అన్వేషించండి

Chandrababu White Paper On Polavaram : రివర్స్ టెండర్ల డ్రామానే పోలవరానికి శాపం - శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు

Chandrababu On Polavaram : పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రాన్ని చంద్రబాబు విడుదల చేశారు. రివర్స్ టెండర్ల డ్రామాలాడి ఆరు వందల కోట్లు మిగిల్చామని వేల కోట్లు నష్టం చేశారని లెక్కలు విడుదల చేశారు.

Chandrababu released a white paper on the Polavaram project :  ఆరు వందల కోట్లు మిగిల్చానని చెప్పి వేల కోట్లకుపైగా నష్టాన్ని మిగిల్చారు. దీనికి ఎవర్ని బాధ్యులను చేద్దామని పోలవరం విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు.  ఏపీకి జీవనాడిగా  చంద్రబాబు చెబుతున్న  పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన వైట్ పేపర్ ను చంద్రబాబునాయుడు ప్రకటించారు.   టీడీపీ అధికారంలో ఉన్నప్పడు పోలవరం పనులు ఒక యజ్జంలా సాగాయనdvejg.  అప్పట్లో ఉన్న సమస్యలను, సవాళ్లను అధిగమించి మరీ ముందుకు వెళ్లామని  ఒక్క రోజులోనే స్పిల్ ఛానల్‌లో 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేశామన్నారు. నాటి ప్రభుత్వం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిందన్నారు.   గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అటు హెడ్ వర్కుల పనులు చేస్తూనే ఎగువ, దిగువ కాఫర్ కాఫర్ డ్యాంల నిర్మాణం పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు.  ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని రికార్డు సమయంలో 414 రోజుల్లో పూర్తి చేశామని.. అంత వేగంగా పనులు జరిగితే గత ఐదేళ్లలో అంతా రివర్స్ అయిందన్నారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం ధ్వంసం జాతికి జరిగిన విద్రోహమని పేర్కొన్నారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్‌ చేసిన నష్టం ఎక్కువని వెల్లడించారు. ప్రాజెక్టులపై కనీస అవగాహన లేకుండా వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అహంభావంతో పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేసి రివర్స్‌ టెండర్స్‌కు వెళ్లారని విమర్శించారు. జగన్‌ వల్ల డయాఫ్రంవాల్‌ దెబ్బతిందని ఆరోపించారు. టీడీపీ హయాంలో పోలవరంపై రూ. 11,762 కోట్లు చేస్తే, వైసీపీ ప్రభుత్వం కేవలం 4,167 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని విమర్శించారు.   టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు మొత్తంగా 71.20 శాతం, హెడ్ వర్క్స్ 64.08 శాతం, కుడి కాలువ 91.49 శాతం, ఎడమ కాలువ 71.60 శాతం పూర్తయ్యాయి.  ముంపు ప్రాంతానికి చెంది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వాసితులు 1,05,601 గాను 3,922 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. 

జగన్ పాలన ఐదేళ్లలో  ప్రాజెక్టు మొత్తం వర్క్స్ 73.82 శాతంగా ఉంది. టీడీపీ హయాంలో 71.20 శాతం పోగా, జగన్ హయాంలో కేవలం 2.62 శాతం మాత్రమే పురోగతి జరిగింది.   ప్రాజెక్టు హెడ్ వర్క్స్ జగన్ హయాంలో 69.79 శాతంగా పేర్కొన్నారు. ఇందులో టీడీపీ హయాంలోని 64.08 శాతం తీసి వేస్తే జగన్ పాలనలో కేవలం 5.71 శాతం మాత్రమే పనులు జరిగాయి. కుడి, ఎడమ కాలువల పురోగతి, వాటి కనెక్టవిటీ కూడా అంతంత మాత్రమే. ఇక భూసేకరణ నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాసం కూడా ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది.
 

 ఐదేళ్లలో వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో తప్పుడు నిర్ణయాలు - రివర్స్ టెండర్ల డ్రామాలు ఆడారని చంద్రబాబు మండిపడ్డారు. నాడు 2019లో వైసీపీ ప్రభుత్వంలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు సాయంత్రమే పోలవరం పనులు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చారన్నారు.  సైట్‌లో నిర్మాణ సంస్థ ఖాళీ చేయాల్సిందిగా జులై 29, 2019న నోటీసులు జారీ చేశారని, 2019 జులై 24న ఇచ్చిన పీటర్ కమిటీ రిపోర్టు ఆధారంగా రివర్స్ టెండర్ల డ్రామా ఆడారని చంద్రబాబు విమర్శించారు.పోలవరంలో అవినీతే జరగలేదని కేంద్రం తేల్చిందని, డిసెంబర్ 02, 2019న స్వయంగా పార్లమెంట్‌లో స్పష్టంగా పేర్కొందన్నారు. రివర్స్ టెండర్ల ద్వారా రూ.738 కోట్లు ఆదా అని ముందు గొప్పలు చెప్పారని, కానీ చివరకు డయాఫ్రం వాల్‌ను దెబ్బతీసి వేల కోట్ల నష్టం చేశారని చంద్రబాబ అసంతృప్తి వ్యక్తం చేశారు.  

 సాగునీటి ప్రాజెక్టులపై రెండో శ్వేత పత్రం విడుదల చేస్తామని, మొత్తం ఏడు శ్వేతపత్రాలను విడుదల చేస్తామని అన్నారు. వెబ్‌సైట్ల  ద్వారా పత్రాలన్నీ అందుబాటులో ఉంచుతామని అన్నారు. వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారానికి చెక్‌ పెట్టేందుకే శ్వేతపత్రాల విడుదలని స్పష్టం చేశారు.  కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టకముందే రాష్టంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించి రాష్ట్రానికి అవసరమైన నిధులపై కేంద్రానికి నివేదిక ఇస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ తోడ్పాడుతో సవాళ్లు అధిగమిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Konaseema Crime News: సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా..
సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా!
Amaravati pipes on fire: అమరావతిలో వరుసగా పైపులకు నిప్పు - కుట్ర కోణం ఉందని ప్రభుత్వం అనుమానం - విచారణ షురూ !
అమరావతిలో వరుసగా పైపులకు నిప్పు - కుట్ర కోణం ఉందని ప్రభుత్వం అనుమానం - విచారణ షురూ !
YCP 11th number Room: అమ్మో 11వ నెంబర్ - పార్లమెంట్‌లో రూం మార్చేసుకున్న వైసీపీ ఎంపీలు - ఎందుకో తెలుసా?
అమ్మో 11వ నెంబర్ - పార్లమెంట్‌లో రూం మార్చేసుకున్న వైసీపీ ఎంపీలు - ఎందుకో తెలుసా?
Vijayawada Terror Links: విజయవాడలో ఉగ్ర కుట్ర భగ్నం- ముగ్గురు యువకుల అరెస్టు.. ఐసిస్, ఆఖిస్‌లతో సంబంధాలు?
విజయవాడలో ఉగ్ర కుట్ర భగ్నం- ముగ్గురు యువకుల అరెస్టు.. ఐసిస్, ఆఖిస్‌లతో సంబంధాలు?

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
Tamil Nadu Assembly Elections 2026: పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Konaseema Crime News: సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా..
సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా!
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Embed widget