అన్వేషించండి

నేను చూడలా- నేను వినలా..! హాట్ టాపిక్ గా మంత్రి జోగి రమేష్ కామెంట్స్

తెలుగు దేశం పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, వైసీపీ నేతలను పొడుగుతున్న విషయంపై నేను చూడలా.. నేను వినలా... అంటూ మంత్రి జోగి రమేష్ ఈ కామెంట్స్ చేశారు.

నేను చూడలా.. నేను వినలా... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి చెందిన మంత్రి జోగి రమేష్ చేసిన కామెంట్స్ ఇవి. తెలుగు దేశం పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, వైసీపీ నేతలను పొడుగుతున్న విషయంపై జోగి ఈ తరహా కామెంట్స్ చేశారు.

జోగి కామెంట్స్ వెనుక పెద్ద కథే ఉంది...
ప్రస్తుత రాజకీయాల్లో తెలుగు దేశం పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులను పొగడ్తలతో మాట్లాడటం చర్చనీయాశంగా మారింది. అయితే ఈ వ్యవహరంపై మంత్రి జోగి రమేష్ స్పందిస్తూ నేను చూడలా... నేను వినలా అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహరం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో చర్చకు దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా కేశినేని నాని చేసిన కామెంట్స్ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి చెందిన శాసన సభ్యులు సైతం కేశినేని నానిని అభినందించటం అందరికి తెలిసిందే. అయితే ఈ విషయాలేవి తనకు తనకు తెలియదన్నట్లుగా మంత్రి జోగి రమేష్ మాట్లాడారు.
 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వసంత, మొండితోక తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తున్నారన్న కేశినేని కామెంట్లపై జోగి రమేష్ ఆసక్తికర కామెంట్లు చేశారు. కేశినేని కామెంట్లు నేను చూడలా.. నేను వినలా అంటూ స్పందించారు. వసంత కృష్ణప్రసాద్ కు మంత్రి జోగి రమేష్ కు మధ్య గ్యాప్ ఉండటంతోనే ఈ విధంగా జోగి రమేష్ మాట్లాడారని అంటున్నారు.

గతంలో ఇద్దరి నేతల మధ్య సీఎం పంచాయితీ..
తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ జోక్యం చేసుకోవటం, ఇసుక ర్యాంపుల విషయంలో జోగి ఇష్టాను సారంగా వ్యవహరిచటం, స్దానికంగా ఉన్న ఎమ్మెల్యే వసంతను కనీసం పట్టించుకోకుండా వ్యవహరించటంపై పెద్ద దుమారమే చెలరేగింది. దీనిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో కూడా పంచాయితీ జరిగింది. అక్కడ కూడ జోగి రమేష్ కే జగన్ సర్దిచెప్పినట్లుగా చెబుతున్నారు. అయినా ఇప్పటికీ ఇద్దరు నేతల మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికి జోగి రమేష్ మైలవరం నియోజకవర్గంలో తనదే పైచేయి కావాలని ప్రయత్నాలు చేయటంపై శాసన సభ్యుడు వసంత గుర్రుగా ఉన్నారు. మంత్రి జోగి తన పెడన నియోజకవర్గంను పట్టించుకోకుండా, మైలవరం నియోజకవర్గంలో వేలు పెట్టటంపై ఇప్పటికి వసంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వారసుడి కోసం జోగి ప్రయత్నాలు...
మంత్రి జోగి రమేష్ తన రాజకీయ వారసుడి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే జోగి రమేష్ మైలవరంపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారని అంటున్నారు. 2019ఎన్నికల ముందు వరకు జోగి రమేష్ మైలవరం నియోజకవర్గం కేంద్రంగానే పని చేశారు. అయితే ఆఖరి నిమిషంలో జోగి రమేష్ ను పార్టి అధినేత జగన్ పెడన నియోజకవర్గానికి పంపారు. మైలవరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కీలక నేత, అప్పటి మంత్రి దేవినేని ఉమాను ఓడించాలంటే అక్కడ అదే సామాజిక వర్గానికి చెందిన కీలక నేత అవసరం ఏర్పడింది. దీంతో సర్వే రిపోర్ట్ ల ఆధారంగా సీఎం జగన్ మైలవరం నియోజకవర్గం నుండి పని చేస్తున్న జోగి రమేష్ ను పెడనకు పంపి, అక్కడ వసంత ను రంగంలోకి దింపారు. వ్యూహం ప్రకారం దేవినేని ఉమాపై వసంత విజయం సాధించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి జెండా ఎగిరింది. ఇక్కడ వరకు సీన్ బాగానే నడిచింది.ఆ తరువాత నుండి అసలు సమస్య మెదలైంది. రెండో విడత మంత్రి వర్గ విస్తరణలో జోగి రమేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత నుండి ఆయన మైలవరం పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. తన రాజకీయ వారసుడిని మైలవరం నుండి గెలిపించాలనే ప్రయత్నాలు చేసుకుంటున్నారని, అందుకే జోగి రమేష్ ఎక్కువగా మైలవరం పైనే ఫోకస్ పెడుతున్నారని అంటున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: మీడియాపై జగన్ వ్యాఖ్యలు 'గురివింద గింజ' సామెతను గుర్తుచేస్తున్నాయి: ఐజేయూ
మీడియాపై జగన్ వ్యాఖ్యలు 'గురివింద గింజ' సామెతను గుర్తుచేస్తున్నాయి: ఐజేయూ
Akividu issue: చలో ఆకివీడు అంటూ భారీ ప్రచారం - పోలీసుల వార్నింగ్ - ఆదివారం ఏం జరగబోతోంది?
చలో ఆకివీడు అంటూ భారీ ప్రచారం - పోలీసుల వార్నింగ్ - ఆదివారం ఏం జరగబోతోంది?
Tiger In Polavaram: వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
Sajjala Ramakrishna Reddy: మావిగన్ ఆలోచన జగన్‌దే - మూడు రాజధానుల్ని అవహేళన చేస్తారా - సజ్జల ఆగ్రహం
మావిగన్ ఆలోచన జగన్‌దే - మూడు రాజధానుల్ని అవహేళన చేస్తారా - సజ్జల ఆగ్రహం

వీడియోలు

TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RR Vs GT Result Updates: రాజ‌స్థాన్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. టోర్నీలో వ‌రుసగా రెండో గెలుపు.. సత్తా చాటిన బిష్ణోయ‌, సుద‌ర్శ‌న్, టైటాన్స్ కు రెండో ఓట‌మి
రాజ‌స్థాన్ థ్రిల్లింగ్ విక్ట‌రీ.. టోర్నీలో వ‌రుసగా రెండో గెలుపు.. సత్తా చాటిన బిష్ణోయ‌, సుద‌ర్శ‌న్, టైటాన్స్ కు రెండో ఓట‌మి
Khanapur Municipal Chairman: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
Basra Development: బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
Tiger In Polavaram: వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
Tyson Naidu OTT : టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
Telugu Desam Party:'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
Gajwel Attack: రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం
రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం
IPL 2026 DC Vs MI Result Update: ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం.. ముంబైని చిత్తు చేసిన క్యాపిట‌ల్స్, రాణించిన రిజ్వి, నిస్సాంక‌, MI కి నిరాశ‌
ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం.. ముంబైని చిత్తు చేసిన క్యాపిట‌ల్స్, రాణించిన రిజ్వి, నిస్సాంక‌, MI కి నిరాశ‌
Embed widget