అన్వేషించండి

Bheemla Nayak: భీమ్లా నాయక్ టికెట్ రేటు రూ.5, లాభం కోసం ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా!

Janasena అభిమానులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. అందరూ కలిసి విరాళాల సేకరణ చేపట్టారు

అనంతపురం జిల్లా గోరంట్లలో భీమ్లా నాయక్ సినిమా టికెట్ ధర 5 రూపాయలకు అమ్ముతుండడం కలకం రేపుతోంది. ప్రభుత్వం గతంలో నిర్ణయించిన మేరకు విక్రయిస్తున్నారు. దీంతో పవన్ అభిమానులు ఏకమై సినిమాకు, థియేటర్ యాజమాన్యానికి నష్టాలు రాకుండా తమ వంతు సాయం చేస్తున్నారు. అందు కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు కలిసి తమకు తోచినంత ఇస్తాం.. థియేటర్లను కాపాడుకుంటాం అంటూ ముందుకు వచ్చారు. గోరంట్లలోని చంద్రశేఖర్ థియేటర్ వద్ద జనసేన ఆధ్వర్యంలో కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు విరాళాల సేకరణ చేపట్టారు. తమకు తోచినంత ఇవ్వాలని కనిపించిన వారిని అడిగారు.

అంతేకాకుండా, అభిమానులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా కార్యదర్శి సురేష్, జనసేన నాయకుడు వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘‘అయ్యా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. మీరు ప్రజల కోసమే పని చేస్తామని ప్రజల సంక్షేమమే మా లక్ష్యం అని అంటున్నారు. మాది ప్రజా ప్రభుత్వమని అనేకసార్లు చెబుతున్నారు. కానీ నిరుపేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి సిమెంటు ధర రూ.500 కు చేరింది. సిమెంట్ కొనలేక నిరుపేద కుటుంబాల వాళ్ళు ఇల్లు నిర్మించుకోలేక ఆపేశారు. దానిపై దయలేని మీరు సినిమా టికెట్ల ధరలపై ఇలా ఎందుకు చేస్తున్నారో ఆలోచించుకోండి. 

‘‘అందులోనూ మీ భారతి సిమెంట్ రేటు కూడా పెంచారు. అందువలన మీరు ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి అయితే సినిమా టికెట్ల ధర తగ్గించిన విధంగా భారతి సిమెంట్ ధరలు తగ్గించి ప్రజలు సులభంగా ఇల్లు నిర్మించుకునేందుకు తక్కువ రేటుకే భారతి సిమెంట్ అందించి ఆదుకోండి’’ అని కోరారు.

కరోనా దాడి కన్నా, ఏపీ ప్రభుత్వ దాడి ప్రమాదకరం
పవన్ కళ్యాణ్ మీదనో భీమ్లా నాయక్ మీదనో కాదని, థియేటర్స్ మీద ఏపీ ప్రభుత్వం దాడి చేస్తుందని మాజీ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ఎన్.వి.ప్రసాద్ విమర్శించారు. నేడు తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మూడు వేవ్‌ల కరోనాల కన్నా ఏపీ ప్రభుత్వ దాడి ప్రమాదకరంగా ఉందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గుర్తింపు తెచ్చుకుంటుంటే ఏపీలో మాత్రం వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని నిబంధనలు ఏపీ థియేటర్ల మీద అమలు చేయడం వల్ల యాజమానులు నష్టపోతున్నారని ఆయన తెలియజేశారు. సీఎంకు, సినిమాటోగ్రఫీ మంత్రికి వాస్తవాలు తెలిసి చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. తెలియక ప్రపంచంలో లేని నిబంధనలు పెడుతున్నారని, పవన్ కళ్యాణ్, ఏపీ ప్రభుత్వం రాజకీయంగా మీరు మీరు తేల్చుకోవాలని, ఈ నిబంధనలతో థియేటర్ల యాజమాన్యాలు థియేటర్లు మూసి వేయాల్సిన పరిస్ధితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan in Assembly: పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ  పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
Revanth Reddy : ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
Nara Lokesh Fires on YSRCP: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
Telangana Latest News: రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Minister Narayana Team in Maha Kumbh 2025 | పుష్కరాల కోసం మహాకుంభమేళాలో అధ్యయనం | ABP DesamGV Reddy Resign AP Fibernet Chairman | ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీరెడ్డి రాజీనామా | ABP DesamBJP MLC Candidate Anji Reddy Interview | కిషన్ రెడ్డి ప్రచారం చేసేంత ప్రాధాన్యత అంజిరెడ్డికి ఎందుకు?Tesla Company for Andhra Pradesh | ఎలన్ మస్క్ కార్ల కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ కు వస్తోందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan in Assembly: పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ  పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
Revanth Reddy : ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
Nara Lokesh Fires on YSRCP: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
Telangana Latest News: రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
Sai Pallavi: సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా ఎందుకు మేకప్ వేసుకోదో తెలుసా?
సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా ఎందుకు మేకప్ వేసుకోదో తెలుసా ?
Telangana Ration Card Latest News:తెలంగాణలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసిన వాళ్లకు గుడ్ న్యూస్- పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసిన వాళ్లకు గుడ్ న్యూస్- పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
Kerala Crime News: ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసిన 23 ఏళ్ల యువకుడు - గర్ల్ ఫ్రెండ్‌నీ వదల్లేదు - తండ్రి వల్లనే..
ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసిన 23 ఏళ్ల యువకుడు - గర్ల్ ఫ్రెండ్‌నీ వదల్లేదు - తండ్రి వల్లనే..
CM Revanth Reddy: ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ, ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డి
ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ, ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget