అన్వేషించండి

MP Magunta Case: ఒంగోలు ఎంపీపై నెల్లూరులో క్రిమినల్ కేసు.. వైసీపీ అంతర్గత రాజకీయాలే కారణమా..?

జూన్ 21న ఎంపీ మాగుంటతో పాటు మరో ఇద్దరిపై కేసులు పెట్టిన సర్వేపల్లిలో కేసులు పెట్టిన అధికారులు. ఆ విషయం తాజాగా వెలుగు చూడటంతో వైఎస్ఆర్‌సీపీలో చర్చకు కారణం అవుతోంది.

ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిపై నెల్లూరు జిల్లాలో క్రిమినల్ కేసు నమోదైంది. జూన్‌ 5న నెల్లూరు జిల్లా సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి కనుపర్తిపాడులోని మాగుంట ఆగ్రో ఫార్మస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మట్టి అవసరమని ఎం.శ్రీనివాసులురెడ్డి పేరుతో 3వేల క్యూబిక్‌ మీటర్ల తవ్వకాలకు దరఖాస్తు చేసుకొని అనుమతులు తీసుకున్నారు. అయితే జర్వాయర్‌లో అనుమతులకు మించి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇరిగేషన్‌ అధికారులు రిజర్వాయర్‌లో కొలతలు వేసి అనుమతులకు మించి తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. 8వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకాలకు అనుమతులు ఇస్తే.. 18,629 క్యూబిక్‌ మీటర్లు తవ్వినట్లు తేల్చారు. అయితే అక్కడ ఒక్క ఎం. శ్రీనివాసులు రెడ్డి మాత్రమే కాదు ఉదయ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి అనే మరో ఇద్దరు వ్యక్తులకు కూడా అనుమతులు ఇచ్చారు. దీంతో ఈ ముగ్గురిపైనా క్రిమినల్ కేసులు పెట్టారు.  

ఉదయ్ కుమార్ రెడ్డిని ఏ-1గా, ఎం. శ్రీనివాసులరెడ్డిని ఏ-2గా, శ్రీధర్ రెడ్డిని ఏ-3గా పేర్కొన్నారు. జూన్‌ 21న ఇరిగేషన్‌ అధికారుల ఫిర్యాదు మేరకు కేసులు పెట్టారు కానీ ఇంతవరకు తదుపరి చర్యలు తీసుకోలేదు. కేసులు నమోదు చేసినట్లుగా ఎంపీకి కూడా సమాచారం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఈ కేసు విషయం బయటకు వచ్చింది. ఇప్పుడీ వ్యవహారం జిల్లాలో సంచలనం అవుతోంది. మాగుంట కుటుంబం మట్టి తవ్వకాల కోసం దరఖాస్తు పెట్టిందా అనేది కూడా చర్చనీయాంశం అవుతోంది. ఆయన సంతకం ఫోర్జరీ చేశారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ కేసు అంశంపై ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇంత వరకూ స్పందించలేదు. ఇటీవలి కాలంలో ప్రకాశం జిల్లా వైసీపీలో వర్గ పోరాటం ఎక్కువయింది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట మధ్య సరిపడని పరిస్థితి ఏర్పడింది. కొద్ది రోజుల కిందట కొవిడ్ కేర్ సెంటర్‌ను ఎంపీ మాగుంట సొంత నిధులతో ఏర్పాటు చేశారు. దానికి ఆయన పేరునే పెట్టుకున్నారు. కానీ రాత్రికి రాత్రి ఆయన నిధులను ఆయనకు వెనక్కి ఇచ్చేసిన కలెక్టర్.. మంత్రి బాలినేని పేరు పెట్టి కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభించారు. దీనిపై అప్పట్లో వివాదం రేగింది. తర్వాత సద్దుమణిగింది. 

ఎంపీ అయినప్పటికీ.. ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాల్లో మాగుంట ప్రాతినిథ్యం చాలా తక్కువగా ఉంటోంది. ఆయన ఒంగోలు నుంచి ఎంపీగా ఉంటున్నప్పటికీ.. నెల్లూరు జిల్లా కూడా వారి సొంత జిల్లాలాంటిదే. అందుకే అక్కడా ఆయన రాజకీయాలు చేస్తూ ఉంటారు. రెండు జిల్లాల్లోనూ ఆయనకు అనుచర వర్గం ఎక్కువగానే ఉంది. అయితే ఆయన ఎంపీగా ఒంగోలు నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో పొరుగు జిల్లాలో కేసు నమోదవడం వైసీపీ వర్గాల్లోనే సంచలనంగా మారింది. పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారని ఇటీవల మాగుంటపై విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కేసు విషయం బయటకు రావడం.. మరింత సంచలనాత్మకం అవుతోంది. ఆయన స్పందనను బట్టి తదుపరి రాజకీయం ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Embed widget