అన్వేషించండి

AP New Ministers: కొత్త మంత్రులూ! ఇవేం పనులు, ప్రారంభంలోనే వివాదం - నూతన అమాత్యుల తీరుపై విమర్శలు!

AP New Ministers Rallies: ఏపీలో కొత్త మంత్రి వర్గం ఏర్పాటయ్యాక వాళ్లలో చాలామంది నేతలు సంబరాలతో చేపట్టిన ఊరేగింపులు, ర్యాలీలు ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి.

అలా పదవి వచ్చిందో లేదో మంత్రులు వారి అనుచరులు చేస్తున్న అతికి పగ్గాలు లేకుండా పోతున్నాయనే ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో కొత్త మంత్రి వర్గం ఏర్పాటయ్యాక వాళ్లలో చాలామంది చేపట్టిన ఊరేగింపులు ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. కేవలం మంత్రి పదవి దక్కడంతోనే ఈ మంత్రుల అనుచగరణాలు.. వారి చుట్టూ ఉండే అధికారుల ఓవర్ యాక్షన్ కోటలు దాటుతుంది. ఇంతా చేస్తే ఇప్పటికే ఈ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు దాటిపోయింది. ఇంకా మిగిలింది సరిగ్గా చెప్పాలంటే ఏడాదిన్నరే పదవీకాలం ఉంది. తరువాత అంతా ఎన్నికల హడావుడి మొదలైపోతుంది. ఈ మాత్రం దానికి ఎందుకింత హడావుడి చేస్తున్నారనే విమర్శలు అన్ని వైపుల నుండీ వెల్లువెత్తుతున్నాయి. 

పసిపాప ఉసురు తీసిన మంత్రిగారి ర్యాలీ ఆంక్షలు?
తొలిసారి మంత్రి అయిన ఉషశ్రీ చరణ్ ఊరేగింపు ఓ పసిబిడ్డ ప్రాణాల్ని తీసిందన్న ఆరోపణలు సంచలనం సృష్టించాయి. సత్యసాయి జిల్లాకు చెందిన ఉషశ్రీ చరణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి కళ్యాణదుర్గం వచ్చారు. దీంతో ఆమెకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. నియోజక వర్గంలో మంత్రిగారి విజయోత్సవ ర్యాలీ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అదే సమయంలో శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన గణేష్ - ఈరక్క దంపతులు తమ చిన్న కుమార్తెకు ఆరోగ్యం బాగాలేక 108కు ఫోన్ చేశారు. అది రాకపోవడంతో బైక్ పై ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఆ క్రమంలో తమకు దారి ఇవ్వలేదని అందువల్ల పాప మృతి చెందిందని పసిపాప తల్లిదండ్రులు ఆరోపించారు. 

ఊరేగింపు తరువాత చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయిందని వైద్యులు చెప్పారనీ వారు ఆరోపించారు. మంత్రి ఊరేగింపు కారణంగానే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందంటూ పాప తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పోలీసులు మాత్రం పాప మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం పాప తల్లిదండ్రులు ఊళ్ళో బయలుదేరి బైక్ పై 20 కిమీ దూరాన్ని 38 నిముషాల్లోనే ప్రయాణించి హాస్పిటల్ చేరుకున్నారని.. ఈ సంఘటనకు పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

జోగి రమేష్ ఊరేగింపులో గుండెపోటుతో సర్పంచ్ మృతి 
గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జోగి రమేష్ కృష్ణా జిల్లాలో ఊరేగింపు చేపట్టారు. ఈ ఊరేగింపులో గూడూరు మండలం కోకనారాయణ పేట సర్పంచ్ బండి రమేష్ పాల్గొన్నారు. అంతా సరదాగా ఉన్న టైంలో బండి రమేష్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రి జోగిరమేష్ స్వయంగా ఆయన పాడె మోశారు. అయితే అసలు ఆ ఊరేగింపే లేకుంటే బండి రమేష్ బతికుండేవారు కదా అనే వాదనలు వినబడుతున్నాయి.

