అన్వేషించండి

Anna Canteens: ఏపీలో మళ్లీ రంగుల రాజకీయం - అన్న క్యాంటీన్ లపై హైకోర్టులో పిటిషన్

Anna Canteens: తెలుగుదేశం పార్టీని గుర్తు తెచ్చేలా అన్న క్యాంటీన్లకు పసుపు రంగు వేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Anna Canteens: అన్న క్యాంటీన్లకు పసుపు రంగు వేయడంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో కూడా ఇలాంటి రచ్చే జరిగింది. అప్పట్లో గ్రామ, వార్డు సచివాలయాలకు వైసీపీ రంగులు వేశారంటూ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కోర్టుకెక్కింది. చివరకు అనుకున్నది సాధించింది. ఇప్పుడు అన్న క్యాంటీన్ల వ్యవహారం తేలాల్సి ఉంది. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో అన్న క్యాంటీన్లను పునరుద్ధరించింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న క్యాంటీన్లను వైసీపీ అధికారంలోకి వచ్చాక మూసివేసింది. వాటిని ఇతర అవసరాలకు వాడుకుంది. కొన్ని భవనాలను సచివాలయాలుగా మార్చింది, మరికొన్ని పాడుబడిపోయాయి. కూటమి వచ్చిన తర్వాత వాటన్నిటినీ తిరిగి ప్రారంభిస్తోంది. తొలి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభించారు. మలి విడతలో ఈనెల 18న 75 క్యాంటీన్లు ప్రారంభించారు. మొత్తంగా రాష్ట్రంలో 175 క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. అన్నిటినీ ఒకే తరహాలో ఏర్పాటు చేశారు.

టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు ఫొటోలు కామన్ గా ఉంటాయి. ఇక రంగుల విషయానికొస్తే.. ఎరుపు, పసుపు కాంబినేషన్ హైలైట్ అవుతుంటుంది. పసుపు బోర్డ్ పై రెడ్ కలర్ అక్షరాల్లో అన్న క్యాంటీన్ అనే పేరుంటుంది. ఇక్కడ డిప్యూటీ సీఎంకి ప్రాధాన్యత ఇవ్వలేదంటూ కొంతమంది ప్రస్తావించినా జనసేన ఆ విషయంలో రియాక్ట్ కాలేదు. పవన్ కల్యాణ్ కూడా ఎక్కడా టీడీపీకి ప్రాధాన్యత దక్కిందని అనలేదు. సో అన్న క్యాంటీన్ విషయంలో కూటమి వరకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. అయితే వైసీపీ నుంచి మాత్రం తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. అన్న క్యాంటీన్లలో సౌకర్యాలు సరిగా లేవని, ప్లేట్లు సరికా కడగడం లేదని ఆ మధ్య కొన్ని వీడియోలను వైసీపీ వైరల్ చేసింది. అయితే అదంతా తప్పుడు ప్రచారమని టీడీపీ కౌంటర్ ఇచ్చింది. అక్కడితో ఆ వ్యవహారం ముగిసిందనుకున్నా ఇప్పుడు కొత్తగా అన్న క్యాంటీన్ల రంగు గురించి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 

అన్న క్యాంటీన్లకు తెలుగుదేశం పార్టీని గుర్తు తెచ్చేలా పసుపు రంగు వేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వ భవనాలకు అధికార పార్టీ రంగులు వేస్తుంటే అధికారులు వారించలేదని సైతం ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలకు అధికార పార్టీ రంగులు వేయడం సరికాదంటూ గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఏపీలో పరిణామాలున్నాయన్నారు చంద్రశేఖర్ రెడ్డి. ఈ పిటిషన్ వ్యవహారం ఇప్పుడు ఏపీలో రాజకీయ చర్చకు తెరతీసింది. ఈ పిటిషన్ వెనక వైసీపీ హస్తముందనే అనుమానాలున్నాయి. 

మరోవైపు వైసీపీ కూడా అన్న క్యాంటీన్లపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తామన్న అన్న క్యాంటీన్లకోసం విరాళాలు సేకరిస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిధులివ్వకుండా విరాళాలతో క్యాంటీన్లు నిర్వహించడమేంటని లాజిక్ తీస్తున్నారు. 

Also Read: డాక్టర్‌ని కొట్టిన జనసేన ఎమ్మెల్యే! బూతులతో మెడికల్ కాలేజీ వైస్ ఛైర్మన్‌పై దాడి

