అన్వేషించండి

AP Letter TO GRMB: తెలంగాణ చెబుతున్నవన్నీ అబద్ధాలే.. డీపీఆర్‌లను ఆమోదించొద్దు.. జీఆర్ఎంబీకి ఏపీ లేఖ

గోదావరి బోర్డు, కేంద్ర జల్‌శక్తి శాఖలకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. గోదావరిపై నీటి కేటాయింపులు సంబంధించిన తెలంగాణ చెబుతున్నావన్ని అబద్ధాలని పేర్కొంది.

 

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలకు ఆమోదం తెలపవద్దని గోదావరి బోర్డు, కేంద్ర జల్ శాక్తి శాఖలకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. గోదావరి జల వివాద ట్రైబ్యునల్‌, ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి నీటిని మళ్లిస్తుందని ఏపీ ప్రభుత్వ తెలిపింది. ఈ ప్రాజెక్టుల వల్ల దిగువనున్న పోలవరం ప్రాజెక్టులోకి ప్రవాహం తగ్గిపోతుందని వెల్లడించింది. 

తెలంగాణ నీటిపారుదల శాఖ సీతారామ, తుపాకులగూడెంతోపాటు అయిదు ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఆమోదం కోసం గోదావరి బోర్డుకు సమర్పించింది. అయితే బోర్డు ఈ డీపీఆర్‌లను ఆంధ్రప్రదేశ్‌కు పంపి అభిప్రాయాలను చెప్పాలని కోరింది. దీని గురించి ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు గోదావరి బోర్డు ఛైర్మన్‌కు, కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శికి లేఖలు రాశారు. డీపీఆర్‌లను ఆమోదించవద్దని కోరారు.

గోదావరిలోని 12 ఉపనదుల్లో 11.. ఎగువ రాష్ట్రాల నుంచి తెలంగాణ ద్వారా ప్రవహిస్తున్నాయని.. శబరి మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో గోదావరిలో కలుస్తుందని.. ఆంధ్రప్రదేశ్‌ దిగువన ఉన్న రైపేరియన్‌ రాష్ట్రమైనా,  భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా గోదావరి జలాల్లో ఏడాది పొడవునా ఎక్కువగా వాడుకోవడానికి అవకాశం ఉందని లేఖలో ఏపీ తెలిపింది.  రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ ఒప్పందం లేదా ట్రైబ్యునల్‌ అవార్డు ద్వారా జరగాలని 2016లో జరిగిన గోదావరి బోర్డు మూడో సమావేశంలో తెలంగాణ పేర్కొందని వెల్లడించింది.

పునర్విభజన తర్వాత 75 శాతం నీటి లభ్యత కింద రెండు రాష్ట్రాలు అప్పటికే వినియోగంలో ఉన్న, నిర్మిస్తున్న ప్రాజెక్టుల కింద తమ నీటి వినియోగాన్ని మార్పు చేసుకొన్నాయని..  దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ వాటా 776 టీఎంసీలు కాగా, తెలంగాణది 650 టీఎంసీలు అని తెలిపింది. మొత్తం నీటి లభ్యత 1,430 టీఎంసీల్లో రెండు రాష్ట్రాలు కలిపి 1,426 టీఎంసీలు వినియోగించుకొనేలా చేపట్టాయి. కాబట్టి కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి నీటి లభ్యత లేదని ఏపీ స్పష్టం చేసింది.

కిందటి సంవత్సరం అక్టోబరులో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌లో గోదావరి జలాల పంపిణీ కోసం ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు లేఖలో గుర్తు చేశారు.  తెలంగాణ చేపట్టిన కొత్త ప్రాజెక్టులతో 1,355 టీఎంసీలు వినియోగించుకొంటుందని తెలిపారు. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి కేంద్ర జల్‌శక్తి మంత్రికి లేఖ రాసిన విషయం చెప్పారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు ట్రైబ్యునల్‌ అవార్డు, అంతర్‌రాష్ట్ర ఒప్పందాలను పరిగణనలోకి తీసుకోవాలని.. ఇవేమీ పట్టించుకోకుండా.. తెలంగాణ ఏకపక్షంగా ప్రాజెక్టులు నిర్మించి, నీటిని మళ్లించడం సరికాదని శ్యామల రావులో లేఖలో స్పష్టం చేశారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Also Read: Weather Update: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sankranti celebrations: కోడి పందేలతో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు - ఎక్కడ చూసినా బరులే!
కోడి పందేలతో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు - ఎక్కడ చూసినా బరులే!
Siddaramaiah Controversy: జర్మనీ చాన్సలర్‌కు అగౌరవం - రాహుల్‌కే గౌరవం - మరో వివాదంలో సిద్ధరామయ్య!
జర్మనీ చాన్సలర్‌కు అగౌరవం - రాహుల్‌కే గౌరవం - మరో వివాదంలో సిద్ధరామయ్య!
Republic Day 2026: రిపబ్లిక్‌డే ముందు ఢిల్లీలో డేగలకు 'చికెన్ పార్టీ'! ప్రభుత్వం ఎందుకిలా చేస్తోంది?
రిపబ్లిక్‌డే ముందు ఢిల్లీలో డేగలకు 'చికెన్ పార్టీ'! ప్రభుత్వం ఎందుకిలా చేస్తోంది?
Pongal 2026: కేంద్రమంత్రి ఇంట్లో పొంగల్ వండిన మోదీ! తమిళ ప్రజలకు పండగ శుభాకాంక్షలు చెప్పిన పీఎం!
కేంద్రమంత్రి ఇంట్లో పొంగల్ వండిన మోదీ! తమిళ ప్రజలకు పండగ శుభాకాంక్షలు చెప్పిన పీఎం!