నెల్లూరులో మంత్రి కేసు తాలూకూ ఫైల్స్ మాయం
ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అభియోగాలు నమోదైన కేసుకు సంబంధించిన విచారణ జరుగుతున్న కోర్టులో దొంగలు పడడం.. ఆ కేసు తాలూకు ఫైల్స్ మాయం అయ్యాయన్న ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. కీలక కేసులో ఆధారాల చోరీతో జిల్లా ఉన్నతాధికారులే రంగంలోకి దిగి.. ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై హైకోర్టు జోక్యం చేసుకుంది. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏ-1గా ఉన్న ఫోర్జరీ కేసులో ఆధారాలు దొంగిలించడంపై సమగ్ర విచారణ జరపాలంటూ పోలీసుల్ని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కోర్టులో జరిగిన చోరీపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టులు సీఎం జగన్ ను ఆరాధించాలన్న సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన వేణు
జర్నలిస్టులు సీఎం జగన్ ను ఆరాధించాలి తప్ప ఆరాలు తీయకూడదని వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యారు సమాచార శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ. ప్రాస కోసం ప్రయత్నించినా దీనివల్ల జర్నలిస్టు సంఘాలకూ ఇటు ప్రజల్లోనూ ఈ వ్యాఖ్యలతో చులకన అయ్యారు. తాను సీఎంను ఆరాధించడం వల్లనే మంత్రి పదవి వచ్చిందన్న మాటలు కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయ్యాయి.

భక్తులకు ఇబ్బందులు తెచ్చిన దేవాదాయ శాఖ మంత్రి
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్య నారాయణ ఆర్భాటం శ్రీ కాళహస్తిలో భక్తులకు ఇబ్బందులు తెచ్చింది. కొత్తగా మంత్రి అయిన కొట్టు సత్యనారాయణ దేవుడి దర్శనం కోసం శ్రీకాళహస్తికి వచ్చారు. ఆయన దర్శనం కోసం దాదాపు రెండు గంటల సేపు భక్తులను దర్శనం చేసుకోకుండా నిలిపి వేశారు. మండు టెండలో కనీసం మంచి నీళ్లు కూడా లేకుండా భక్తులను నిలిపివేయడంతో వాళ్ళు మంత్రిపై తమ ఆగ్రహాన్ని చూపారు. మంత్రి గో బ్యాక్ అంటూ పెద్దగా నినాదాలు చేశారు. మంత్రి గారి దర్శనం కోసం భక్తులను ఇబ్బంది పెట్టడం సరికాదని ఈ సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు విమర్శలు గుప్పించారు.

