అన్వేషించండి

Chandrababu News: కేసు కొట్టేయండి, హైకోర్టులో చంద్రబాబు లాయర్ క్వాష్‌ పిటిషన్‌ - నేడు విచారణ

చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ మంగళవారం (సెప్టెంబరు 12) హైకోర్టు ప్రారంభ సమయంలో ఈ పిటిషన్ వేశారు.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో సీఐడీ నమోదు చేసిన కేసు, ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్లను కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు తరపు లాయర్లు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ ముగిసేవరకూ ఏసీబీ కోర్టులో విచారణపై స్టే విధించాలని కోరారు. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ మంగళవారం (సెప్టెంబరు 12) హైకోర్టు ప్రారంభ సమయంలో ఈ పిటిషన్ వేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ ప్రకారం ఎవరైనా పబ్లిక్‌ సర్వెంట్‌పై కేసు పెట్టాలంటే, లేదా దర్యాప్తు చేయాలంటే కూడా గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని గుర్తు చేశారు. అలాంటిదేమీ లేకుండా చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ వ్యవహరించిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాస రెడ్డి వద్ద ప్రస్తావించారు. లంచ్ మోషన్ పిటిషన్‌గా దీన్ని స్వీకరించాలని కోరారు. అయితే, ఈ పిటిషన్ బుధవారం విచారణకు రానుంది.

‘‘ఈ కేసు తొలుత నమోదైన 22 నెలల తర్వాత ఎలాంటి కనీస సాక్ష్యాలు లేకపోయినా ఉద్దేశపూర్వకంగా, ముఖ్యమంత్రి కక్ష్యతోనే నన్ను ఇరికించారు. ప్రాణాలకు ముప్పు ఉందని కేంద్ర ప్రభుత్వం నాకు జడ్‌+ సెక్యూరిటీ కల్పించింది. అయినా రాజకీయ ప్రత్యర్థులు నన్ను అంతం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. నన్ను జైలులో ఉంచడం సేఫ్ కాదు. జడ్‌+ సెక్యూరిటీకి నన్ను దూరంగా ఉంచాలి. దాని ద్వారా ప్రత్యర్థులు టార్గెట్‌ను సులువుగా సాధించగలుగుతారు’’ అని పిటిషన్‌లో వివరించారు.

చంద్రబాబు హాయంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ఏర్పాటు కోసం ఏపీఎస్‌ఎస్‌డీసీ, సీమెన్స్‌ మధ్య జరిగిన ఒప్పందం విషయంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2021 డిసెంబరు 9న ఏపీ సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. అయితే, ఆ రోజు ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పాత్ర లేనేలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఓ నిందితుడు చెప్పారని ఏడాది తర్వాత చంద్రబాబు పేరును తెరపైకి తెచ్చారు. తప్పుడు ఆ కేసులో ఇరికించి తనను అరెస్టు చేయాలని రాష్ట్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని పని చేసింది. సీఐడీ రిమాండ్ రిపోర్టులో ఒక్కటైనా చెల్లుబాటు అయ్యే ఆధారాలు లేవని పిటిషనర్ వివరించారు.

గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరన్న సుప్రీంకోర్టు
‘‘అనినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్‌ 17ఏ 2018 జులై 26న అమల్లోకి వచ్చింది. పబ్లిక్‌ సర్వెంట్లపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేయాలంటే కాంపిటెంట్‌ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సుప్రీంకోర్టు 2021లో కీలక తీర్పు ఇచ్చింది. 2021 డిసెంబరు 9న నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌ విషయంలో గవర్నర్‌ ఆమోదం లేకుండా జరుగుతున్న ప్రక్రియ అంతా చట్ట విరుద్ధమే. ఈ కేసులో సీఐడీకి దర్యాప్తు చేసే అధికారం లేదు. అసలు ఈ కేసు ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసులను విచారణ చేసే స్పెషల్ కోర్టు పరిధిలోకి వస్తుంది. కాబట్టి నాపై నమోదు చేసిన కేసును కొట్టేయాలి.విచారణ పరిధి, రిమాండు విధించే అధికారం కూడా ఏసీబీ కోర్టుకు లేవు. గవర్నర్‌ ఆమోదం పొందలేదనే విషయాన్ని ఏసీబీ కోర్టు కూడా మర్చిపోయినట్టుంది. చంద్రబాబుకు రిమాండు కూడా విధించింది’’ అని పిటిషన్ లో పేర్కొన్నారు. గతంలో ఓ కేసు విచారణ సందర్భంగా స్కిల్ డెవలప్ మెంట్ ఏకంగా 2.13 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగించేలా చేసిందని హైకోర్టు గుర్తించిందని పిటిషనర్ గుర్తు చేశారు. అసలు స్కిల్ డెవలప్ మెంట్ కి ఆర్థికంగా నష్టం జరిగిందని నిరూపించేందుకు ప్రాసిక్యూషన్‌ ఆధారాలు చూపలేకపోయిందని గుర్తు చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget