అన్వేషించండి

Chandrababu Kuppam Tour : ద్రవిడ వర్శిటీ నిర్వీర్యం - కుప్పానికి జగన్ ద్రోహం చేశారన్న చంద్రబాబు !

తనపై కోపంతో కుప్పం ద్రవిడ వర్శిటీని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. కుప్పంలో రెండో రోజు పర్యటనలో ఆయన విద్యార్థులతో మాట్లాడారు.

 

కుప్పం ద్రవిడ యూనివర్శిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.  కుప్పంలో రెండో రోజు పర్యటనలో ద్రవిడ యూనివర్శిటీ విద్యార్థులతో మాట్లాడారు. చంద్రబాబును ద్రవిడ యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్ విద్యార్థులు కలిసి హాస్టల్ దుస్థితిపై చంద్రబాబు కు ఫోటోలు చూపించారు. యూనివర్సిటీలో సమస్యలను చంద్రబాబుకు ఏకరువు పెట్టారు  . వైఎస్ఆర్ ప్రభుత్వం  యూనివర్సిటీని  నిర్వీర్యం చేస్తోందని చంద్రబాబుకు వివరించారు. "బాబు రావాలి..బాధలు తీరాలి" అంటూ స్టూడెంట్స్ ఒఎద్ద ఎత్తున నినాదాలు చేశారు.  సమస్యలపై గళం ఎత్తిన విద్యార్థులను వేధిస్తున్నారని స్టూడెంట్స్ చంద్రబాబుతో అవేదన వ్యక్తం చేశారు. 

 యూనివర్సిటీలో ఉద్యోగులపైనా కులం ఆధారం గా వివక్ష చూపుతున్నారని ఓ ఉద్యోగి చెప్పుకున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదని, స్కాలర్ షిప్ లు లేదని  ప్రభుత్వంపై విద్యార్ధులు మండిపడ్డారు..   ద్రవిడ యూనివర్సిటీ విద్యార్ధులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.. ద్రవిడ యూనివర్సిటీతో తనకు ప్రత్యేక అనుబందం ఉందని, దక్షిణ భారతదేశంలో నంబర్ వన్ చేయాలని యూనివర్సిటీని స్థాపించినట్లు వివరించారు..విద్యార్థులకు సౌకర్యాల విషయంలో యాజమాన్యం శ్రద్ద పెట్టాలని కోరారు. ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి ఎందుకు వచ్చిందని బాబు ప్రశ్నించారు.  నా మీద కోపంతో యూనివర్సిటీని దెబ్బ తీస్తే ఎలా అని ఆయన మండిపడ్డారు.. మహోన్నత లక్ష్యంతో ప్రారంభమైన ద్రవిడ యూనివర్సిటీని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు.  యూనివర్సిటీలో అక్రమ క్వారియింగ్ ఎలా, ఎందుకు జరుగుతుందని చంద్రబాబు ప్రశ్నించారు.  యూనివర్సిటీ అధికారులు తప్పులు చేస్తే తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్ధితి వస్తుందని హెచ్చరించారు. యూనివర్సిటీ లో బయట వాళ్ళు వచ్చి స్థానికులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని  హెచ్చరించారు. 

అంతకు ముందుచంద్రబాబు కుప్పంలోని ఆర్ అండ్ అతిధి గృహం వద్ద ప్రజల వద్ద విన్నతి పత్రాలు స్వీకరించారు.. ఈ క్రమంలో కుప్పంలోని షాహీ గార్మెంట్సులో పని చేస్తున్న మహిళా కార్మికులు కుప్పం అతిథి గృహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ డిమాండ్లను యాజమాన్యం పట్టించుకోవడం లేదని, మూడు సంవత్సరాలుగా జీతాలు పెంచడం లేదని మహిళా కార్మికులు ఆవేదన చెందుతున్నారు..యాజమాన్యం నిర్లక్షంగా వ్యవహరిస్తోందని, తమకు జీతాలు పెంచే వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని కార్మికులు అంటున్నారు. న్యాయం జరగకపోతే ఎలాంటి ఉద్యమాలు చేయడానికైనా వెనక్కి తగ్గమని వారు హెచ్చరించారు.. చంద్రబాబు శుక్రవారం యాజమాన్యాన్ని పిలిచి చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు.  తగిన న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో మహిళలు వెనుదిరిగారు.. 

అనంతరం కుప్పంలోని పట్టాలమ్మ నారా చంద్రబాబు నాయుడు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం పోగురుపల్లెతో పాటుగా పలు గ్రామాల్లో చంద్రబాబు నాయుడు పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. శుక్రవారం కూడా కుప్పంలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. 

 

 

టాప్ హెడ్ లైన్స్

జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget