By: ABP Desam | Updated at : 12 Aug 2021 03:09 PM (IST)
వైఎస్ వివేకా ఫైల్ ఫోటో
వైఎస్ వినేకానందరెడ్డి హత్య కేసు ఓ కొలిక్కి వస్తోందా..? . సునీల్ కుమార్ యాదవ్ను అరెస్ట్ చేసిన తర్వాత సీబీఐ చాలా వేగంగా హత్యకు ఉపయోగించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకుంది. సునీల్ యాదవ్ కస్టడీలో ఓ చెరువులో ఆయుధాలను పడేశారని చెప్పడంతో మొదటగా ఆ చెరువులో వెదికారు సీబీఐ అధికారులు . కానీ ఎక్కడా దొరకలేదు. దీంతో అనుమానితుల ఇళ్లలోనే సోదాలు చేసినట్లుగా తెలు్సతోంది. పులివెందులలోని సునీల్ యాదవ్, తోండూరులోని ఎర్రగంగిరెడ్డి, ప్రోద్దుటూరులోని సుబ్బారెడ్డి, సింహాద్రిపురంలోని ఉమాశంకర్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వారి ఇళ్లలోనే సీబీఐ.. ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సునీల్ యాదవ్ సోదరుడు స్టేట్మెంట్ను కూడా సీబీఐ అధికారులు నమోదు చేశారు. మరో వైపు రెండో సీబీఐ బృందం కూడా చురుకుగా దర్యాప్తు జరుపుతోంది.
ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య జరిగిందన్న కోణంలో ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కర్ణాటక నంచి 20 మందికిపైగా బ్యాంక్ రెవిన్యూ అధికారులు పులివెందులకు వచ్చి పూర్తి స్థాయిలో సీబీఐ కి వివరాలు అందించారు. వివేకానందరెడ్డికి సంబంధించిన ఆస్తులు... ఆర్థిక లావాదేవీలు.. భూముల వ్యవహారాలు ఇలా మొత్తం ప్రతీ అంశంపైనా సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. డాక్యుమెంట్ల సహితంగా ఆధారాలు రెడీ చేస్తున్నారు. రెండు నెలలకుపైగా సాగుతున్న విచారణకు వీలైనంత త్వరగా ముగింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో సీబీఐ ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల కిందట సాక్ష్యాలు మాయం చేయాలని ప్రయత్నించిన వారితో పాటు.. అంత పక్కాగా హత్య అని తెలుస్తున్నప్పటికీ.. గుండె పోటు అని ప్రచారం చేసిన వారిని సీబీఐ అధికారులు పిలిపించి విచారణ జరిపారు.
మరో వైపు నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ కుటుంబసభ్యులు సీబీఐ పై ఆరోపణలు చేస్తున్నారు. వివేకాను చంపేంత పెద్ద వాళ్లం కాదని... ఆయనను ఎవరు చంపారో అందరికీ తెలుసని అంటున్నారు. తమను బలి పశువుల్ని చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరో వైపు సీబీఐకి సహకరించేందుకు వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఎక్కువగా పులివెందులలోనే ఉంటున్నారు. సీబీఐ అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వారి ముందు హాజరై కావాల్సిన వివరాలు ఇస్తున్నారు. గతంలో వివేకా హత్య కేసు విచారణ నిర్లప్తింగా ఉండేది .. కానీ ఇప్పుడు మాత్రం విమర్శలున్నా.. దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. వైఎస్ వివేకాను ఆయన ఇంట్లో హత్య చేసి ఇతరులెవ్వరూ పులివెందులలో ఉండగలరా అని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు కానీ.. సీబీఐ విచారణ సాగుతూండగానే కామెంట్లు చేయడం సరి కాదన్న అభిప్రాయం దర్యాప్తు వర్గాల నుంచి వినిపిస్తోంది.
Kuppam Politics : కుప్పం బరిలో హీరో విశాల్, వైసీపీ నయా ప్లాన్-సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!
Dharmana Prasada Rao : అమ్మ ఒడి డబ్బులు పంచే కార్యక్రమం కాదు, విపక్షాలకు మంత్రి ధర్మాన కౌంటర్
VIMS Jobs : విమ్స్ లో వైద్యుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఇలా దరఖాస్తు చేసుకోండి!
Breaking News Live Telugu Updates: పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం,15 మందికి గాయాలు
PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ
Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!
Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!
Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!
Mohammed Zubair Arrested : జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్ అరెస్ట్, ఓ మతాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపణలు