అన్వేషించండి

Nara Lokesh Meets PM Modi: ప్రధాని మోదీతో ఏపీ మంత్రి లోకేష్ భేటీ, జీఎస్టీ తగ్గింపుపై ధన్యవాదాలు.. చర్చించిన అంశాలివే

Andhra Pradesh News | ప్రధాని మోదీతో ఏపీ మంత్రి లోకేష్ భేటీ, జీఎస్టీ తగ్గింపుపై ధన్యవాదాలు.. చర్చించిన అంశాలివే

Nara Lokesh Delhi Tour | న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ విద్య, పరిశ్రమలశాఖల మంత్రి నారా లోకేష్‌ శుక్రవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో భేటీ అయ్యారు. ఈ కీలక భేటీలో ఏపీకి కేంద్ర సాయం, పెండింగ్‌ ప్రాజెక్టుల అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధాని మోదీ, నారా లోకేష్ చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రంలో సెమీ కండక్టర్‌ యూనిట్‌ ఏర్పాటు నిర్ణయంపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి లోకేష్‌. ఈ యూనిట్‌ ఏర్పాటు కోసం కేంద్రం ఇచ్చిన అనుమతి రాష్ట్రానికి కలిసొస్తుందన్నారు. ఈ భేటీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ప్రధాని మోదీ నుంచి కీలక మద్దతు, సహకారం లభించినట్లు తెలుస్తోంది. తద్వారా రాష్ట్రంలో ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది.

మంత్రి లోకేష్‌ ఈ భేటీ సమయంలో ప్రధాని మోదీకి యోగాంధ్రపై రూపొందించిన పుస్తకాన్ని అందించారు. పుస్తకం యోగాంధ్ర ప్రాంతం, అక్కడి సంస్కృతి, చరిత్ర, ప్రత్యేకతలను ప్రస్తావిస్తూ రూపొందించారు. అలాగే, విద్యారంగంలో వస్తువులపై జీఎస్టీ తగ్గించడంపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి లోకేష్‌. ఈ నిర్ణయం ద్వారా విద్యార్థులు, విద్యావేత్తలు లాభపడతారని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతేకాక, మంత్రి లోకేష్‌ తన భేటీలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు సంబంధించిన ప్రగతి గురించి ప్రధానికి వివరించారు. ఇటీవల జరిగిన సింగపూర్‌ బృందం పర్యటన వివరాలను కూడా ప్రధాని మోదీతో పంచుకున్నారు. ఈ పర్యటన ద్వారా ఏపీకి మరిన్ని ఆర్థిక అవకాశాలు, పరిశ్రమల స్థాపన అవకాశాలు మరియు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం చేపట్టిన చర్యలు ప్రత్యేకంగా చర్చకు వచ్చాయి.

నాలుగు నెలల్లోనే రెండోసారి మోదీతో భేటీ

దాదాపు 45 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. ప్రధాని మోదీ పిలుపు మేరకు మే 17న తన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్ లతో కలిసి నారా లోకేష్ మోదీని కలిశారు. అనంతరం 4 నెలల వ్యవధిలోనే నారా లోకేష్ వ్యక్తిగతంగా ప్రధాని మోదీని కలిశారు. పలువురు కేంద్ర మంత్రులతో మంత్రి లోకేష్ వరుస భేటీలు కానున్నాయి.

నారా లోకేష్‌కు ఢిల్లీలో ఘన స్వాగతం..

గత నెలలో పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ

గత నెలలో ఢిల్లీలో పర్యటించిన నారా లోకేష్ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో యూరియా కొరతతో పాటు ప్లాస్టిక్ పార్క్, నిపర్ క్యాంపస్, పోలవరం, అమరావతి అభివృద్ధి వంటి అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించారు. ఈ సమావేశాల్లో రామయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, కుప్పం- బెంగళూరు- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వంటి ప్రాజెక్టులకు కేంద్ర సాయం కోరారు. ఇప్పుడు ప్రధాని మోదీతో జరిగే భేటీలో ఈ అంశాలపై చర్చించి మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఏపీలో ఐటీ, విద్యా రంగాల అభివృద్ధికి కేంద్ర సహకారం, గ్రీన్ ఎనర్జీ వంటి అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం.  

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Embed widget