అన్వేషించండి

Nara Lokesh: నారా లోకేష్ పాదయాత్రలో బ్రహ్మణీ, దేవాన్ష్‌, మోక్షజ్ఞ

Nara Lokesh Padayatra: నారా లోకేష్ యువగళం పాదయాత్ చారిత్రాత్మక మైలు రాయిని చేరుకుంది. తుని నియోజ‌క‌వ‌ర్గం తేటగుంట పంచాయతీలో సోమవారం యువ‌గ‌ళం పాద‌యాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది.

Yuvagalam Padayatra: నారా లోకేష్ (Nara Lokesh)  చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam  Padayatra) చారిత్రాత్మక మైలు రాయిని చేరుకుంది. తుని (Tuni Constituency) నియోజ‌క‌వ‌ర్గం తేటగుంట పంచాయతీలో సోమవారం యువ‌గ‌ళం పాద‌యాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా పేద‌ల ఆక‌లి తీర్చే అన్నాక్యాంటీన్ల (Anna Canteens)ను కొనసాగిస్తామని హామీ ఇస్తూ తేటగుంట (Tetagunta) యనమల అతిధిగృహం వద్ద శిలాఫ‌ల‌కాన్ని లోకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి, కొడుకు దేవాన్ష్, నందమూరి మోక్షజ్ఞ, బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ పాల్గొని లోకేష్‌తో కలిసి పాదయాత్రలో చేశారు. 

Image Image

అన్నా క్యాంటీన్లు కొనసాగిస్తాం
శిలాఫలకం ఆవిష్కరణ అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘వైసీపీ ప్రభుత్వం కల్పించిన అన్ని అడ్డంకుల‌ను అధిగ‌మిస్తూ పాదయాత్ర సాగుతోంది. ప్రజ‌లే సైన్యంగా యువ‌గ‌ళం పాద‌యాత్ర 3000 కి.మీ. మైలురాయికి చేరింది. తుని నియోజ‌క‌వ‌ర్గం తేటగుంట పంచాయతీలో ఈ మ‌జిలీకి గుర్తుగా వైసీపీ స‌ర్కారు మూసేసిన పేద‌ల ఆక‌లి తీర్చే అన్నాక్యాంటీన్లు మ‌ళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇస్తూ శిలాఫ‌ల‌కం ఆవిష్కరించాను’ అని అన్నారు.Image

పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా తేటగుంట జాతీయ రహదారి జనసంద్రంగా మారింది. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో తేటగుంట వద్ద పండుగ వాతావరణం నెలకొంది. లోకేష్‌కు సంఘీభావం తెలుపుతూ టీడీపీ ముఖ్య నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్ర చారిత్రాత్మక మైలురాయి చేరుకున్న సందర్భంగా టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

నేడు విశాఖలోకి ఎంట్రీ
ఉభయగోదావరి జిల్లాల్లో 23రోజుల పాటు 404 కి.మీ.ల మేర కొనసాగగా, సోమవారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రవేశించనుంది. ఉభయగోదావరి జిల్లాల నాయకులు, కార్యకర్తలు యువనేతకు వీడ్కోలు పలకనుండగా, యువనేతకు భారీ స్వాగతం పలికేందుకు ఉత్తరాంధ్ర నాయకులు ఏర్పాట్లు చేసుకున్నారు.

కుప్పంలో ప్రారంభం
చిత్తూరు జిల్లా కుప్పం నుంచి జనవరి 27న లోకేష్ 'యువగళం' పాదయాత్ర తొలి అడుగు పడింది. ఫిబ్రవరి 6 తేదీ 100 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి రూరల్ చిన తిమ్మసముద్రం-2 వద్ద మార్చి 9న 500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఏప్రిల్ 21న కర్నూలు జిల్లాలోని ఆదోని టౌన్ సిరిగుప్ప క్రాస్ వద్ద వెయ్యి కిలో మీటర్ల మైలు రాయిని లోకేష్ దాటారు. కేవలం 77వ రోజుల్లో లోకేష్ వెయ్యి కిలోమీటర్లు నడిచారు.

కడపలో జూన్ 6వ తేదీ లోకేష్ 1500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా కడపలో మెరుగైన డ్రైనేజి వ్యవస్థకు అలంఖాన్ పల్లె శిలాఫలకం ఆవిష్కరణ చేశారు. జులై 11న కావలి నియోజకవర్గంలో 153వ రోజు లోకేష్ 2000 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. ఆగస్టు 19న 2500 కిలోమీటర్ల మైలు రాయిని పూర్తి చేసుకున్నారు. 

