అన్వేషించండి

AP Sarpanch Elections : టీడీపీ వర్సెస్ వైసీపీ - ఏపీ పంచాయతీ ఉపఎన్నికల్లో పలు చోట్ల ఉద్రిక్తత !

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత ఏర్పడింది. రెండు గంటల నుంచి కౌంటింగ్ నిర్వహిస్తారు.

AP Sarpanch Elections : ఏపీలో  35 గ్రామ  సర్పంచ్‌, 245 వార్డు సభ్యుల స్థానాలకు శనివారం పోలింగ్‌ జరిగింది.  మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌   అనంతరం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. చిన్న పంచాయతీల ఉపఎన్నికలే అయినా రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితి ఏర్పింది.  

అనంతపురం జిల్లా నార్పలలో ఎనిమిదవ వార్డు ఉప ఎన్నికలో టీడీపీ వర్సెస్‌ వైసీపీ అన్నట్లుగా పోరు సాగుతోంది.  ఒక వార్డ్‌ పోలింగుకు డీఎస్పీ వెంకటశివారెడ్డి, సీఐ అస్సార్‌ భాష, రాప్తాడు, నార్పల ఎస్సైలు, మరో 50 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  ఎనిమిదవ వార్డులో మధ్యాహ్నం ఒంటి గంటకి పోలింగ్‌ ముగిసింది.  ఆ తర్వాత రెండు గంటల నుంచి వార్డు కౌంటింగ్‌ నిర్వహిస్తారు. 
 
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం వీరమ్మకుంట పంచాయతీ ఎన్నికల్లో ఉద్రికత్త ఏర్పడింది. వైసీపీ కార్యకర్తలు.. టీటీడీపీ  కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు.  ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తమపై దాడులు చేయిస్తున్నారని తెలుగు దేశం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత చింతమనేని ప్రభాకర్‌ను గ్రామంలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం వణుదుర్రు పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని టిడిపి నేతలు ఆరోపించారు. వైసిపి ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కుమారుడు ఆధ్వర్యంలో రిగ్గింగ్‌ జరుగుతోందని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.  

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సర్పంచి ఉపఎన్నికలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏడుగురు టిడిపి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొండపి ఎమ్మెల్యే స్వామి ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసిపి ఇన్‌ఛార్జిని వదిలి తమను అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే స్వామి ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం బప్పడంలో వైసిపి, టిడిపి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పలువురు టిడిపి కార్యకర్తలకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.                         

ఓటమి భయంతో సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైసీపీ  అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమా ఆరోపించారు.  దెందులూరు నియోజకవర్గం వీరమ్మకుంటలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీల దాడి దుర్మార్గమని మండిపడ్డారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అండచూసుకునే వైసీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారన్నారు. అధికార పార్టీ అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలకు పోలీసులు వత్తాసు పలకడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి ఒక రూలు - ప్రతిపక్షానికి ఒక రూలా అని ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దెందులూరు నుంచి పారిపోవడం ఖాయమన్నారు. వీరమ్మకుంటలో చోటుచేసుకున్న ఘటనపై ఎన్నికల అధికారులు స్పందించాలని కోరారు. దాడులకు తెగబడిన వారిపై కేసులు నమోదు చేయాలని ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు.                           

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
AP Ration Shops: ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget