అన్వేషించండి

YS Jagan: ఎన్‌సీఎల్‌టీలో వైఎస్ జగన్‌కు ఊరట.. షేర్ల బదిలీలో షర్మిలకు బిగ్ షాక్

Saraswati Power Shares | సరస్వతీ పవర్ షేర్ల బదిలీ అంశంలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో ఊరల లభించింది.

YS Jagan Mohan Reddy | అమరావతి: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి NCLTలో ఊరట లభించింది. సరస్వతీ పవర్ షేర్ల బదిలీ సాధ్యం కాదని NCLT బెంచ్ స్పష్టం చేసింది. షేర్ల బదిలీపై జగన్ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ దాఖలు చేశారు. తన తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారని పిటిషన్‌లో జగన్ పేర్కొన్నారు. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు ముగియగా, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ తీర్పును రిజర్వ్ చేసింది. ఈడీ, సీబీఐ కేసులు విచారణలో ఉన్న సమయంలో సరస్వతీ పవర్ కంపెనీ షేర్ల బదిలీ అక్రమనేనని ఎన్‌సీఎల్టీ స్పష్టం చేయడంతో వైసీపీ అధినేత జగన్‌కు భారీ ఊరట లభించింది.

సరస్వతీ పవర్ భూములు రద్దు..

వివాదాలకు కేంద్రంగా ఉన్న సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం 2024 డిసెంబర్ నెలలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కంపెనీకి ఇచ్చిన అసైన్డ్‌ భూములను వెనక్కి తీసుకుంది. మాచవరం మండలం వేమవరం(Vemavaram)లో 13.80 ఎకరాలు, పిన్నెల్లిలో 3.89 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఎమ్మార్వో ఆదేశాలు జారీ చేశారు. 

వైఎస్‌ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతున్న సమయంలో సరస్వతి పవర్ భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. ప్రభుత్వం భూములు తీసుకొని అక్కడ ఎలాంటి పరిశ్రమ పెట్టకుండా ఏం చేస్తున్నారని కూటమి ప్రభుత్వం ఆలోచించింది. తమ భూములను లాక్కొని ఎలాంటి ఉపాధి కల్పించలేదని స్థానికులు సైతం సరస్వతీ పవర్ భూములపై ఫిర్యాదులు చేశారు. ఆ పరిశ్రమకు ఇచ్చిన భూముల్లో అసైన్డ్‌ భూములు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

భూముల రిజిస్ట్రేషన్ రద్దు

సరస్వతీ పవర్ ప్లాంట్‌కు కేటాయించిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌ను ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో రద్దు చేసింది. సరస్వతీ భూముల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయని అధికారులు నివేదిక ఇవ్వడంతో ఆ భూములపై సర్కార్ చర్యలు చేపట్టింది. పల్నాడు జిల్లా మాచవరం మండలంలో సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. కలెక్టర్ అరుణ్‌బాబు ఆదేశాలతో వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లిలో 4.84 ఎకరాల అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్‌ను అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు పిడుగురాళ్ల సబ్ రిజిస్ట్రార్ సురేశ్ ఓ ప్రకటన విడుదల చేస్తూ ఆ భూములు వెనక్కు తీసుకోవాలని ఆదేశించారు.

గతంలో జగన్ ఫ్యామిలీకి భూములు కేటాయింపు..

పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ కుటుంబానికి సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ భూములు కేటాయించారు. వైఎస్సార్ హయాంలో 1,516 ఎకరాల భూముల్లో అటవీ, ప్రభుత్వ భూములు ఉన్నాయని ఆరోపణలున్నాయి. చెన్నయపాలెం, పిన్నెల్లి, వేమవరం, తంగెడ గ్రామాల్లో మొత్తం 1,250 ఎకరాలు రైతుల నుంచి సరస్వతీ పవర్ ప్లాంట్ ఓనర్లు కొనుగోలు చేశారు. కానీ అప్పటి నుంచి ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయలేదని స్థానికులు తెలిపారు. ఈ భూముల్లో అటవీ భూములు కూడా ఉన్నాయన్న ఆరోపణలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం అక్కడ పర్యటించారు. దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించగా పరిశీలించి వారు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
Embed widget