![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vishnu kumar Raju : ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్కు కారణం సెటిల్మెంటే - కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కావాలన్న బీజేపీ నేత !
ఎంపీ కుటుంబం కిడ్నాప్ వెనుక సెటిల్మెంట్ గ్యాంగ్ పని ఉందని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ధర్డ్ పార్టీతో విచారణ చేయించాలన్నారు.
![Vishnu kumar Raju : ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్కు కారణం సెటిల్మెంటే - కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కావాలన్న బీజేపీ నేత ! BJP leader Vishnukumar Raju alleged that a settlement gang was behind the kidnapping of the MP's family. Vishnu kumar Raju : ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్కు కారణం సెటిల్మెంటే - కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కావాలన్న బీజేపీ నేత !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/84a53cd8a3a46dd5785f825b55c9be8d1686989312464228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vishnu kumar Raju : విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు, భార్యతో పాటు ఆడిటల్ జీవీని రౌడిషీటర్లు కిడ్నా ప్ చేసిన వ్యవహారం రాజకీయ దుమారానికి కారణం అవుతోంది. ఓ ఆకు రౌడీ ఏకంగా ఎంపీ ప్యామిలీని రెండు రోజుల పాటు నిర్బంధంలో ఉంచుకుని రూ.కోటిన్నవరకూ డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయించుకోవడం ఎలా నమ్మశక్యమని రాజకీయ పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. విశాఖపట్నం బీజేపీ నేత, విశాఖ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు ఇదే సందేహం వ్యక్తం చేశారు. ఈ కిడ్నాప్నకు కారణం సెటిల్మెంటేనని.. అసలు ఆ రౌడీషీటర్ల పాత్ర పెద్దగా ఏమీ ఉండదని అనుమానం వ్యక్తం చేశారు. కర్నూలు, పులివెందుల ముఠాల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ లేదా ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని ఆయన అభిప్రాయపడుతున్నారు.
రెండు రోజుల పాటు కుటుంబం నిర్బంధంలో ఉందని ఎంపీకి తెలియదా ?
ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఆశ్చర్యానికి గురి చేసిందన్న ఆయన.. ఎంపీ ఇంటికి ఒక ఆకు రౌడీ వెళ్లాడంటే సాధారణమైన విషయం కాదు.. దీని వెనుక పెద్ద కుట్ర దాగి వుందనే అనుమానం కలుగుతోందన్నారు.. సినిమా స్టోరీని మించిన నిజంగా జరిగిన ఘటన ఇది.. ఈ ఘటన వెనుక ఎంపీ బయటకు చెప్పుకోలేని విషయాలు దాగి ఉన్నాయి అన్నారు. భార్య, కుమారుడు ఎక్కడ ఉన్నారో ఎంవీవీ ఎందుకు గమనించలేదని అంతుబట్టని విషయమన్న ఆయన.. ఎంపీ కొడుకు ఫోన్ చేస్తే.. రోజు స్టేషన్ కు రావాల్సిన రౌడీషీటర్ కదలికలను వదిలేస్తారా..? అని ప్రశ్నించారు.
సెల్ ఫోన్ డాటా బయటకు తీస్తే మొత్తం బయటపడుతుంది !
విశాఖలో అరాచక శక్తులు తిరుగుతున్నాయని స్వయంగా కేంద్ర హోం మంత్రి హెచ్చరించారని గుర్తుచేశారు విష్ణుకుమార్ రాజు.. అది జరిగిన రెండు రోజుల్లోనే ఎంపీ కుటుంబం బాధితులుగా మారాన్న ఆయన.. గంజాయి మత్తులో జరిగిన అరాచకం గురించి తెలుసుకుని నివ్వెరపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.. ఎంపీ ఫ్యామిలీకి ఇబ్బంది కలిగితే ప్రతిపక్ష పార్టీలు సంబరాలు చేసుకుంటున్నారని వైసీపీ నాయకులు దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.. ఇక, ఈ వ్యవహారంలో కడప, పులివెందుల బ్యాచ్ లు ఉన్నాయనే ప్రచారం జరుగుతోందని ఆరోపించారు.. సెల్ ఫోన్ డేటా బయటకు తీస్తే మొత్తం వ్యవహారం బయటకు వస్తుందని సూచించారు.
పోలీసులు నిష్ఫాక్షిక దర్యాప్తు చేస్తారన్న నమ్మకం లేదన్న విష్ణుకుమార్ రాజు
ఈ కేసులో ఏపీ పోలీసులు నిస్పాక్షిక విచారణ జరుపుతారన్న నమ్మకం లేదన్నారు విష్ణుకుమార్ రాజు.. నిజాలు తేలాలంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉత్తరప్రదేశ్ మోడల్ పోలీసింగ్ అమలు చేస్తేనే అరాచకాలు తగ్గుతాయని సూచించారు. ఇది కిడ్నాప్ కాదు.. సెటిల్ మెంట్ వ్యవహారం అనేది మా అభిప్రాయంగా పేర్కొన్నారు. ఇచ్చుపుచ్చుకునే దగ్గర తేడాలా..? లేక ఇతర కారణాలా..? అనేది విచారించాలని డిమాండ్ చేశారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)