అన్వేషించండి

Pawan Kalyan : 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే అద్భుతాలు చేయొచ్చు కానీ అధికార దుర్వినియోగం చేస్తున్నారు- పవన్ కల్యాణ్

Pawan Kalyan : వైసీపీ ప్రభుత్వానికి సినిమా టికెట్లపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు లేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. ప్రత్యర్థులపై దాడి చేసేందుకు అధికార దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.

Pawan Kalyan : 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలా అద్భుతాలు చేయొచ్చు కానీ వైసీపీ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ నుంచి ఆర్డీవో వరకు సినిమా థియేటర్ల వద్ద నిలబెట్టిందని విమర్శించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ . తన సినిమా రిలీజ్‌ అవుతుంటే చాలు కలెక్టర్‌ నుంచి ఆర్డీవో వరకు అందరినీ రంగంలోకి దించుతారని ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన జనసేన జనవాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం  వ్యవస్థలు వాడడంలేదని, తన సినిమా ఆపేందుకు ప్రభుత్వ అధికారులకు డ్యూటీలు వేస్తోందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయిన పవన్.. ప్రత్యర్థులపై దాడి చేసేందుకు అధికార దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. 5, 10 రూపాయల సినిమాలను ఆపేందుకు పనిచేస్తున్న సర్కార్ ప్రజల కోసం పనిచేస్తే సగటు మనిషి సమస్యలు పరిష్కారం అయ్యేవన్నారు.  

యువత ప్రజా సమస్యలపై పోరాడాలి  

వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఉంటే పవన్ విమర్శించారు. సమస్యల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే బూతులు తిట్టడం వస్తుందన్నారు. తాము ఇక్కడే పెరిగిన వాళ్లమే అన్నారు. ఒకటి రెండు మాట్లాడగలమన్నారు. అన్న వస్తే అద్భుతాలు జరగుతాయన్నారు కానీ ఎక్కడా జరగడంలేదని పవన్ ఎద్దేవా చేశారు.  మద్యపానం నిషేధం ఏమైందని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై యువత పోరాడాలని పవన్ కోరారు. భీమవరంలో డంపింగ్‌యార్డు సమస్య ఎందుకు పట్టించుకోలేదని మండిపడ్డారు. వైసీపీరి పనులు చేయాలనే చిత్తశుద్ధిలేదన్నారు. తుందూరు ఆక్వా ఫ్యాక్టర బంగాళాఖాతంలో కలిపేస్తామన్న ముద్దుల మావయ్య ఏం చేశారని ప్రశ్నించారు. జగన్ మావయ్యకు జేబులో నుంచి డబ్బులు తీయడం రాదని, నోట్లో నుంచి మాటలు మాత్రం బాగా వస్తాయని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. 

అంతా భ్రమే 

ఏపీలో బ్రిడ్జిలు శిథిలావస్థకు చేరుకున్నాయని పవన్ కల్యాణ్‌ అన్నారు. వాటికి ప్రభుత్వం మరమ్మతులు చేయించాలని సూచించారు. ఇంకా బ్రిటీష్‌ కాలంలో కట్టిన వంతెనలే ఆధారమన్నారు. రాష్ట్ర సమస్యలపై ప్రశ్నిస్తే ఎస్సీలపై అట్రాసిటీ కేసులు పెడుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు చెందినవారు తమ సమస్యలను జనసేన దృష్టికి తీసుకొస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ అధికారంలోకి రాగానే నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సంత్సరాలు రోడ్లపై తిరిగిన వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏదో మేలు చేస్తారని అందరూ భావించారని అది భ్రమేనని తేలిపోయిందన్నారు. జనవాణిలో అవినీతి, ఇళ్ల పట్టాలు, మౌలిక వసతులు గురించి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని పవన్ అన్నారు. 

ఇసుక దోపిడీ 

వైసీపీ ప్రభుత్వం ఇసుక విధానాన్ని మరింత సరళతరం చేస్తామని చెప్పి ఇసుకను దోచేస్తుందని పవన్ కల్యాణ్ విమర్శించారు. లారీ ఇసుక రూ.28 వేల నుంచి 36 వేల వరకు ధరకు అమ్ముతున్నారని ఆరోపించారు. ఎస్సీలకు వైసీపీ అండగా ఉంటుందనుకుంటే వారిపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. గోపాలపురంలో 25 మంది ఎస్సీ యువకులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టారన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Chandrababu Serious On Bonda Uma: వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Embed widget