అన్వేషించండి

బ్యానర్లు అన్నీ వైసీపీ బ్లాక్ చేయడం కవ్వింపు చర్యలే, అంతా ఎంపీ పని - అచ్చెన్నాయుడు ఆగ్రహం

రాజమహేంద్రవరం శివారు వేమగిరిలో జాతీయ రహదారి పక్కన మహానాడు వేదిక నిర్మాణానికి భూమిపూజ చేశారు.

తెలుగు దేశం మహానాడు నిర్వహిస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని తెలగు దేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బ్యానర్లు కట్టుకునేందుకు హోర్డింగ్ లు కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

మహానాడుకు భూమి పూజ

రాజమహేంద్రవరం శివారు వేమగిరిలో జాతీయ రహదారి పక్కన మహానాడు వేదిక నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు హజరయ్యారు. తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు భూమి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు నభూతో నభవిష్యత్ అన్న చందంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 27వ తేదీన 15 వేల మంది ప్రతినిధులతో తెలుగుదేశం మహానాడు నిర్వహిస్తామని, 28వ తేదీన తెలుగుదేశం వ్యవస్థాపకులు   నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల ముగింపు 15 లక్షల మందితో ఘనంగా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ శత జయంతి 100 సభలు నిర్వహించామని తెలిపారు.

తొలిరోజు ప్రతినిధుల సభలో వైసీపీ పాలనకు వ్యతిరేకంగా 15 తీర్మానాలు ప్రవేశపెడతామని తెలిపారు. జగన్ అరాచక పాలన, అవినీతి, మైన్స్, శాండ్, ప్రకృతి వనరుల దోపిడీకి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తామని ప్రకటించారు. తెలుగుదేశం మహానాడు ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతుంటే, వైసీపీ కవ్వింపు చర్యలకు దిగుతోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఈ నెలాఖరు వరకు రాజమండ్రి సిటీతో పాటు పరిసర ప్రాంతాల హోర్డింగులన్నీ బ్లాక్ చేసి, టీడీపీ వారికి బోర్డులు ఇవ్వరాదని అడ్వర్టయిజ్మెంట్ ఏజెన్సీలకు హుకుం జారీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. వైసీపీ కవ్వింపు చర్యలు ఆపకపోతే ప్రజలలో తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు. మహానాడు విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర కమిటీలు వేశామని, జిల్లా స్థాయిలో కూడాా కమిటీలు వేసి అందరి సహకారం తీసుకుంటామని చెప్పారు.

జగన్ పాలన పోవాలి, చంద్రబాబు రావాలి - కళా వెంకటరావు

రాష్ట్ర టీడీపీ మాజీ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ తెలుగుదేశం అధినేత ఎన్టీఆర్ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి చాటిచెబితే, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పెద్దల కాళ్ళ మీద పడి తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ పాలన పోవాలి.. మళ్ళీ చంద్రబాబు పాలన రావాలి.. అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. దళిత, బలహీన వర్గాల సంక్షేమం కోసం చంద్రబాబు పాలన రావాలన్నారు. జగన్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకు ఈ మహానాడు నాంది పలుకుతుందన్నారు.  

మహానాడు అపూర్వ అద్యాయం - గోరంట్ల

రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రలోనే మహానాడు ఒక అపూర్వ అధ్యాయం అని అభివర్ణించారు. అన్న ఎన్టీఆర్ జన్మదినాన్ని మహానాడు పండుగగా జరుపుకోవడం తెలుగు ప్రజలందరికీ ఆనందదాయకమని అన్నారు. మహానాడు ఆతిథ్యానికి సిద్ధంగా ఉన్నామని, గోదావరి పుష్కరాలకు వచ్చిన అతిధులను ఆదరించిన తరహాలో అందరినీ ఆదరిస్తామని తెలిపారు. రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాల పరిధిలో కూడాా మహానాడు కమిటీలు వేస్తామని, అందరూ ఈ పండుగ విజయవంతంలో భాగస్వాములు కావాలని కోరారు.

జగన్ ను తరిమి కొడతాం - నిమ్మకాయల

పెద్దాపురం ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ మహానాడు కార్యక్మర్తల పండుగ అని, మహానాడు, ఎన్టీఆర్ వందో పుట్టిన రోజు వైభవంగా నిర్వహించేందుకు ఉభయగోదావరి జిల్లాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జగన్ ను తరిమికొట్టి, చంద్రబాబును సిఎం చేస్తామని ప్రజలే చెబుతున్నారని అన్నారు. జగన్ ఓటమే ధ్యేయంగా విపక్షాలు పని చేస్తున్నాయని, జనసేనాని పవన్ కళ్యాణ్ కూడాా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామని ప్రకటించారని చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
YS Jagan On TET Exam: టీచర్ల టెట్ నిబంధనలపై జగన్ ఫైర్! చంద్రబాబు తీరుపై మండిపడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత ఘాటు ట్వీట్!
టీచర్ల టెట్ నిబంధనలపై జగన్ ఫైర్! చంద్రబాబు తీరుపై మండిపడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత ఘాటు ట్వీట్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget