News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

CM Jagan Delhi Tour : ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ టూర్ - మోదీ , షాలతో ఏం చర్చించారంటే ?

ప్రధాని మోదీతో సీఎం జగన్ దాదాపుగా గంట సేపు సమావేశం అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

CM Jagan Delhi Tour :  ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన సుడిగాలి సమావేశాలతో ముగిసింది. ఉదయం బయలుదేరి ఢిల్లీ వచ్చిన ఆయన ముందుగా హోంమంత్రి అమిత్ షాతో 45 నిమిషాల సేపు సమావేశం అయ్యారు. తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ  నివాసానికి వెళ్లారు.  దాదాపుగా గంట సేపు ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం అయ్యారు. అక్కడ్నుంచి నేరుగా ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుని తాడేపల్లి బయలుదేరారు. రోజులోనే కీలకమైన సమావేశాల్ని ముగించుకుని జగన్  ఢిల్లీ నుంచి బయలుదేరారు. అయితే ఏ ఏ అంశాలపై చర్చించారో స్పష్టత లేదు. 

రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చలు         

రాష్ట్రానికి సంబంధించినపలు అంశాలు పెండింగ్ లో ఉన్నాయని  వాటిని పరిష్కరించాలని కోరినట్లుగా తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటనలో అద్భుతమైన స్పందన వచ్చిందని అభినందనలు తెలిపినట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్  వెంట  ఎంపీలు  విజయసాయి రెడ్డి, మిధున్ రెడ్డి,  సీఎస్ జవహర్ రెడ్డి,  ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి.. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చిదానందరెడ్డి... ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్‌లు ఉన్నారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారి కూడా సీఎం జగన్ వెంట ఢిల్లీ రావడంతో  రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అదనపు అప్పుల పరిమితి పెంపు వంటి అంశాలపై చర్చలు జరిపినట్లుగా భావిస్తున్నారు. 

ముందస్తు ఎన్నికలకు సహకరించాలని కోరారా ? 

సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో రాజకీయాలపైనా చర్చించారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల ఓ  ఉత్తరాది హిందీ చానల్ లో వచ్చిన సర్వేల ఫలితాలతో.. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తే వైఎస్ఆర్‌సీపీకి మంచి  అవకాశం ఉంటుందన్న అంచనాలతో.. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఆరో రాష్ట్రంగా ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించేలా సహకరించాలని ఆయన బీజేపీ అగ్రనేతలను కోరినట్లుగా చెబుతున్నారు. వారి వైపు నుంచి సానుకూల స్పందన వస్తే.. తదుపరి క్యాబినెట్ భేటీలో ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ సంకేతాలు ఇవ్వవొచ్చని అనుకుంటున్నారు. 

ఐదు రాష్ట్రాలతో పాటు ఏపీకి ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారా?       

ఎన్నికల సన్నాహాలను ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ దాదాపుగా పూర్తి చేసింది. అభ్యర్థుల కసరత్తు కూడా పూర్తయిందని ఆ పార్టీ వరగాలు చెబుతున్నాయి. వైసీపీ క్యాడర్ మొత్తం చాలా కాలంగా ఇంటింటికి తిరుగుతున్నారు. సీఎం జగన్.. ప్రతి జిల్లాలోనూ సభలు పెడుతున్నారు. వారానికి రెండు, మూడు సభల్లో పాల్గొంటున్నారు.  జగనన్న సురక్షా కార్యక్రమం ద్వారా కొత్తగా పథకాలు అందని వారందరికీ పథకాలు మంజూరు చేయబోతున్నారు. ఇప్పటికే ప్రజా సమస్యల పరిష్కారనికి అనేక ప్రయత్నాలు చేశారు. పార్లమెంట్  ఎన్నికలతో పాటు వెళ్తే తమ సంక్షేమ పథకాలు ఓటింగ్ ఎజెండా కాకుండా పోతాయన్న ఆందోళనతో.. ప్రత్యేకంగా అసెంబ్లీకి మాత్రమే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లుగా భావిస్తున్నారు.              

Published at : 05 Jul 2023 07:18 PM (IST) Tags: BJP YSRCP CM Jagan Delhi tour Jagan Delhi Jagan meeting with Amit Shah

ఇవి కూడా చూడండి

రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు సీఐడీ రెడీ

రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు సీఐడీ రెడీ

Breaking News Live Telugu Updates: రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం

Breaking News Live Telugu Updates: రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం

AP Students: అమెరికా అధ్యక్ష భవనాన్ని సందర్శించిన ఏపీ విద్యార్థులు - నేటితో ముగిసిన యూఎస్ఏ పర్యటన

AP Students: అమెరికా అధ్యక్ష భవనాన్ని సందర్శించిన ఏపీ విద్యార్థులు - నేటితో ముగిసిన యూఎస్ఏ పర్యటన

IIITDMK Admissions: ఐఐఐటీడీఎం కర్నూల్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు, ఈ అర్హతలుండాలి

IIITDMK Admissions: ఐఐఐటీడీఎం కర్నూల్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు, ఈ అర్హతలుండాలి

Nara Brahmani : పొలిటికల్ కామెంట్లు చేస్తున్న నారా బ్రహ్మణి - రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్లేనా..?

Nara Brahmani :   పొలిటికల్ కామెంట్లు చేస్తున్న నారా బ్రహ్మణి -    రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్లేనా..?

టాప్ స్టోరీస్

Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Telangana BJP :  సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే

Rs 2000 Notes: సెప్టెంబర్‌ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?

Rs 2000 Notes: సెప్టెంబర్‌ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?