్యవహారంపై టీడీపీని పూర్తిగా కార్నర్ చేశారు. తాజాగా జరిగిన బడ్జెట్ సమావేశాల చివరి రోజు కూడా అమరావతి వ్యవహారం హైలెట్ అయింది. అమరావతి నిర్మాణాల పేరుతో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, ఆ డబ్బంతా చంద్రబాబు అకౌంట్లకు దారి మళ్లించారని ఆరోపించారు సీఎం జగన్. గతంలో కూడా వైసీపీ నేతలు ఇవే ఆరోపణలు చేశారు, వాటిపై విచారణకు ఆదేశించారు, అయితే ఇప్పుడు అవే ఆరోపణలు తిరిగి చేశారంతే. సమావేశాల్లో చంద్రబాబు అవినీతిని సోదాహరణంగా వివరించిన నేతలు, ఆ సొమ్ముని ఎలా రికవరీ చేస్తారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. 

అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్.. భవన నిర్మాణాల్లో చంద్రబాబు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు సీఎం జగన్. కాంట్రాక్టు సంస్థలను బెదిరించి భారీ వసూళ్లకు పాల్పడ్డారని, ఆ సొమ్ముని బోగస్ కంపెనీల్లో జమ చేశారని, వాటిని తిరిగి తన అకౌంట్లకు మళ్లించుకున్నారని అన్నారు. ఐటీ శాఖ అప్రైజల్‌ రిపోర్ట్‌ లో ఈ వాస్తవాలన్నీ ఉన్నాయని చెప్పారు. 

షాపూర్ జీ పల్లోంజీ కంపెనీకి చంద్రబాబు కాంట్రాక్ట్ పనులను అప్పగించారని, వాటి విలువ 7వేల కోట్ల రూపాయలని అన్నారు జగన్. ఆ సంస్థనుంచి చంద్రబాబు 143 కోట్ల రూపాయలు వసూలు చేశారని ప్పారు. చంద్రబాబు బెదిరింపుల వల్లే ఆయన చెప్పిన బోగస్‌ కంపెనీలకు నిధులు మళ్లించామని షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధులు ఐటీ శాఖకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించారని అన్నారు జగన్. 

ఐటీ దాడులతో వెలుగులోకి..
ఐటీశాఖ దాడులతో చంద్రబాబు అవినీతి బయటపడిందని అన్నారు జగన్. ఐటీ శాఖ ముందుగా షాపూర్ జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ నివాసంలో 2019 నవంబర్‌లో సోదాలు నిర్వహించిందని, అక్కడ లభించిన సమాచారంతో 2020 ఫిబ్రవరిలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ నివాసంలో సోదాలు చేశారని చెప్పారు. ఆ సమాచారంతో ఐటీ శాఖ తయారు చేసిన అప్రైజల్‌ రిపోర్ట్‌ లో అన్ని విషయాలు ఉన్నాయన్నారు. వాటి ఆధారంగానే ఐటీ అధికారులు చంద్రబాబుకు ఇప్పుడు నోటీసులు పంపారని చెప్పారు జగన్. 

అన్ని పనులూ ఆ కంపెనీకే.. 
కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో టిడ్కో ఇళ్లు, అమరా­వతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణంతో పాటు రాజధానిలో ఇతర నిర్మాణ పనులను కలిపి 2018 నాటికి రూ.7 వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్‌ పనులు దక్కించుకుందని, అందులో కమీషన్లు వసూలు చేయడానికి చంద్రబాబు తన పీఏ శ్రీనివాస్‌ ను రంగంలోకి దింపారన్నారు జగన్. 

హయగ్రీవమ్, అన్నై షలాఖా, నయోలిన్, ఎవరెట్‌ అనే బోగస్ కంపెనీలు సృష్టించి, వాటికి షూపూర్ జీ పల్లోంజీ సంస్థ నుంచి బోగస్ కాంట్రాక్ట్ లు ఇచ్చినట్టు రికార్డులు సృష్టించి నిధులు మళ్లించారని ఆరోపించారు జగన్. ఆ కంపెనీలకు బోగస్‌ సబ్‌ కాంట్రాక్టుల కింద డబ్బులు ఇచ్చిన తర్వాత వాటిని వసూలు చేసి చంద్రబాబుకు అప్పగించే బాధ్యతను ఆర్వీఆర్‌ రఘు, కృష్ణ, నారాయణ్, శ్రీకాంత్, అనికేత్‌ బలోటాలకు అప్పగించారన్నారు. చంద్రబాబుకి దుబాయ్ లో 15.14 కోట్ల రూపాయలను దినార్ల రూపంలో అందించారని చెప్పారు. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణంలో కూడా చంద్రబాబుకు ఇలానే మూడు నెలల్లో రూ.371 కోట్లు అందాయన్నారు. 

ఆ రోజు అధికారాన్ని అడ్డుపెట్టుకుని 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, ఇప్పుడు మరో నలుగురిని ప్రలోభాల ద్వారా లాక్కున్నారన్నారు జగన్. దోచుకో పంచుకో తినుకో(డీపీటీ) పనులు అప్పుడు జరిగాయని, ఇప్పుడు తమ హయాంలో డీబీటీ ద్వారా ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతోందని చెప్పారు జగన్. 

టాప్ హెడ్ లైన్స్

Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు - 3,168 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - చేనేతలకు నేతన్న భరోసా !
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు - 3,168 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - చేనేతలకు నేతన్న భరోసా !
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
Embed widget