అన్వేషించండి

AP Letter TO GRMB: తెలంగాణ చెబుతున్నవన్నీ అబద్ధాలే.. డీపీఆర్‌లను ఆమోదించొద్దు.. జీఆర్ఎంబీకి ఏపీ లేఖ

గోదావరి బోర్డు, కేంద్ర జల్‌శక్తి శాఖలకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. గోదావరిపై నీటి కేటాయింపులు సంబంధించిన తెలంగాణ చెబుతున్నావన్ని అబద్ధాలని పేర్కొంది.

 

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలకు ఆమోదం తెలపవద్దని గోదావరి బోర్డు, కేంద్ర జల్ శాక్తి శాఖలకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. గోదావరి జల వివాద ట్రైబ్యునల్‌, ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి నీటిని మళ్లిస్తుందని ఏపీ ప్రభుత్వ తెలిపింది. ఈ ప్రాజెక్టుల వల్ల దిగువనున్న పోలవరం ప్రాజెక్టులోకి ప్రవాహం తగ్గిపోతుందని వెల్లడించింది. 

తెలంగాణ నీటిపారుదల శాఖ సీతారామ, తుపాకులగూడెంతోపాటు అయిదు ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఆమోదం కోసం గోదావరి బోర్డుకు సమర్పించింది. అయితే బోర్డు ఈ డీపీఆర్‌లను ఆంధ్రప్రదేశ్‌కు పంపి అభిప్రాయాలను చెప్పాలని కోరింది. దీని గురించి ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు గోదావరి బోర్డు ఛైర్మన్‌కు, కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శికి లేఖలు రాశారు. డీపీఆర్‌లను ఆమోదించవద్దని కోరారు.

గోదావరిలోని 12 ఉపనదుల్లో 11.. ఎగువ రాష్ట్రాల నుంచి తెలంగాణ ద్వారా ప్రవహిస్తున్నాయని.. శబరి మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో గోదావరిలో కలుస్తుందని.. ఆంధ్రప్రదేశ్‌ దిగువన ఉన్న రైపేరియన్‌ రాష్ట్రమైనా,  భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా గోదావరి జలాల్లో ఏడాది పొడవునా ఎక్కువగా వాడుకోవడానికి అవకాశం ఉందని లేఖలో ఏపీ తెలిపింది.  రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ ఒప్పందం లేదా ట్రైబ్యునల్‌ అవార్డు ద్వారా జరగాలని 2016లో జరిగిన గోదావరి బోర్డు మూడో సమావేశంలో తెలంగాణ పేర్కొందని వెల్లడించింది.

పునర్విభజన తర్వాత 75 శాతం నీటి లభ్యత కింద రెండు రాష్ట్రాలు అప్పటికే వినియోగంలో ఉన్న, నిర్మిస్తున్న ప్రాజెక్టుల కింద తమ నీటి వినియోగాన్ని మార్పు చేసుకొన్నాయని..  దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ వాటా 776 టీఎంసీలు కాగా, తెలంగాణది 650 టీఎంసీలు అని తెలిపింది. మొత్తం నీటి లభ్యత 1,430 టీఎంసీల్లో రెండు రాష్ట్రాలు కలిపి 1,426 టీఎంసీలు వినియోగించుకొనేలా చేపట్టాయి. కాబట్టి కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి నీటి లభ్యత లేదని ఏపీ స్పష్టం చేసింది.

కిందటి సంవత్సరం అక్టోబరులో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌లో గోదావరి జలాల పంపిణీ కోసం ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు లేఖలో గుర్తు చేశారు.  తెలంగాణ చేపట్టిన కొత్త ప్రాజెక్టులతో 1,355 టీఎంసీలు వినియోగించుకొంటుందని తెలిపారు. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి కేంద్ర జల్‌శక్తి మంత్రికి లేఖ రాసిన విషయం చెప్పారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు ట్రైబ్యునల్‌ అవార్డు, అంతర్‌రాష్ట్ర ఒప్పందాలను పరిగణనలోకి తీసుకోవాలని.. ఇవేమీ పట్టించుకోకుండా.. తెలంగాణ ఏకపక్షంగా ప్రాజెక్టులు నిర్మించి, నీటిని మళ్లించడం సరికాదని శ్యామల రావులో లేఖలో స్పష్టం చేశారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Also Read: Weather Update: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Markapuram Road Accident: మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! టిప్పర్‌, ప్రైవేట్ బస్‌ ఢీకొని 13 మంది సజీవదహనం !
మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! టిప్పర్‌, ప్రైవేట్ బస్‌ ఢీకొని 13 మంది సజీవదహనం !
Women Reservation Effect: రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
Steel Plant Credit Game: మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Connection: ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
Hyderabad Chicken Shops Close: హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
Revanth south Movement: రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
Women Reservation Effect: రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
Ustaad Bhagat Singh Collections: బాక్సాఫీస్‌లో బోల్తా కొట్టిన 'ఉస్తాద్ భగత్ సింగ్'... ఏడు రోజులైనా బడ్జెట్‌లో సగం కూడా రాలేదుగా
బాక్సాఫీస్‌లో బోల్తా కొట్టిన 'ఉస్తాద్ భగత్ సింగ్'... ఏడు రోజులైనా బడ్జెట్‌లో సగం కూడా రాలేదుగా
Aryaman Birla : రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాడు ఆర్‌సిబి జట్టుకు ఛైర్మన్ ఎలా అయ్యారు? ఐపీఎల్‌లో ఆసక్తికరమైన స్టోరీ!
రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాడు ఆర్‌సిబి జట్టుకు ఛైర్మన్ ఎలా అయ్యారు? ఐపీఎల్‌లో ఆసక్తికరమైన స్టోరీ!
Hyderabad Food Safety: హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
Balakrishna : బాలయ్యకు మరో అరుదైన గౌరవం - ఢిల్లీ వేదికగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
బాలయ్యకు మరో అరుదైన గౌరవం - ఢిల్లీ వేదికగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు
Embed widget