తరువాత సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్టుతో యువగళం పాదయాత్ర ఆగిపోయింది. అప్పటి వరకు నారా లోకేష్ మొత్తం 2852.4 కిలోమీటర్ల దూరం నడిచారు. 208 రోజులు సాగిన పాదయాత్ర రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద ఆగి పోయింది. తరువాత చంద్రబాబుకు బెయిల్ లభించడం, ఆయన ప్రజల్లోకి రావడంతో నవంబర్ 27న లోకేష్ తన యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. Image

పాదయాత్రలో లోకేష్ అధికార వైసీపీపై మాటల తూటాలు పేల్చుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అలాగే వైసీపీ నేతల అవినీతిని నిలదీస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్నివిధాలుగా వెనకబడిందని విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో రానున్నది నిశ్శబ్ధ విప్లవమని, జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలపడం ఖాయమంటూ విమర్శలు చేస్తున్నారు. Image

3000 కిలోమీటర్ల పాదయాత్ర సాగిందిలా..

  • 2023 జనవరి 27 పాదయాత్ర ప్రారంభం
  • ఫిబ్రవరి 6న  పూతలపట్టు నియోజకవర్గం 100 కిలోమీటర్లు
  • మార్చి 9 మదనపల్లె నియోజకవర్గం 500 కిలోమీటర్లు
  • ఏప్రిల్ 21 ఆదోని నియోజకవర్గం 1000 కిలోమీటర్లు
  • జూన్ 6 కడప నియోజకవర్గం 1500 కిలోమీటర్లు
  • జులై 11 కావలి నియోజకవర్గం 2000 కిలోమీటర్లు
  • ఆగస్టు 19 మంగళగిరి నియోజకవర్గం 2500 కిలోమీటర్లు
  • డిసెంబర్ 11 తుని నియోజకవర్గం 3000 కిలోమీటర్లు
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Imran Khan : ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష!పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు!
ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష!పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు!
Vrusshabha Tralier : 'వృషభ' మహారాజుకు ఎదురెళ్లడం అంత సులభమా? - మోహన్ లాల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ట్రైలర్ చూశారా?
'వృషభ' మహారాజుకు ఎదురెళ్లడం అంత సులభమా? - మోహన్ లాల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ట్రైలర్ చూశారా?
Year Ender 2025: ప్రతి ఆర్మీ జవాన్‌ మీసం మెలేసే సంవత్సరం 2025; సాధించిన ఘనతలు చూస్తే గూజ్‌బంప్సే!
ప్రతి ఆర్మీ జవాన్‌ మీసం మెలేసే సంవత్సరం 2025; సాధించిన ఘనతలు చూస్తే గూజ్‌బంప్సే!
The Raja Saab Trailer : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... డార్లింగ్ వస్తారా?
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... డార్లింగ్ వస్తారా?

వీడియోలు

Tilak Varma Innings Ind vs SA T20 | అహ్మదాబాద్‌లో రెచ్చిపోయిన తిలక్ వర్మ
Hardik Pandya in India vs South Africa T20 | రికార్డులు బద్దలు కొట్టిన హార్దిక్
Suryakumar Yadav Batting Ind vs SA Series | బ్యాటర్‌గా విఫలమయ్యానన్న సూర్యకుమార్
India vs South Africa 5th T20 Highlights | సిరీస్ సొంతం చేసుకున్న భారత్
Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Imran Khan : ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష!పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు!
ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష!పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు!
Vrusshabha Tralier : 'వృషభ' మహారాజుకు ఎదురెళ్లడం అంత సులభమా? - మోహన్ లాల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ట్రైలర్ చూశారా?
'వృషభ' మహారాజుకు ఎదురెళ్లడం అంత సులభమా? - మోహన్ లాల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ట్రైలర్ చూశారా?
Year Ender 2025: ప్రతి ఆర్మీ జవాన్‌ మీసం మెలేసే సంవత్సరం 2025; సాధించిన ఘనతలు చూస్తే గూజ్‌బంప్సే!
ప్రతి ఆర్మీ జవాన్‌ మీసం మెలేసే సంవత్సరం 2025; సాధించిన ఘనతలు చూస్తే గూజ్‌బంప్సే!
The Raja Saab Trailer : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... డార్లింగ్ వస్తారా?
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... డార్లింగ్ వస్తారా?
Nara Lokesh: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Embed widget