వీడియోలు

Mumbai Indians vs Gujarat Giants WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం!
Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
Jitesh Sharma Being Dropped from T20 World Cup | వరల్డ్ కప్ జితేష్ సంచలన వ్యాఖ్యలు!
India vs New Zealand 2nd ODI | టీమిండియాలో భారీ మార్పులు ?
Anil Ravipudi on Social Media Trolls | మీమర్స్ ట్రోల్స్ వేసుకుంటే వేసుకోండి..నేను ఎంజాయ్ చేస్తా |ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sankranti celebrations: కోడి పందేలతో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు - ఎక్కడ చూసినా బరులే!
కోడి పందేలతో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు - ఎక్కడ చూసినా బరులే!
Siddaramaiah Controversy: జర్మనీ చాన్సలర్‌కు అగౌరవం - రాహుల్‌కే గౌరవం - మరో వివాదంలో సిద్ధరామయ్య!
జర్మనీ చాన్సలర్‌కు అగౌరవం - రాహుల్‌కే గౌరవం - మరో వివాదంలో సిద్ధరామయ్య!
Republic Day 2026: రిపబ్లిక్‌డే ముందు ఢిల్లీలో డేగలకు 'చికెన్ పార్టీ'! ప్రభుత్వం ఎందుకిలా చేస్తోంది?
రిపబ్లిక్‌డే ముందు ఢిల్లీలో డేగలకు 'చికెన్ పార్టీ'! ప్రభుత్వం ఎందుకిలా చేస్తోంది?
Pongal 2026: కేంద్రమంత్రి ఇంట్లో పొంగల్ వండిన మోదీ! తమిళ ప్రజలకు పండగ శుభాకాంక్షలు చెప్పిన పీఎం!
కేంద్రమంత్రి ఇంట్లో పొంగల్ వండిన మోదీ! తమిళ ప్రజలకు పండగ శుభాకాంక్షలు చెప్పిన పీఎం!
Celina Jaitley: పెళ్లి రోజున విడాకుల నోటీసు... పిల్లలను దూరం చేశాడు... బాధపడిన హీరోయిన్
పెళ్లి రోజున విడాకుల నోటీసు... పిల్లలను దూరం చేశాడు... బాధపడిన హీరోయిన్
Kamareddy Crime News: తెలంగాణలో 600 కుక్కలను విషం పెట్టి చంపేశారు! ఎన్నికల్లో ఇచ్చిన హామీ కోసం దారుణం!
తెలంగాణలో 600 కుక్కలను విషం పెట్టి చంపేశారు! ఎన్నికల్లో ఇచ్చిన హామీ కోసం దారుణం!
The Raja Saab : మెగాస్టార్‌తో మూవీ - 'ది రాజా సాబ్' డైరెక్టర్ మారుతి రియాక్షన్... ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్
మెగాస్టార్‌తో మూవీ - 'ది రాజా సాబ్' డైరెక్టర్ మారుతి రియాక్షన్... ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్
Anaganaga Oka Raju Review - 'అనగనగా ఒక రోజు' రివ్యూ: పండక్కి పల్లెటూరి కథతో వచ్చిన నవీన్ పోలిశెట్టి - సినిమా హిట్టేనా?
'అనగనగా ఒక రోజు' రివ్యూ: పండక్కి పల్లెటూరి కథతో వచ్చిన నవీన్ పోలిశెట్టి - సినిమా హిట్టేనా?
Embed widget