అన్వేషించండి

Jogi Ramesh: పవన్ వి పిచ్చి మాటలు- ఓరోజు ఎమ్మెల్యే అంటారు, ఇంకోరోజు సీఎం చేయమంటాడు: జోగి రమేష్

పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి జోగి రమేష్ మరో సారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ పూటకో మాట మాట్లాడుతూ పిచ్చోడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి జోగి రమేష్ మరో సారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ పూటకో మాట మాట్లాడుతూ పిచ్చోడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

పవన్ పై జోగి కామెంట్స్...
ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్ర ఇక అయిపోయిందని మంత్రి జోగి రమేష్ అన్నారు. మరోవైపు ఆయన తనయుడు నారా లోకేశ్‌ పాకులాడినా, ఇటు జనసేనాని పవన్‌ వారాహి ఎక్కి తిరిగినా వీరిలో ఏ ఒక్కరూ ఎన్నికల్లో గెలిచేది లేదని మంత్రి జోగి రమేష్ జోస్యం చెప్పారు.  పవన్‌ కళ్యాణ్‌ పూటకో మాట చెబుతూ తానేదో పెద్ద వ్యూహకర్తననే భ్రమల్లో బతుకుతున్నారని సెటైర్లు వేశారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ,  ఇంకో రోజు నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండని ప్రజల్ని అడుక్కుంటున్నాడని వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడే మాటలను విన్న ప్రజానీకం ఈ పిచ్చి వ్యాఖ్యలకు అర్థం ఏంటని మాట్లాడుకుంటున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు.

పవన్ వైఖరి వలన అభిమానులు, అనుచరులు తలలుపట్టుకుని కూర్చున్నారని చెప్పారు.  2019లో పోటీ చేసిన రెండు చోట్ల ఓటర్లు, పవన్ ను  చాచి చెంప పగులకొట్టినట్టు ఓడించారని,  ఎమ్మెల్యేగా గెలవలేని పవన్  సీఎంగా గెలుస్తాడా అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఇదే రీతిలో వారాహి ఎక్కి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే  వచ్చే 2024 ఎన్నికల్లో కూడా తీవ్రమైన, ఘోరమైన అవమానంతో ఆంధ్ర రాష్ట్రం ముఖం కూడా చూడకుండానే పవన్ పారిపోవటం ఖాయమని జోగి రమేష్ అన్నారు.

రేపల్లె ఘటనపై రాజకీయమా...
పరామర్శ పేరుతో మాజీ సీఎం చంద్రబాబు  ఓట్లు అడుక్కుంటున్నారని మంత్రి జోగి రమేష్ విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు  మతిభ్రమించింది కాబట్టే, రేపల్లె నియోజకవర్గం ఉప్పాలవారిపాలెంలో మృతి చెందిన అమర్నాథ్‌ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి అక్కడ కూడా శవ రాజకీయం చేశాడని అన్నారు.  డర్టీ పాలిటిక్స్‌కు కేరాఫ్‌గా  చంద్రబాబు పేరు చెప్పుకోవాల్సిందేనన్నారు.  ఎవరైనా ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు బాధితుల్ని కలిసి వారితో మాట్లాడి వీలైతే సాయం చేసి ధైర్యం చెబుతారని, అయితే  దిక్కుమాలిన చంద్రబాబు మాత్రం అమర్నాథ్‌ సోదరి, తల్లిని కలిసి బయటకొచ్చి సభపెట్టి శవాలపై పేలాలేరుకున్నట్లు ఓట్లు అడుక్కున్నారని విమర్శించారు. కులాల్ని రెచ్చగొడుతున్న  తెలుగు దేశం పార్టి త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోవటం ఖాయమని అంటున్నారు.  స్థానిక టీడీపీ ప్రబుద్ధులు శవరాజకీ యం చేసి కులాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, రేపల్లె నియోజకవర్గం చుట్టుప్రక్కల గ్రామాల వారు ఉప్పాలవారిపాలెంకు రావాలంటూ టీడీపీ వాట్సప్‌ గ్రూపుల్లో పోస్టులు పెట్టారని అన్నారు. ఇది శవ రాజకీయం కాదా అని మంత్రి జోగి ప్రశ్నించారు. శవాల దగ్గర ఓట్లు అడుక్కునే నీచమైన బుద్ధి  టీడీపీకే ఉంటుందన్నారు. 

అమర్నాథ్ కుటుంబానికి అండగా ఉంటాం...
హత్యకు గురైన బాలుడు అమర్నాథ్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉన్నామని మంత్రి జోగి రమేష్ తెలిపారు. విద్యార్థి అమర్నాథ్‌ హత్య జరగడం చాలా బాధాకరం, దురదృష్టకరం అన్నారు. సోదరిని కీచకుల వేధింపుల నుంచి కాపాడాలని ప్రయత్నించిన క్రమంలో అమర్నాథ్‌ హత్యకు గురవడం అందరిని బాధిస్తోందని మంత్రి జోగి రమేష్ ఆవేదన వెలిబుచ్చారు.  జరిగిన ఘోరంపై ప్రభుత్వ పరంగా హుటాహుటిన స్పందించటంతో పాటుగా,  కిరాతకానికి పాల్పడిన నలుగురు నిందితుల్ని కేవలం 24 గంటల్లోనే పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.  బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించడం జరిగిందని చెప్పారు. దీంతోపాటు  భాదిత కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఘటన జరిగిన రోజునే స్థానిక ఎంపీ మోపిదేవి వెంకట రమణ బాధితుల ఇంటి కి వెళ్లి అండగా నిలిచారని చెప్పారు. 
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Free Bus: దివ్యాంగులకు APSRTC గుడ్‌న్యూస్.. ఏ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు
దివ్యాంగులకు APSRTC గుడ్‌న్యూస్.. ఏ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు
Nara Lokesh: నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP వ్యూహం
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP మాస్టర్ ప్లాన్
Ambati Rambabu farmhouse controversy: మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పే వచ్చా - అంబటి రాంబాబు ప్రకటన దేని కోసమంటే ?
మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పే వచ్చా - అంబటి రాంబాబు ప్రకటన దేని కోసమంటే ?
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
Nara Lokesh: నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP వ్యూహం
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP మాస్టర్ ప్లాన్
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Embed widget