మంత్రి పినిపే ఊరేగింపులో నోట్ల కట్టల వెదజల్లిన అనుచరులు
ఇక రవాణాశాఖా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి పినిపే విశ్వరూప్ ఊరేగింపులోనూ ఆయన అనుచరుల ఓవర్ యాక్షన్ హద్దులు దాటింది. ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ ర్యాలీ చేపట్టారు ఆయన అనుచరులు, కార్యకర్తలు. ఈ ర్యాలీలో  మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ కొండలరావు తన ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయారు. ర్యాలీలో నోట్లు వెదచల్లుతూ హడావుడి చేశారు. ఇదంతా మంత్రిగారిపై అభిమానంతోనే చేశానంటూ ఆయన చెప్పుకుంటున్నా.. ఏపీలో కొత్త కల్చర్‌ తెచ్చారంటూ సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pahalgam attack: భారత్ ప్రతీకార చర్యలతో వణికిపోయిన పాకిస్థాన్- ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ మీటింగ్
భారత్ ప్రతీకార చర్యలతో వణికిపోయిన పాకిస్థాన్- ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ మీటింగ్
Pahalgam Terror Attack: బోర్డర్ దాటేందుకు ఉగ్రవాదుల యత్నం- తుపాకీతో సమాధానం చెప్పిన సైన్యం- పాక్ కరెన్సీ, చాక్లెట్లు, సిగరెట్‌ప్యాకెట్స్‌ లభ్యం
బోర్డర్ దాటేందుకు ఉగ్రవాదుల యత్నం- తుపాకీతో సమాధానం చెప్పిన సైన్యం- పాక్ కరెన్సీ, చాక్లెట్లు, సిగరెట్‌ప్యాకెట్స్‌ లభ్యం
Pahalgam Terror Attack : పాకిస్తాన్‌లో దాక్కొని టీఆర్ఎఫ్‌ను నడిపిస్తున్నదెవరు?  పిరికిపందల పన్నాగం ఏంటీ?
పాకిస్తాన్‌లో దాక్కొని టీఆర్ఎఫ్‌ను నడిపిస్తున్నదెవరు? పిరికిపందల పన్నాగం ఏంటీ?
Pahalgam Terror Attack: పాకిస్థాన్ దాహంతో అల్లాడిపోవాల్సిందే - దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం -1948 నాటి సీన్ రిపీట్
పాకిస్థాన్ దాహంతో అల్లాడిపోవాల్సిందే - దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం -1948 నాటి సీన్ రిపీట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Navy Officer Vinay Narwal Pahalgam Terror Attack | హిమాన్షీ కన్నీటికి సమాధానం చెప్పేది ఎవరు.? | ABP DesamSRH vs MI Match Preview IPL 2025 | సన్ రైజర్స్  హైదరాబాద్ కోమాలో నుంచి మేల్కొంటుందా.?Axar Patel Batting IPL 2025 | కీలక సమయాల్లో ఆదుకుంటున్న కెప్టెన్ ఆల్ రౌండర్KL Rahul vs Rishabh Pant | సంజీవ్ Goenka అనుకున్నది ఒకటి..అయినది ఒకటి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pahalgam attack: భారత్ ప్రతీకార చర్యలతో వణికిపోయిన పాకిస్థాన్- ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ మీటింగ్
భారత్ ప్రతీకార చర్యలతో వణికిపోయిన పాకిస్థాన్- ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎమర్జెన్సీ మీటింగ్
Pahalgam Terror Attack: బోర్డర్ దాటేందుకు ఉగ్రవాదుల యత్నం- తుపాకీతో సమాధానం చెప్పిన సైన్యం- పాక్ కరెన్సీ, చాక్లెట్లు, సిగరెట్‌ప్యాకెట్స్‌ లభ్యం
బోర్డర్ దాటేందుకు ఉగ్రవాదుల యత్నం- తుపాకీతో సమాధానం చెప్పిన సైన్యం- పాక్ కరెన్సీ, చాక్లెట్లు, సిగరెట్‌ప్యాకెట్స్‌ లభ్యం
Pahalgam Terror Attack : పాకిస్తాన్‌లో దాక్కొని టీఆర్ఎఫ్‌ను నడిపిస్తున్నదెవరు?  పిరికిపందల పన్నాగం ఏంటీ?
పాకిస్తాన్‌లో దాక్కొని టీఆర్ఎఫ్‌ను నడిపిస్తున్నదెవరు? పిరికిపందల పన్నాగం ఏంటీ?
Pahalgam Terror Attack: పాకిస్థాన్ దాహంతో అల్లాడిపోవాల్సిందే - దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం -1948 నాటి సీన్ రిపీట్
పాకిస్థాన్ దాహంతో అల్లాడిపోవాల్సిందే - దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం -1948 నాటి సీన్ రిపీట్
నీ పేరు నిలబెడతా..గర్వపడేలా చేస్తా..నేవీ అధికారి భార్య ఎమోషనల్
నీ పేరు నిలబెడతా..గర్వపడేలా చేస్తా..నేవీ అధికారి భార్య ఎమోషనల్
Pahalgam Terror Attack : ఉగ్రదాడిపై ప్రతీకారంగా భారత్ తీసుకున్న 5 నిర్ణయాలతో పాకిస్థాన్‌కు కలిగే నష్టమేంటీ?
ఉగ్రదాడిపై ప్రతీకారంగా భారత్ తీసుకున్న 5 నిర్ణయాలతో పాకిస్థాన్‌కు కలిగే నష్టమేంటీ?
Pahalgam Attack: వీళ్ల ఆచూకీ చెబితే 20 లక్షలు - జమ్ముకశ్మీర్ పోలీసుల కీలక ప్రకటన
వీళ్ల ఆచూకీ చెబితే 20 లక్షలు - జమ్ముకశ్మీర్ పోలీసుల కీలక ప్రకటన
Aghori : ఆడో, మగో తేల్చుకోలేక జైల్లోకి రానివ్వలేదు -అఘోరికి వైద్య పరీక్షలు- జైల్లో హల్ చల్
ఆడో, మగో తేల్చుకోలేక జైల్లోకి రానివ్వలేదు -అఘోరికి వైద్య పరీక్షలు- జైల్లో హల్ చల్
Embed widget