అన్వేషించండి

AP Letter TO GRMB: తెలంగాణ చెబుతున్నవన్నీ అబద్ధాలే.. డీపీఆర్‌లను ఆమోదించొద్దు.. జీఆర్ఎంబీకి ఏపీ లేఖ

గోదావరి బోర్డు, కేంద్ర జల్‌శక్తి శాఖలకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. గోదావరిపై నీటి కేటాయింపులు సంబంధించిన తెలంగాణ చెబుతున్నావన్ని అబద్ధాలని పేర్కొంది.

 

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలకు ఆమోదం తెలపవద్దని గోదావరి బోర్డు, కేంద్ర జల్ శాక్తి శాఖలకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. గోదావరి జల వివాద ట్రైబ్యునల్‌, ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి నీటిని మళ్లిస్తుందని ఏపీ ప్రభుత్వ తెలిపింది. ఈ ప్రాజెక్టుల వల్ల దిగువనున్న పోలవరం ప్రాజెక్టులోకి ప్రవాహం తగ్గిపోతుందని వెల్లడించింది. 

తెలంగాణ నీటిపారుదల శాఖ సీతారామ, తుపాకులగూడెంతోపాటు అయిదు ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఆమోదం కోసం గోదావరి బోర్డుకు సమర్పించింది. అయితే బోర్డు ఈ డీపీఆర్‌లను ఆంధ్రప్రదేశ్‌కు పంపి అభిప్రాయాలను చెప్పాలని కోరింది. దీని గురించి ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు గోదావరి బోర్డు ఛైర్మన్‌కు, కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శికి లేఖలు రాశారు. డీపీఆర్‌లను ఆమోదించవద్దని కోరారు.

గోదావరిలోని 12 ఉపనదుల్లో 11.. ఎగువ రాష్ట్రాల నుంచి తెలంగాణ ద్వారా ప్రవహిస్తున్నాయని.. శబరి మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో గోదావరిలో కలుస్తుందని.. ఆంధ్రప్రదేశ్‌ దిగువన ఉన్న రైపేరియన్‌ రాష్ట్రమైనా,  భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా గోదావరి జలాల్లో ఏడాది పొడవునా ఎక్కువగా వాడుకోవడానికి అవకాశం ఉందని లేఖలో ఏపీ తెలిపింది.  రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ ఒప్పందం లేదా ట్రైబ్యునల్‌ అవార్డు ద్వారా జరగాలని 2016లో జరిగిన గోదావరి బోర్డు మూడో సమావేశంలో తెలంగాణ పేర్కొందని వెల్లడించింది.

పునర్విభజన తర్వాత 75 శాతం నీటి లభ్యత కింద రెండు రాష్ట్రాలు అప్పటికే వినియోగంలో ఉన్న, నిర్మిస్తున్న ప్రాజెక్టుల కింద తమ నీటి వినియోగాన్ని మార్పు చేసుకొన్నాయని..  దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ వాటా 776 టీఎంసీలు కాగా, తెలంగాణది 650 టీఎంసీలు అని తెలిపింది. మొత్తం నీటి లభ్యత 1,430 టీఎంసీల్లో రెండు రాష్ట్రాలు కలిపి 1,426 టీఎంసీలు వినియోగించుకొనేలా చేపట్టాయి. కాబట్టి కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి నీటి లభ్యత లేదని ఏపీ స్పష్టం చేసింది.

కిందటి సంవత్సరం అక్టోబరులో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌లో గోదావరి జలాల పంపిణీ కోసం ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు లేఖలో గుర్తు చేశారు.  తెలంగాణ చేపట్టిన కొత్త ప్రాజెక్టులతో 1,355 టీఎంసీలు వినియోగించుకొంటుందని తెలిపారు. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి కేంద్ర జల్‌శక్తి మంత్రికి లేఖ రాసిన విషయం చెప్పారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు ట్రైబ్యునల్‌ అవార్డు, అంతర్‌రాష్ట్ర ఒప్పందాలను పరిగణనలోకి తీసుకోవాలని.. ఇవేమీ పట్టించుకోకుండా.. తెలంగాణ ఏకపక్షంగా ప్రాజెక్టులు నిర్మించి, నీటిని మళ్లించడం సరికాదని శ్యామల రావులో లేఖలో స్పష్టం చేశారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Also Read: Weather Update: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam Eligibility Status: ప్రతి విద్యార్థికి రూ.15 వేలు.. తల్లికి వందనం స్కీమ్ కు మీకు పడతాయా?.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ప్రతి విద్యార్థికి రూ.15 వేలు.. తల్లికి వందనం స్కీమ్ కు మీరు అర్హులేనే.. ఇలా చెక్ చేసుకోండి
Breaking News: భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్
భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్
Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
AC ఆన్‌లో ఉన్నా Petrol ఖర్చులు తగ్గించుకోవచ్చు.. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవి పాటించండి
AC ఆన్‌లో ఉన్నా Petrol ఖర్చులు తగ్గించుకోవచ్చు.. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవి పాటించండి

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 PBKS VS LSG Result Update: శ్రేయ‌స్ కెప్టెన్ ఇన్నింగ్స్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా.. నాకౌట్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన ప్ర‌భ్ సిమ్రాన్.. టోర్నీ నుంచి ఢిల్లీ ఔట్ 
శ్రేయ‌స్ కెప్టెన్ ఇన్నింగ్స్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా.. నాకౌట్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన ప్ర‌భ్ సిమ్రాన్.. టోర్నీ నుంచి ఢిల్లీ ఔట్ 
Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
Peddi Bhopal Event Live Updates: రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు... ప్రతి ఫ్రేమ్‌లో చరణ్ కష్టమే... 'పెద్ది' భోపాల్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్
రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు... ప్రతి ఫ్రేమ్‌లో చరణ్ కష్టమే... 'పెద్ది' భోపాల్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్
Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు భారీ ఊరట.. WFI తీరును తప్పుపట్టిన హైకోర్టు
రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు భారీ ఊరట.. WFI తీరును తప్పుపట్టిన హైకోర్టు
Arava Sridhar Resignation: అరవ శ్రీధర్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన పవన్ కల్యాణ్ - విప్ పదవికి రాజీనామా
అరవ శ్రీధర్‌కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన పవన్ కల్యాణ్ - విప్ పదవికి రాజీనామా
Telangana Heatwave: అమ్మో.. ఇవేం ఎండలురా బాబు.. తలపై చెట్టు కొమ్మతో వినూత్నంగా Watch Video
అమ్మో.. ఇవేం ఎండలురా బాబు.. తలపై చెట్టు కొమ్మతో వినూత్నంగా Watch Video
IPL 2026 Mohammed Shami: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా అరుదైన ఘనత
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా అరుదైన ఘనత
Honda City Facelift News: కొత్త హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ లాంచ్: కారును పూర్తిగా మార్చేసిన టాప్ 5 మేజర్ అప్‌డేట్స్ ఇవే
కొత్త హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ లాంచ్: కారును పూర్తిగా మార్చేసిన టాప్ 5 మేజర్ అప్‌డేట్స్ ఇవే
Embed widget