అన్వేషించండి

YS Jagan: ఎన్‌సీఎల్‌టీలో వైఎస్ జగన్‌కు ఊరట.. షేర్ల బదిలీలో షర్మిలకు బిగ్ షాక్

Saraswati Power Shares | సరస్వతీ పవర్ షేర్ల బదిలీ అంశంలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో ఊరల లభించింది.

YS Jagan Mohan Reddy | అమరావతి: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి NCLTలో ఊరట లభించింది. సరస్వతీ పవర్ షేర్ల బదిలీ సాధ్యం కాదని NCLT బెంచ్ స్పష్టం చేసింది. షేర్ల బదిలీపై జగన్ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ దాఖలు చేశారు. తన తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారని పిటిషన్‌లో జగన్ పేర్కొన్నారు. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు ముగియగా, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ తీర్పును రిజర్వ్ చేసింది. ఈడీ, సీబీఐ కేసులు విచారణలో ఉన్న సమయంలో సరస్వతీ పవర్ కంపెనీ షేర్ల బదిలీ అక్రమనేనని ఎన్‌సీఎల్టీ స్పష్టం చేయడంతో వైసీపీ అధినేత జగన్‌కు భారీ ఊరట లభించింది.

సరస్వతీ పవర్ భూములు రద్దు..

వివాదాలకు కేంద్రంగా ఉన్న సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం 2024 డిసెంబర్ నెలలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కంపెనీకి ఇచ్చిన అసైన్డ్‌ భూములను వెనక్కి తీసుకుంది. మాచవరం మండలం వేమవరం(Vemavaram)లో 13.80 ఎకరాలు, పిన్నెల్లిలో 3.89 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఎమ్మార్వో ఆదేశాలు జారీ చేశారు. 

వైఎస్‌ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతున్న సమయంలో సరస్వతి పవర్ భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. ప్రభుత్వం భూములు తీసుకొని అక్కడ ఎలాంటి పరిశ్రమ పెట్టకుండా ఏం చేస్తున్నారని కూటమి ప్రభుత్వం ఆలోచించింది. తమ భూములను లాక్కొని ఎలాంటి ఉపాధి కల్పించలేదని స్థానికులు సైతం సరస్వతీ పవర్ భూములపై ఫిర్యాదులు చేశారు. ఆ పరిశ్రమకు ఇచ్చిన భూముల్లో అసైన్డ్‌ భూములు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

భూముల రిజిస్ట్రేషన్ రద్దు

సరస్వతీ పవర్ ప్లాంట్‌కు కేటాయించిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌ను ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో రద్దు చేసింది. సరస్వతీ భూముల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయని అధికారులు నివేదిక ఇవ్వడంతో ఆ భూములపై సర్కార్ చర్యలు చేపట్టింది. పల్నాడు జిల్లా మాచవరం మండలంలో సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. కలెక్టర్ అరుణ్‌బాబు ఆదేశాలతో వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లిలో 4.84 ఎకరాల అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్‌ను అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు పిడుగురాళ్ల సబ్ రిజిస్ట్రార్ సురేశ్ ఓ ప్రకటన విడుదల చేస్తూ ఆ భూములు వెనక్కు తీసుకోవాలని ఆదేశించారు.

గతంలో జగన్ ఫ్యామిలీకి భూములు కేటాయింపు..

పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ కుటుంబానికి సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ భూములు కేటాయించారు. వైఎస్సార్ హయాంలో 1,516 ఎకరాల భూముల్లో అటవీ, ప్రభుత్వ భూములు ఉన్నాయని ఆరోపణలున్నాయి. చెన్నయపాలెం, పిన్నెల్లి, వేమవరం, తంగెడ గ్రామాల్లో మొత్తం 1,250 ఎకరాలు రైతుల నుంచి సరస్వతీ పవర్ ప్లాంట్ ఓనర్లు కొనుగోలు చేశారు. కానీ అప్పటి నుంచి ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయలేదని స్థానికులు తెలిపారు. ఈ భూముల్లో అటవీ భూములు కూడా ఉన్నాయన్న ఆరోపణలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం అక్కడ పర్యటించారు. దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించగా పరిశీలించి వారు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
AP Employee Unions: ఏపీ ఉద్యోగ సంఘాల సంచలన నిర్ణయం - పీఆర్‌సీ, ఐఆర్‌ కోసం పోరాటం.. కూటమి ప్రభుత్వానికి సవాలు!
ఏపీ ఉద్యోగ సంఘాల సంచలన నిర్ణయం - పీఆర్‌సీ, ఐఆర్‌ కోసం పోరాటం.. కూటమి ప్రభుత్వానికి సవాలు!
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YCP Vs TDP: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Vishnu Priya Bhimeneni: శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
Embed widget