అన్వేషించండి

Chandrababu : ఇక ఏపీ ఉండదన్నట్లుగా ఆస్తులు అమ్మేస్తున్నారు - సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు !

ఇక ఏపీనే ఉండదన్నట్లుగా జగన్ ఆస్తులు అమ్మేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబం నెత్తిన రూ. ఐదు లక్షల అప్పు పెట్టారని చంద్రబాబు విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌కు తానే చివరి సీఎం అని.. ఇక ఏపీ ఉండదన్నట్లుగా రాష్ట్ర ఆస్తులు అమ్మకం, తాకట్టు పెడుతున్నారని ముఖ్యమంత్రి జగన్‌పై ( CM Jagan  ) చంద్రబాబునాయుడు మండిపడ్డారు. అమరావతిలోని టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన రెండున్నరేళ్లలో  రూ.7లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు.రాష్ట్రంలో ప్రతీ కుటుంబంపై రూ.5లక్షల అప్పు భారం మోపారన్నారు. జగన్ చేసే అప్పులు ఎవరూ కట్టరని.. రేపు ప్రజలే కట్టాలని చెప్పారు. అసలు చేసిన అప్పులన్నీ ఎక్కడికిపోయాయనని ప్రశ్నించారు. కృష్ణానది ఒడ్డున ఉన్న బెరంపార్క్‌ను ప్రైవేటు బ్యాంకుకు తాకట్టు పెట్టడంపై మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్లు పెడుతున్నారని విమర్శించారు. 

ఓ వైపు ఆస్తులు అమ్ముతూ మరోవైపు పన్నుల రూపంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నారని చంద్రబాబు ( Chandra babu ( విమర్శించారు. చివరికి చెత్త పన్ను కూడా వేశారన్నారు. పన్నులు అధికంగా వేయడంతో దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు అత్యధికంగా ఉంటోంది ఏపీలోనేనన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, లిక్కర్ ధరలు దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చిచూసినా ఎక్కువేననన్నారు. వైఎస్ఆర్‌సీపీ ( YSRCP )అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జీవన ప్రమాణాలు దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రలో ఏపీకి ఎవరూ చేయనంత నష్టాన్ని జగన్ ఏపీకి చేశారన్నారు. రాష్ట్ర భవిష్యత్ భయంకరంగా ఉంటుందన్నారు. 

సీఎం జగన్మోహన్ రెడ్డికి సొంత లాభం తప్ప ఏమీ పట్టడం లేదని సహజ వనరుల దోపిడీకి పాల్పడుతూ ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు చేస్తున్నారని అన్నారు. నీతి నిజాయితీగా రాష్ట్రంలో రూపాయి కూడా ఎవరూ సంపాదించలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు కోటీశ్వరులవుతుంటే పేదలు నిరుపేదలుగా మారుతున్నారన్నారు. ధైర్యం ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ( White Paper  )  విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరోనా మృతులకు దేశమంతా ఎంతోకొంత పరిహారం ఇచ్చినా జగన్‌రెడ్డి మాత్రం రూపాయి సాయం కూడా ఇవ్వలేదని చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

సంపద సృష్టించకుడా రాష్ట్ర ఎంపీలు ఢిల్లీకి పోయి అప్పుల కోసం అడుక్కుంటున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలపై ( Polavaram ) టీడీపీ హయాంలో ఆరోపణలు చేసిన జగన్ ఇప్పుడు అవే ఎస్టిమేషన్లు ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. పోలవరం పని ఎక్కడిదక్కడ ఆగిపోయింద‌న్నారు. టీడీపీ హయాంలో ప్రకటించిన రైల్వేజోన్‌కు కనీసం నిధులు సాధించలేని దుస్థితిలో వైసీపీ ఉందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌ సర్కార్‌ను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. రాష్ట్ర ద్రోహుల ఆట కట్టించాలంటే.. ప్రజాచైతన్యం రావాలని బాబు పేర్కొన్నారు.  

సీఎం జగన్ పలు అంశాల్లో మాట తప్పిన వీడియోలను, టీడీపీ హయాంలో చేసిన పనులనుకూడా తాను చేసినట్లుగా  చెప్పుకున్న వీడియోలను చంద్రబాబ ప్రదర్శించారు. 
 

టాప్ హెడ్ లైన్స్

Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
Breaking News: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్-మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్-మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
Embed widget