అన్వేషించండి

Amaravati White Paper : అమరావతిలో ఐదేళ్ల విధ్వంసం ప్రజల ముందు - బుధవారం శ్వేతపత్రం ప్రకటించనున్న చంద్రబాబు

Chandrababu : అమరావతిలో ఐదేళ్లు జరిగిన విధ్వంసాన్ని చంద్రబాబు శ్వేతపత్రం రూపంలో బుధవారం ప్రకటించనున్నారు. అమరావతిపై తమ ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణను కూడా వెల్లడించనున్నారు.

Chandrababu will announce white paper On Amaravati :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలో జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించుకున్నారు. బుధవారం మొత్తం అమరావతి అంశంపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.అమరావతిపై తమ ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణను కూడా వెల్లడించనున్నారు.                         
 
దీనికి సంబంధించి అధికారులతో ఇప్పటికే చంద్రబాబు రివ్యూ చేశారు. ఇప్పటివరకు జరిగిన పనులకు సంబంధించి వ్యవహారాలను శ్వేతపత్రంలో ప్రకటించే అవకాశం ఉంది.  గతంలో జరిగిన నిర్మాణాలు, పెండింగ్ లో ఉన్న పనులు, ఏయే పనులు ప్రధానంగా డ్యామేజ్ అయ్యాయి.. ఇలాంటి అంశాలను వైట్ పేపర్ లో ఉంటాయి. అమరావతిని నిర్వీర్యం చేసేందుకు జగన్ ప్రభుత్వం చేసిన కుట్రలు, తప్పుడు కేసులు వంటి వివరాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది.                                        

అమరావతే ఏకైక రాజధాని అని టీడీపీ నినాదం. ఆ నినాదంతోనే ఎన్నికలకు వెళ్లి భారీ విజయం సాధించారు.  గెలిచిన వెంటనే జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. ఇప్పటికే చంద్రబాబు అమరావతి ప్రాంతంలో ఓ సారి పర్యటించి రైతులతో మాట్లాడారు. సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి అవసరమైన భూమి ఇంకా కొంత మంది రైతులు ఇవ్వలేదు. వారితో అధికారులు మాట్లాడుతున్నారు. గతంలో నిర్మాణాలకు కాంట్రాక్టులు పొందిన కంపెనీలతో ఒప్పందాలు తీరిపోయాయి. మళ్లీ ఒప్పందాలు చేసుకోవాలా లేకపోతే మళ్లీ టెండర్లు పిలవాలా అన్నదానిపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. నిర్మాణ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు.            

అమరావతిలో మళ్లీ నిర్మాణాలను మరో నెలలో ప్రారంభించాలని గట్టి పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే 70 నుంచి 90 శాతం వరకూ పూర్తయిన భవనాలను అందుబాటులోకి తీసుకు వస్తే చాలా వరకూ వసతి సమస్య పరిష్కారం అవుతుందని ఉద్యోగులంతా ఒకే  చోట నిర్వాసం ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అదే సమయంలో గతంలో భూములు కేటాయించిన సంస్థలు వెంటనే పనులు ప్రారంభించేలా సంప్రదింపులు జరుపుతున్నారు. చాలా వరకూ భూ కేటాయింపులను జగన్ ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ ఆసక్తి చూపించే సంస్థలకు మళ్లీ కేటాయించే అవకాశం ఉంది. దాదాపుగా అన్ని కంపెనీలు మళ్లీ అమరావతిలో నిర్మాణాలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.                       

ఇప్పటికే ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్ ల కోసం భూమిని నోటిపై చేశారు.  రెండున్నర  లేదా మూడేళ్లలో అమరావతి ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్‌లను పూర్తి చేయాలనుకుంటున్నారు. అభివృద్ధి పనులు కొనసాగుతూండగా.. భూములు వేలం వేసి. నిధులు సమీకరించుకోవాలని అనుకుంటున్నారు. ఇలాంటి ప్రణాళికలు మొత్తాన్ని చంద్రబాబు వివరించే అవకాశం ఉంది.         

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget