అన్వేషించండి

Avanigadda YSRCP : అవనిగడ్డ వైఎస్ఆర్‌సీపీలో ఏం జరుగుతోంది ? చివరికి సింహాద్రి రమేష్‌కు హ్యాండిస్తారా ?

Andhra News : అవనిగడ్డ వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. సింహాద్రి రమేష్‌కు చివరికి టిక్కెట్ ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది.


Avanigadda YSRCP ticket case is taking many turns :   ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా అవని గడ్డ నియోపకవర్గం ప్రతిష్టాత్మకమైనది.  సింహాద్రి రమేష్‌ బాబు  గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈ సారి ఆయనను సీఎం జగన్ మార్చాలనుకున్నారు. ఇటీవల కసరత్తులో భాగంగా ఆయనను మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా నిర్మయంచారు. సింహాద్రి చంద్రశేఖర్ అనే వైద్యుడ్ని అవనిగడ్డ సమన్వయకర్తగా ప్రకటించారు. అయితే ఈ మార్పులపై ఇద్దరూ అసంతృప్తితో ఉన్నారు. ఈ కారణంగా అవనిగడ్డతో పాటు మచిలీపట్నం పార్లమెంట్ స్థానంలో ఎన్నికల ప్రచారం ప్రారంభం కాలేదు.                

సింహాద్రి చంద్రశేఖర్ ను మచిలీపట్నం ఎంపీగా ప్రకటన 

గురువారం సాయంత్రం వైసీపీ ప్రధాన కార్యాలయం విడుదల చేసిన పదో జాబితాలో అవినిగడ్డ సమన్వయకర్తగా మళ్లీ సింహాద్రి రమేష్  ను నియమించారు. సింహాద్రి చంద్రశేఖర్ ను  మచిలీపట్నం ఎంపీగా పంపించారు.   తాను ఎంతో కాలం నుంచి అవనిగడ్డ ప్రజలకు సాయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సింహాద్రి చంద్రశేఖర్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన కుమారునికి సీటు ఖరారు చేయించుకున్నారు. ఇప్పుడు అన్నీ మారాయి. చంద్రశేఖరే మచిలీపట్నం ఎంపీగా ఖరారయ్యారు.    

మొదటి నుంచి గందరగోళమే 

అధికార వైసీపీలో ఇన్‌చార్జ్‌లు నియామకం, మార్పులు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.   సింహాద్రి చంద్రశేఖర్‌రావును  ఎమ్మెల్యే అభ్యర్థిగా  ఖరారు చేసిన  తర్వాత  ఆయన సైలెంట్‌గా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఆశించిన స్థాయిలో పాల్గొనలేదు.  తర్వాత తనకు వయసు సహకరించదని..  తన కుమారుడు రామ్‌ చరణ్‌ కు ఇన్‌చార్జ్‌ బాధ్యతలను  అప్పగించాలని ఆయన కోరారు.  సీఎం కలిసి వచ్చిన తరువాత నేరుగా డాక్టర్‌ చంధ్రశేఖర్‌.. నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను తన కుమారుడికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. ’అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా నన్ను నియమించినందుకు సీఎం జగన్‌ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కానీ, నా వయసు రీత్యా నా కుమారుడైన సింహాద్రి రామ్‌చరన్‌కు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇక నుంచి రామ్‌ చరణ్‌ అవనిగడ్డ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ప్రతి గడపకు తిరుగుతాడని ప్రకటించారు కానీ మళ్లీ మారిపోయింది. 

వైసీపీలోకి మండలి బుద్ద  ప్రసాద్ ను ఆకర్షించే ప్రయత్నం 
  
సింహాద్రి రమేష్ ను మళ్లీ అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించినా వైసీపీ హైకమాండ్ వేరే ఆలోచనల్లో ఉందని చెబుతున్నారు. ఈ స్థానం పొత్తుల్లో భాగంగా జనసేనకు వెళ్తోంది. టీడీపీ తరపునఇక్కడ సీనియర్‌ నేత మండలి బుద్ధ ప్రసాద్‌ బరిలోకి దిగాల్సి ఉంది. కానీ జనసేనకు వెళ్లడంతో అసంతృప్తికి గురయ్యారు. ఆయనతో వైసీపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. పొత్తలపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మండలి బుద్దప్రసాద్ కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే  సింహాద్రి రమేష్ కు హ్యాండిచ్చి.. బుద్ద ప్రసాద్ ను అభ్యర్థిగా ఖ౮రారు చేసే అవకాశం ఉంది.                    

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Vijaya Sai Reddy New Political Party: కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget