అన్వేషించండి

Budameru: బుడమేరు గండ్లు పూడ్చివేత - విజయవాడకు తప్పిన వరద ముప్పు

Vijayawada Floods: బుడమేరు గండ్ల పూడ్చివేత ప్రక్రియ పూర్తైంది. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయగా సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులను ప్రశంసించారు.

Budameru Gandi Burial Completed: బుడమేరు (Budameru) గండ్ల పూడ్చివేత పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈ క్రమంలో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయి విజయవాడకు (Vijayawada) ముప్పు తప్పినట్లయింది. ఇప్పటికే రెండు గండ్లు పూడ్చివేయగా.. తాజాగా మైలవరం నియోజకవర్గం కొండపల్లి కవులూరు వద్ద తాజాగా మూడో గండిని పూడ్చేశారు. అంతకుముందు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పనులను పరిశీలించారు. వరద ఉద్ధృతి పెరిగిన క్రమంలో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేశారు. ప్రవాహం ఉద్ధృతంగా ఉన్న సమయంలోనే రెండు గండ్లను పూడ్చేశారు. ఇటీవల భారీ వర్షాలకు ఒక్కసారిగా 60 వేల క్యూసెక్కుల వరద రావడంతో బుడమేరు డైవర్షన్ ఛానల్‌కు గండ్లు పడ్డాయి. కాగా, మూడో గండి మాత్రం పెద్దది కావడంతో దాన్ని పూడ్చడానికి పలు ఏజెన్సీలతో పాటు భారత సైన్యం రంగంలోకి దిగింది. చెన్నైకు చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్‌కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు 120 మంది ఇక్కడకు వచ్చి పనులు చేపట్టారు. 

గేబియన్ బుట్టల ద్వారా..

బుడమేరు (Budameru) గండ్లను గేబియాన్ బుట్టల (ఇనుప చువ్వలతో బుట్టలా చేసి దానిని పెద్ద రాళ్లు, ఇసుక బస్తాలతో నింపే ప్రక్రియ) ద్వారా పూడ్చారు. మూడో గండి 80 నుంచి 100 మీటర్లు ఉండగా.. బుట్టల ద్వారా పూడ్చినట్లు సైన్యం వెల్లడించింది. వీటిని పటిష్టంగా ఉంచేలా 4 మీటర్ల వరకూ రక్షిత కట్ట నిర్మిస్తామని తెలిపింది. కాగా, గత కొద్ది రోజులుగా జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) బుడమేరు గండ్ల వద్దే ఉండి రాత్రనక, పగలనకు గండ్ల పూడ్చివేత పనులను పర్యవేక్షించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అధికారులు, సిబ్బందిని పరుగులు పెట్టించారు. ముంపు నుంచి నగరం తేరుకునే వరకూ వెళ్లేది లేదంటూ అక్కడే కాల్వ గట్లపై ఉండి పని చేశారు. ప్రస్తుతం గండ్ల పూడ్చివేతతో వరద ప్రవాహం తగ్గి భారీ ఉపశమనం లభించినట్లయింది. మరోవైపు, బుడమేరు గండ్ల పనులను విజయవంతంగా పూర్తి చేసిన మంత్రులు, అధికారులను సీఎం చంద్రబాబు (CM Chandrababu) అభినందించారు. అతి పెద్ద సవాల్‌ను ఎదుర్కొని పని చేశారని ప్రశంసించారు. 

'మళ్లీ సమస్య రాకుండా..'

సీఎం చంద్రబాబు గత కొద్ది రోజులుగా 24 గంటలూ కలెక్టరేట్‌లోనే ఉండి పనులు పర్యవేక్షించారని మంత్రి నిమ్మల తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నిరంతరం కష్టపడ్డామని.. గండ్ల పూడ్చివేతతో ముప్పు తప్పినట్లయిందని అన్నారు. వర్షం పడితే మళ్లీ సమస్య రాకుండా కట్ట ఎత్తు పెంచుతామని.. ఈ పనులు వెంటనే చేపడతామని చెప్పారు. విజయవాడలో ఉన్న నీరు క్రమంగా తగ్గుతోందని.. అవసరమైతే మోటార్లు పెట్టి నీటిని తోడిపోస్తామని పేర్కొన్నారు.

విజయవాడ నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో బురదను ఫైరింజన్ల సాయంతో తొలగిస్తున్నారు. అనంతరం చెత్తా చెదారాన్ని క్లీన్ చేస్తున్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు. డ్రోన్ల ద్వారా బ్లీచింగ్ స్ప్రే చేస్తున్నారు. అటు, ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ప్రభుత్వం నిత్యావసరాల కిట్ అందిస్తోంది. ఇంకా వరద తగ్గని కొన్ని చోట్ల పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. అక్కడి బాధితులకు ఆహారం, తాగునీరు అందిస్తున్నారు. నగరంలోని చాలా ప్రాంతాలు ఇప్పుడిప్పుడే పూర్తిగా వరద నుంచి కోలుకుంటున్నాయి. 

Also Read: Nellore News: విజయవాడ వరద బాధితులకు నెల్లూరోళ్ల చిరు సాయం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. మే 28న సిద్ధరామయ్య రాజీనామా!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. మే 28న సిద్ధరామయ్య రాజీనామా!
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Pawan Kalyan Producers Meeting: పవన్‌తో ప్రొడ్యూసర్స్ మీటింగ్ - చిన్నవాళ్ళను పిలవలేదా? వంద కోట్లు నిర్మాతలే వెళ్ళరా?
పవన్‌తో ప్రొడ్యూసర్స్ మీటింగ్ - చిన్నవాళ్ళను పిలవలేదా? వంద కోట్లు నిర్మాతలే వెళ్ళరా?
 Nara Lokesh Big Announcement: మహిళలకు 33శాతం సీట్లు  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకష్
మహిళలకు 33శాతం సీట్లు..!  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నారాలోకేష్

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
Battery as a Service India: ఈవీ మార్కెట్‌లో కొత్త
ఈవీ మార్కెట్‌లో కొత్త "బాస్‌"! సగం ధరకే విద్యుత్‌ కార్లు! నిజంగానే ఇది సామాన్యుడికి వరమేనా?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
Balakrishna Birthday: బాలయ్య బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న గోపీచంద్ మలినేని
బాలయ్య బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న గోపీచంద్ మలినేని
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
5 Rupee Fish Meal: బెంగాల్‌లో రూ.5కే చేపల కూర భోజనం - సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయం!
బెంగాల్‌లో రూ.5కే చేపల కూర భోజనం - సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయం!
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Embed widget