By: ABP Desam | Updated at : 30 Sep 2021 07:14 AM (IST)
Edited By: Sai Anand Madasu
ప్రతీకాత్మక చిత్రం
గులాబ్ తుపాన్ నుంచి కోలుకుంటున్న వేళ మరోసారి వాన ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం పశ్చిమబెంగాల్ వైపు కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో బలపడనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో వచ్చే 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంతో తెలంగాణలో అక్కడక్కడ గురువారం ఓ మోస్తరుగా, శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే సమయంలో రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షములు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశములు వున్నాయని వెల్లడించారు. మహబూబ్నగర్లో ఉష్ణోగ్రత సాధారణంకన్నా 4.4 డిగ్రీలు తగ్గి బుధవారం పగలు గరిష్ఠంగా 27.1 డిగ్రీలుంది.
ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతాలో ఇవాళ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని.. అక్టోబర్ 2, 3 తేదీల్లో ఢిల్లీలో భారీ ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం.. పశ్చిమ బెంగాల్ లోని పురులియా, బంకురా, పశ్చిమ బర్ధమాన్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వచ్చే 24 గంటల్లో మహారాష్ట్రలోని మరాఠ్వాడా, ముంబై, కొంకణ్లోని ఇతర ప్రాంతాల్లో 'అతి భారీ వర్షాలు' కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
Gold-Silver Prices Today: జాబ్స్ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Breaking News Live Telugu Updates: యశోద హాస్పిటల్లో కేసీఆర్ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి
Fake Votes in AP: రాప్తాడులో ఆధార్ కార్డు మార్ఫింగ్, దొంగ ఓట్ల నాటకాలు ఆపాలి: ఎమ్మెల్యేపై పరిటాల సునీత ఫైర్
Balineni YSRCP : మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నా - వైసీపీ మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు
Andhra News: 'తుపాను బాధితులకు ప్రభుత్వం రూ.25 వేలు అందించాలి' - సీఎం రైతుల బాధలు పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఆగ్రహం
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే
/body>