అన్వేషించండి

CM Jagan Meet Amit Shah : అమిత్ షాతో 45 నిమిషాల పాటు సీఎం జగన్ భేటీ - ఏం చర్చించారంటే ?

అమిత్ షాతో సీఎం జగన్ 45 నిమిషాల పాటు సమావేశం అయ్యారు. ఏ అంశాలపై చర్చించారన్నది ప్రధానితో భేటీ తర్వాత వెల్లడించే అవకాశం ఉంది.


CM Jagan Meet Amit Shah :  ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి  కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. దాదాపుగా 45  నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీతోనూ జగన్ సమావేశం కానున్నారు. బీజేపీ అగ్రనేతలతో భేటీ కోసం సీఎం జగన్ ఉదయమే అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లారు. ఆయన వెంట  ఎంపీలు  విజయసాయి రెడ్డి, మిధున్ రెడ్డి,  సీఎస్ జవహర్ రెడ్డి,  ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి.. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చిదానందరెడ్డి... ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్‌లు ఉన్నారు.  అమిత్ షాతో  భేటీ కి మాత్రం సీఎం జగన్ ఒక్కరే వెళ్లారు. 

తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్లాలన్నది జగన్ ఆలోచన ?  

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి వెళ్లే విషయంలో వ్యతిరేకంగా ఉన్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు పూర్తిగా జాతీయ అంశాల ఆధారంగా జరుగుతాయి. అదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల సంక్షేమ పథకాల అంశం పక్కకు  పోతుందని అనుకుంటున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా క్లిష్టంగానే ఉంది. వచ్చే ఏడాది  మార్చి , ఏప్రిల్‌లో పోలింగ్ జరిగితే... ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉండే సూచనలు కనిపిస్తూండటంతో  మరింత ఇబ్బందికరం అవుతుందని అందుకే ముందస్తుకు వెళ్లాలని అనుకుంటున్నారు. ఈ అంశంపై కేంద్ర పెద్దల్ని ఒప్పించేందుకే ఢిల్లీ వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. 
 
ముందస్తుకు కేంద్ర సహకారం కోసమే ఢిల్లీ పర్యటన !  

ముందస్తుకు వెళ్లాలంటే కేంద్రం సహకారం తప్పని సరి. కేంద్రం కాదంటే జరిగే చాన్స్ లేదు. ఆరు నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసినా కేంద్రం కాదంటే మాత్రం.. రాష్ట్రపతి పాలన అయినా  విధిస్తారు కానీ ఎన్నికలు నిర్వహించరు. అయితే ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డికి కేంద్రం సపోర్ట్ లభిస్తోందని చెబుతున్నారు. గత కొంత కాలంగా ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోదీకి ముందస్తుకు సహకరించాలన్న విజ్ఞప్తి చేశారని ఆయన మీ ఇష్టం అన్నారన్న ప్రచారం జరుగుతోంది. త్వరలో అసెంబ్లీని రద్దు చేయాలనుకుంటున్నారు కాబట్టి మరోసారి మోదీని కలిసి చెప్పేందుకు వెళ్లారని భావిస్తున్నారు. 

మందస్తు ఖాయమని నమ్ముతున్న ఏపీ రాజకీయ పార్టీలు 

ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమని.. ఈసీ అధికారుల్ని జగన్ సంప్రదించారని  జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇటీవల ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పట్నుంచో తెలంగాణతో పాటే ఏపీకి ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల్ని కూడా ఖరారు చేసుకుంటున్నాయి. ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే ఎన్నికల వాతావరణం పూర్తి స్థాయిలో ఏర్పడింది. ఇక అసెంబ్లీ రద్దు కోసం నిర్ణయం తీసుకుంటే.. డిసెంబర్ లోనే ఏపీలోనూ ఎన్నికలు జరుగుతాయి. జగన్ ఢిల్లీ  పర్యటన తర్వాత కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో  ముందస్తు ఉంటుందా లేదా అన్నదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Online Betting Racket: రెడ్డీ అన్న పేరుతో బెట్టింగ్ యాప్ - కోల్‌కతాలో విశాఖ పోలీసుల ఆపరేషన్ - సంచలన విషయాలు వెలుగులోకి..
రెడ్డీ అన్న పేరుతో బెట్టింగ్ యాప్ - కోల్‌కతాలో విశాఖ పోలీసుల ఆపరేషన్ - సంచలన విషయాలు వెలుగులోకి..
AP PMAY Gramin 2.0: పేదల సొంతింటికి ముహూర్తం ఫిక్స్.. ఏపీ పీఎంఏవై గ్రామీణ్ స్కీమ్ పై గుడ్ న్యూస్!
పేదల సొంతింటికి ముహూర్తం ఫిక్స్.. ఏపీ పీఎంఏవై గ్రామీణ్ స్కీమ్ పై గుడ్ న్యూస్!
AP Local Body Elections: మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBSE 12th Result 2026: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల.. 85.20 శాతం మంది ఉత్తీర్ణత.. రిజల్ట్స్ లింక్
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల.. 85.20 శాతం మంది ఉత్తీర్ణత.. రిజల్ట్స్ లింక్
PM Modi Convoy Size: ప్రధాని మోదీ కాన్వాయ్ వాహనాలు తగ్గింపు.. వాటికి ఎంత ఫ్యూయల్ వాడేవారు, ఎంత ఆదా అవుతుంది
ప్రధాని మోదీ కాన్వాయ్ వాహనాలు తగ్గింపు.. వాటికి ఎంత ఫ్యూయల్ వాడేవారు, ఎంత ఆదా అవుతుంది
Hyderabad Crime News: హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. ఓ ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి చోరీ
హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. ఓ ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి చోరీ
Vijay Trisha: సూర్య కోసమా? త్రిష కోసమా? సీఎం విజయ్ బంపరాఫర్ బాగుందమ్మా
సూర్య కోసమా? త్రిష కోసమా? సీఎం విజయ్ బంపరాఫర్ బాగుందమ్మా
Gold Import Duty: బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!
బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!
Heat Wave Alert : రోజు రోజుకి పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. వేడి వల్ల శరీరానికి, మనసుకు పొంచి ఉన్న ప్రమాదాలు ఇవే
రోజు రోజుకి పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. వేడి వల్ల శరీరానికి, మనసుకు పొంచి ఉన్న ప్రమాదాలు ఇవే
Peddi Tickets Rate: తెలంగాణలో 'పెద్ది'కి పెద్ద దెబ్బ... మైత్రి వర్సెస్ ఎగ్జిబిటర్స్ ఇష్యూలో చరణ్ సినిమాకు భారీ లాస్
తెలంగాణలో 'పెద్ది'కి పెద్ద దెబ్బ... మైత్రి వర్సెస్ ఎగ్జిబిటర్స్ ఇష్యూలో చరణ్ సినిమాకు భారీ లాస్
AP Local Body Elections: మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
Embed widget