అన్వేషించండి

Chandrababu Kuppam Tour : రౌడీ పాలనకు టైం దగ్గర పడింది - 175 స్థానాలూ టీడీపీనే గెలుస్తుంది - కుప్పంలో చంద్రబాబు ధీమా

Kuppam Tour : కుప్పంలో చంద్రబాబు మూడో రోజు పర్యటిస్తున్నారు - వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని అధికారంలోకి రాగానే మొత్తం కక్కిస్తానని హెచ్చరించారు.

 

Chandrababu Kuppam Tour :  ఏపీలో 175 స్థానాలూ టీడీపీనే గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. కుప్పంలో మూడో రోజు బిజీగా పర్యటిస్తున్నారు.  రామకుప్పం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు టీడీపీవే అని ఆయన జోస్యం చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులుగా మారారని, అందుకు కారణమైన సైకో పాలనకు బుద్ధి చెప్పాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని, ఏ ఒక్కరికి ఉద్యోగావకాశం కల్పించలేదని పేర్కొన్నారు చంద్రబాబు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన తాను ఏ రోజు ఏ తప్పు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

”నాకు వయసు ఓ నంబర్ మాత్రమే. నా ఆలోచనలు 15 ఏళ్ల యువకుడిలా ఉంటాయి. వచ్చే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తాను. కుప్పంలో లక్ష్య ఓట్ల మెజారిటీ లక్ష్యం. తప్పనిసరిగా సాధిస్తాం. హంద్రీనీవాలో నీళ్ళు పారించమంటే అవినీతి పారిస్తున్నారు. బటన్లు నొక్కి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. అందరూ రోడ్డున పడ్డారు. సీఎం మాత్రం ప్యాలెస్ లో ఉన్నారు. వాటాలు అడుగుతున్న కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతున్నట్లు జగన్ కి అర్ధం అయ్యే ఉంటుంది. బటన్ నొక్కి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని దీంతో ప్రజలు రోడ్డున పడ్డారని, సీఎం జగన్ మాత్రం ప్యాలెస్ లో ఉన్నాడని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో ఈ తరహా రాజకీయాలు మునుపెన్నడూ చూడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హంద్రీనీవా లో నీళ్లు పారించమంటే, అవినీతి పారిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడంలేదని, వాటాలు అడుగుతున్న కారణంగా పెట్టుబడులు ఎవరు పెట్టడం లేదని చంద్రబాబు ఆరోపించారు.

ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. మీ దాడులకు నేను భయపడను. మీరు తిన్నది కక్కిస్తాను. జగన్.. సామాజిక న్యాయం ఎక్కడ చేశావు? వైసీపీలో సామాజిక న్యాయం నేతి బీర నెయ్యి చందం. వైసీపీలో రెడ్లు ఎవ్వరూ బాగుపడలేదు. నలుగురు రెడ్లు పెద్దిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డిలు మాత్రమే బాగుపడ్డారు. మారాల్సింది ఎమ్మెల్యే అభ్యర్థులు కాదు.. సీఎం మాత్రమే. కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ వస్తే రాష్ట్రంలో 175 స్థానాలు మనవే. గాడి తప్పిన పాలన మళ్లీ సరి చేయాలి. ఇదే నా కోరిక” అని చంద్రబాబు నాయుడు అన్నారు. 

 

కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు.. శాంతిపురంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం, నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ అధికారం కోల్పోయిన వెంటనే.. వైసీపీ సర్కార్ శీతకన్ను వేసిందన్నారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం, అవినీతి పాలన సాగుతోందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమార్కుల ఆట కట్టించి, అవినీతి సొమ్మును కక్కిస్తామన్నారు చంద్రబాబు. మరోవైపు జాబు రావాలంటే బాబు రావాలని, యువత సైకిల్ ఎక్కితేనే అభివృద్ధి సాధ్యమన్నారు చంద్రబాబు.                   

టాప్ హెడ్ లైన్స్

PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
Rajamahendravaram News: రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget