అన్వేషించండి

 Boatmen Problems: మూడేళ్లుగా పడవ దాటిస్తున్నా పైసా కూడా ఇవ్వడం లేదట, పాపం!

Boatmen Problems: గోదావరి పరిధిలో వరద క్రమేపీ తగ్గుతూ వస్తోంది. అలాగే కృష్ణా నది పరిధిలోనూ వరద అంతగా లేదు. అయితే కోనసీమ జిల్లాల్లో చాలా గ్రామాలు ఇంకా ముంపు లోనే ఉన్నాయి.

Boatmen Problems: పది రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి ఏపీలో వరదలు పోటెత్తుతున్నాయి. ఇప్పటికీ 
వర్షాలు తగ్గుముఖం పట్టాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు శాంతించాడు. అటు ఎగువ ప్రాంతాల్లోనూ వానలు తగ్గాయి. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాల నుండి కాస్త ఉపశమనం లభించినట్లు అయింది. చాలా ప్రాంతాల్లో చాలా రోజుల తర్వాత సూర్యుడి  కిరణాలు కనిపిస్తున్నాయి. అయితే వరద ప్రభావం ఎదుర్కొన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కోనసీమ జిల్లాలపై వరద తీవ్ర ప్రభావం చూపింది. అటు గోదావరి పరివాహక గ్రామాలు, ఇటు  కృష్ణా నది పరివాహక ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. చాలా గ్రామాలు బాహ్య ప్రపంచం నుండి సంబంధం తెగిపోయాయి. 

పడవలే కీలకం...

కోనసీమ జిల్లాలోని వరద ముంపు గ్రామాలలో పడవ దాటింపు కార్మికుల సేవలు కీలకంగా మారాయి. వరద ముంపులో చిక్కుకున్న వారిని అదే విధంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనే వారికి పడవలో ప్రయాణం చేయడమే ఉన్నటు వంటి ఏకైక మార్గం. అధికారులు వెళ్లాలన్న... ప్రజా ప్రతినిధులు చూడాలన్న...  బాధితులు రేవు దాటాలన్నా పడవలే దిక్కు. ఈ సమయంలో కీలకంగా పని చేసే తమను ప్రభుత్వం,  అధికారులు నిర్లక్ష్యంగా చూస్తున్నారని ఆ కార్మికులు వాపోతున్నారు. గత మూడు ఏళ్లలో వరదలు వచ్చినప్పుడు ఇలాగే పడవ దాటింపులు చేశామని.. ఆనాటి నుంచి ఇప్పటి వరకు తమ కష్టానికి ఒక్క రూపాయి కూడా దక్కలేదని వారు ఆపోతున్నారు. 

దాటింపులకు డబ్బులు ఇవ్వరా?

గత వారం రోజులుగా లంక గ్రామాలలో పడవ దాటింపులు చేస్తున్నామని.. ఈ సారి కూడా తమకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని పడవ దాటింపు కార్మికులు ఆరోపిస్తున్నారు. అదే ఏదో  కూలి పనుకో వెళితే 800 పైబడి తమకు వస్తున్నాయని ఇక్కడ కేవలం 550 రూపాయలు ఇస్తామని చెప్పారని వారు అంటున్నారు. వరదల్లో ఇబ్బందులు పడుతున్న వారికి ఏదో సేవ చేస్తున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం అధికారులు వెంటనే తమ పరిస్థితిని పట్టించుకుని తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పించాలని కోరుకుంటున్నారు.

వరద తగ్గుముఖం...

గోదావరి, కృష్ణా పరిధిలో వరద క్రమేపీ తగ్గుతోంది. కాళేశ్వరం వద్ద గోదావరి శాంతించింది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి కూడా వరద తగ్గుముఖం పట్టింది.  కృష్ణాలో ఎగువన ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి వరద తగ్గుముఖం పట్టింది. కాగా,  శ్రీశైలం నిండు కుండలా మారుతోంది.  ఆ ప్రాజెక్టులోకి 3లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. విద్యుదుత్పత్తి కోసం 19వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.  మరో మూడు రోజుల పాటు వరద కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశం ఉంది.  ఈ నేపథ్యంలో శుక్ర, శని వారాల్లో ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది.

ఏ ప్రాజెక్టుకు ఎంత వరద... 

శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మేడిగడ్డ, తుపాకుల గూడెం  ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ మినహా మిగతా ప్రాజెక్టులకు లక్షలకొద్దీ క్యూసెక్కుల వరద వస్తోంది. అత్యధికంగా తుపాకులగూడెం ప్రాజెక్టుకు 9 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో వస్తోంది.

ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కాస్తంత తగ్గింది. నాగార్జునసాగర్ కు కేవలం 26వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఆల్మట్టికి లక్షా 25వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ideas of India Nara Lokesh: ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదంటే.. ABP IDEAS OF INDIA లో వెల్లడించిన నారా లోకేష్
ప్రత్యేకహోదా ఎందుకు అడగడం లేదంటే.. ABP IDEAS OF INDIA లో వెల్లడించిన నారా లోకేష్
Common Man Legal Rights: నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
Janasena: మంగళగిరి జనసేన కార్యాలయంలో ఉద్రిక్తత - కార్ల ధ్వంసం, నిందితుడు అరెస్ట్
మంగళగిరి జనసేన కార్యాలయంలో ఉద్రిక్తత - కార్ల ధ్వంసం, నిందితుడు అరెస్ట్
Honor Killing In AP: లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ideas of India Nara Lokesh: ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదంటే.. ABP IDEAS OF INDIA లో వెల్లడించిన నారా లోకేష్
ప్రత్యేకహోదా ఎందుకు అడగడం లేదంటే.. ABP IDEAS OF INDIA లో వెల్లడించిన నారా లోకేష్
Common Man Legal Rights: నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
BRS Politics: ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు - అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీర్పు - అన్నాచెల్లెళ్ల మధ్య ముదిరిన రాజకీయ చిచ్చు!
Vijay Sangeetha Divorce: విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన దళపతి విజయ్ భార్య... తమిళనాడులో సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్
విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన దళపతి విజయ్ భార్య... తమిళనాడులో సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్
Kavitha: లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితకు క్లీన్ చిట్! తదుపరి అడుగులెటు !
లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితకు క్లీన్ చిట్! తదుపరి అడుగులెటు !
KTR On Delhi Liquor Scam: కవితకు, కేజ్రీవాల్‌కు న్యాయం జరిగింది.. బీఆర్ఎస్ పై జరిగిందంతా దుష్ప్రచారమే: కేటీఆర్
కవితకు, కేజ్రీవాల్‌కు న్యాయం జరిగింది.. బీఆర్ఎస్ పై జరిగిందంతా దుష్ప్రచారమే: కేటీఆర్
Friday Stock Markets: మరోసారి వెయ్యి పాయింట్లకుపైగా కోల్పోయిన సెన్సెక్స్ - ఐదున్నర లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
మరోసారి వెయ్యి పాయింట్లకుపైగా కోల్పోయిన సెన్సెక్స్ - ఐదున్నర లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
Holi Health Tips : హోలీ రోజున ఈ టిప్స్ పాటిస్తే మీ స్కిన్ సేఫ్‌! 
హోలీ రోజున ఈ టిప్స్ పాటిస్తే మీ స్కిన్ సేఫ్‌! 
Embed widget