అన్వేషించండి

CM Jagan Delhi Tour : ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ టూర్ - మోదీ , షాలతో ఏం చర్చించారంటే ?

ప్రధాని మోదీతో సీఎం జగన్ దాదాపుగా గంట సేపు సమావేశం అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.

CM Jagan Delhi Tour :  ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన సుడిగాలి సమావేశాలతో ముగిసింది. ఉదయం బయలుదేరి ఢిల్లీ వచ్చిన ఆయన ముందుగా హోంమంత్రి అమిత్ షాతో 45 నిమిషాల సేపు సమావేశం అయ్యారు. తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ  నివాసానికి వెళ్లారు.  దాదాపుగా గంట సేపు ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం అయ్యారు. అక్కడ్నుంచి నేరుగా ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుని తాడేపల్లి బయలుదేరారు. రోజులోనే కీలకమైన సమావేశాల్ని ముగించుకుని జగన్  ఢిల్లీ నుంచి బయలుదేరారు. అయితే ఏ ఏ అంశాలపై చర్చించారో స్పష్టత లేదు. 

రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చలు         

రాష్ట్రానికి సంబంధించినపలు అంశాలు పెండింగ్ లో ఉన్నాయని  వాటిని పరిష్కరించాలని కోరినట్లుగా తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటనలో అద్భుతమైన స్పందన వచ్చిందని అభినందనలు తెలిపినట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్  వెంట  ఎంపీలు  విజయసాయి రెడ్డి, మిధున్ రెడ్డి,  సీఎస్ జవహర్ రెడ్డి,  ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి.. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చిదానందరెడ్డి... ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్‌లు ఉన్నారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారి కూడా సీఎం జగన్ వెంట ఢిల్లీ రావడంతో  రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అదనపు అప్పుల పరిమితి పెంపు వంటి అంశాలపై చర్చలు జరిపినట్లుగా భావిస్తున్నారు. 

ముందస్తు ఎన్నికలకు సహకరించాలని కోరారా ? 

సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో రాజకీయాలపైనా చర్చించారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల ఓ  ఉత్తరాది హిందీ చానల్ లో వచ్చిన సర్వేల ఫలితాలతో.. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తే వైఎస్ఆర్‌సీపీకి మంచి  అవకాశం ఉంటుందన్న అంచనాలతో.. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఆరో రాష్ట్రంగా ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించేలా సహకరించాలని ఆయన బీజేపీ అగ్రనేతలను కోరినట్లుగా చెబుతున్నారు. వారి వైపు నుంచి సానుకూల స్పందన వస్తే.. తదుపరి క్యాబినెట్ భేటీలో ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ సంకేతాలు ఇవ్వవొచ్చని అనుకుంటున్నారు. 

ఐదు రాష్ట్రాలతో పాటు ఏపీకి ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారా?       

ఎన్నికల సన్నాహాలను ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ దాదాపుగా పూర్తి చేసింది. అభ్యర్థుల కసరత్తు కూడా పూర్తయిందని ఆ పార్టీ వరగాలు చెబుతున్నాయి. వైసీపీ క్యాడర్ మొత్తం చాలా కాలంగా ఇంటింటికి తిరుగుతున్నారు. సీఎం జగన్.. ప్రతి జిల్లాలోనూ సభలు పెడుతున్నారు. వారానికి రెండు, మూడు సభల్లో పాల్గొంటున్నారు.  జగనన్న సురక్షా కార్యక్రమం ద్వారా కొత్తగా పథకాలు అందని వారందరికీ పథకాలు మంజూరు చేయబోతున్నారు. ఇప్పటికే ప్రజా సమస్యల పరిష్కారనికి అనేక ప్రయత్నాలు చేశారు. పార్లమెంట్  ఎన్నికలతో పాటు వెళ్తే తమ సంక్షేమ పథకాలు ఓటింగ్ ఎజెండా కాకుండా పోతాయన్న ఆందోళనతో.. ప్రత్యేకంగా అసెంబ్లీకి మాత్రమే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లుగా భావిస్తున్నారు.              

టాప్ హెడ్ లైన్స్

Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
YSRCP AP Assembly : పార్లమెంట్‌లో గళం.. అసెంబ్లీకి పలాయనం - వైసీపీ వ్యూహాత్మక తప్పిదాలు- జగన్ సభకు వెళ్తారా?
పార్లమెంట్‌లో గళం.. అసెంబ్లీకి పలాయనం - వైసీపీ వ్యూహాత్మక తప్పిదాలు- జగన్ సభకు వెళ్తారా?
Bhogapuram International Airport: జులై 31 వరకు భోగాపురం ఎయిర్‌పోర్టుపై విస్తృత ప్రచారం.. ప్రధాని మోదీ ప్రారంభించే ప్రాజెక్టులివే
జులై 31 వరకు భోగాపురం ఎయిర్‌పోర్టుపై విస్తృత ప్రచారం.. ప్రధాని మోదీ ప్రారంభించే ప్రాజెక్టులివే
తిరుమల యాత్రలో వారాహి అమ్మవారి దర్శనం: కోరికలు తీర్చే శ్రీశక్తిపీఠం రహస్యం!
తిరుమల యాత్రలో వారాహి అమ్మవారి దర్శనం: కోరికలు తీర్చే శ్రీశక్తిపీఠం రహస్యం!

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
తిరుమల యాత్రలో వారాహి అమ్మవారి దర్శనం: కోరికలు తీర్చే శ్రీశక్తిపీఠం రహస్యం!
తిరుమల యాత్రలో వారాహి అమ్మవారి దర్శనం: కోరికలు తీర్చే శ్రీశక్తిపీఠం రహస్యం!
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
Embed widget