క్యాంటీన్ల ఏర్పాటు, నిర్వహణ విషయంలో వైసీపీ వాదనను ప్రజలు పట్టించుకుంటారా లేదా అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. వైసీపీ హయాంలో అన్న క్యాంటీన్లు లేవు. కూటమి ప్రభుత్వం వీటిని పునరుద్ధరించింది. సో క్యాంటీన్ల విషయంలో టీడీపీపై ప్రజల్లో సింపతీ ఉందనేది ఆ పార్టీ నేతల వాదన. క్యాంటీన్లు పూర్తిగా లేకుండా చేసిన వైసీపీ, ఇప్పుడు వాటి నిర్వహణ సరిగా లేదని ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరని అంటున్నారు టీడీపీ నేతలు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. భోజనం నాణ్యత గురించి కాకుండా, క్యాంటీన్ల రంగు హైలైట్ కావడం, దానిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం ఇక్కడ విశేషం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: ఇంత అన్యాయమా రేవంత్? కోడలు ప్రెగ్నెంట్, ఏడికి పోవాలె - కన్నీళ్లు పెట్టించేలా మహిళ వీడియో
ఇంత అన్యాయమా రేవంత్? కోడలు ప్రెగ్నెంట్, ఏడికి పోవాలె - కన్నీళ్లు పెట్టించేలా మహిళ వీడియో
Tirumala Laddu Sales: తిరుమల లడ్డూకు మరింత డిమాండ్, నెయ్యి వివాదం తర్వాత అమ్మకాలు మరింత పైపైకి
తిరుమల లడ్డూకు మరింత డిమాండ్, నెయ్యి వివాదం తర్వాత అమ్మకాలు మరింత పైపైకి
Hyderabad: కూకట్‌పల్లిలో హైడ్రా కొరడా! ఆ చెరువు చుట్టూ నిర్మాణాల కూల్చివేత
కూకట్‌పల్లిలో హైడ్రా కొరడా! ఆ చెరువు చుట్టూ నిర్మాణాల కూల్చివేత
MG Windsor EV: బ్యాటరీతో ఒక రేటు, లేకుండా మరో రేటు - ఎంజీ విండ్సర్ ఈవీ ధర ఎంతో తెలుసా?
బ్యాటరీతో ఒక రేటు, లేకుండా మరో రేటు - ఎంజీ విండ్సర్ ఈవీ ధర ఎంతో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pant Equals MS Dhoni Test Centuries | ఎంఎస్ ధోని సెంచరీల రికార్డును సమం చేసిన పంత్ | ABP DesamAP Govt Permission Devara Special Shows | ఏపీలో దేవర స్పెషల్ షోలకు స్పెషల్ పర్మిషన్ | ABP Desamఅయోధ్య ఉత్సవంలోనూ అపచారం, రామయ్య వేడుకల్లో తిరుమల లడ్డూలుమైసూరు ప్యాలెస్‌లో ఏనుగుల బీభత్సం, ఉన్నట్టుండి బయటకు పరుగులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: ఇంత అన్యాయమా రేవంత్? కోడలు ప్రెగ్నెంట్, ఏడికి పోవాలె - కన్నీళ్లు పెట్టించేలా మహిళ వీడియో
ఇంత అన్యాయమా రేవంత్? కోడలు ప్రెగ్నెంట్, ఏడికి పోవాలె - కన్నీళ్లు పెట్టించేలా మహిళ వీడియో
Tirumala Laddu Sales: తిరుమల లడ్డూకు మరింత డిమాండ్, నెయ్యి వివాదం తర్వాత అమ్మకాలు మరింత పైపైకి
తిరుమల లడ్డూకు మరింత డిమాండ్, నెయ్యి వివాదం తర్వాత అమ్మకాలు మరింత పైపైకి
Hyderabad: కూకట్‌పల్లిలో హైడ్రా కొరడా! ఆ చెరువు చుట్టూ నిర్మాణాల కూల్చివేత
కూకట్‌పల్లిలో హైడ్రా కొరడా! ఆ చెరువు చుట్టూ నిర్మాణాల కూల్చివేత
MG Windsor EV: బ్యాటరీతో ఒక రేటు, లేకుండా మరో రేటు - ఎంజీ విండ్సర్ ఈవీ ధర ఎంతో తెలుసా?
బ్యాటరీతో ఒక రేటు, లేకుండా మరో రేటు - ఎంజీ విండ్సర్ ఈవీ ధర ఎంతో తెలుసా?
Tirumala Brahmotsavam 2024: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ తేదీలు 2024.. ఏ రోజు ఏ వాహన సేవలు - వాటి విశిష్టతలేంటి!
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ తేదీలు 2024.. ఏ రోజు ఏ వాహన సేవలు - వాటి విశిష్టతలేంటి!
Anna Canteens: ఏపీలో మళ్లీ రంగుల రాజకీయం - అన్న క్యాంటీన్ లపై హైకోర్టులో పిటిషన్
ఏపీలో మళ్లీ రంగుల రాజకీయం - అన్న క్యాంటీన్ లపై హైకోర్టులో పిటిషన్
Flipkart Big Billion Days 2024: బిగ్ బిలియన్ డేస్ ప్రారంభం అయ్యేది ఎప్పుడు? - ఈ స్మార్ట్‌ఫోన్లపై అద్భుత ఆఫర్లు!
బిగ్ బిలియన్ డేస్ ప్రారంభం అయ్యేది ఎప్పుడు? - ఈ స్మార్ట్‌ఫోన్లపై అద్భుత ఆఫర్లు!
Gold-Silver Prices Today 22 Sept: మీ దగ్గర 76k ఉంటేనే 10 గ్రాముల పసిడి వస్తుంది - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
మీ దగ్గర 76k ఉంటేనే 10 గ్రాముల పసిడి వస్తుంది - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Embed widget