అన్వేషించండి

Chandrababu: దసరా రోజున ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు - సూపర్ సిక్స్ సభలో చంద్రబాబు సంచలన ప్రకటన

Chandrababu Auto Drivers: దసరా రోజున ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఫ్రీ బస్సు పథకం ప్రారంభించినప్పుడు ఆటోడ్రైవర్లకు సాయం చేస్తామని చెప్పారు.

Chandrababu Naidu announces Rs 15,000 to auto drivers on Dussehra:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన 'సూపర్ సిక్స్-సూపర్ హిట్' సభలో భాగంగా అనంతపురంలో జరిగిన బహిరంగ  సభలో చేశారు.   మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం (స్త్రీ శక్తి) అమలు వల్ల ఆటో డ్రైవర్ల జీవనోపాధి ప్రభావితం కాకుండా చూసేందుకు ప్రత్యేక సాయం అందిస్తామని గతంలో ప్రకటించారు. ఆ మేరకు ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు అందించాలని నిర్ణయించారు.          

అనంతపురంలో సూపర్ సిక్స్..సూపర్ హిట్ సభ         

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్న ఈ సభలో, కూటమి ప్రభుత్ వం గత 15 నెలల్లో సాధించిన విజయాలను, సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు సంబంధించిన ఆర్థిక సాయం ప్రకటన ఆటో డ్రైవర్లలో ఉత్సాహాన్ని నింపింది.         

ఆటో డ్రైవర్లకు దసరా రోజున పదిహేను వేలు 

చంద్రబాబు మాట్లాడుతూ, "మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (స్త్రీ శక్తి) పథకం ఆగస్టు 15, 2025 నుంచి అమలులోకి వచ్చింది. ఈ పథకం వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం ప్రభావితం కావచ్చనే ఆందోళనను మేము గమనించాము. అందుకే, ఈ దసరా సందర్భంగా ఆటో డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం అందజేస్తామని నిర్ణయించాము. ఈ సాయం ద్వారా వారి ఆర్థిక భారం తగ్గించి, జీవనోపాధిని సురక్షితం చేస్తాం" అని పేర్కొన్నారు.        

స్త్రీశక్తి పథకం  వల్ల ప్రభావితమవుతారని సాయం                    

ఈ పథకం కింద, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఆటో డ్రైవర్లు ప్రయోజనం పొందనున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం 'వాహన మిత్ర' పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.10,000 సాయం అందించగా, కూటమి ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.15,000కు పెంచి, దసరా సందర్భంగా అందజేయనుంది. ఈ నిర్ణయం ఆటో డ్రైవర్లకు ఊరటనిచ్చే అంశంగా నిలిచింది.           

అలాగే, స్త్రీ శక్తి పథకం కింద 2.62 కోట్ల మంది మహిళలు ఆంధ్రప్రదేశ్‌లోని 74% ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం పొందుతున్నారని చంద్రబాబు వెల్లడించారు. ఈ పథకం రూ.1,942 కోట్ల వ్యయంతో అమలవుతోందని, దీని ద్వారా మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం, గౌరవం పెరుగుతుందని ఆయన అన్నారు. "మహిళలు ఉచితంగా ప్రయాణించే ఈ సౌకర్యం వారి విద్య, ఉపాధి, వ్యాపారం, కుటుంబ సందర్శనల కోసం ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవడం మా బాధ్యత" అని చంద్రబాబు స్పష్టం చేశారు. 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Satyasai district NH Tenders: సత్యసాయి జిల్లా హైవే టెండర్లలో రిగ్గింగ్ కలకలం - ఢిల్లీకి చేరిన అధికారుల అక్రమాల చిట్టా!
సత్యసాయి జిల్లా హైవే టెండర్లలో రిగ్గింగ్ కలకలం - ఢిల్లీకి చేరిన అధికారుల అక్రమాల చిట్టా!
Pawan Kalyan Jindal Plant Visit: చెత్త నుంచి విద్యుత్తు.. డంపింగ్ యార్డ్ లేని ఏపీ - పల్నాడులో పవన్ కళ్యాణ్ పర్యావరణ మంత్రం!
చెత్త నుంచి విద్యుత్తు.. డంపింగ్ యార్డ్ లేని ఏపీ - పల్నాడులో పవన్ కళ్యాణ్ పర్యావరణ మంత్రం!

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Embed widget