అన్వేషించండి

నేను చూడలా- నేను వినలా..! హాట్ టాపిక్ గా మంత్రి జోగి రమేష్ కామెంట్స్

తెలుగు దేశం పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, వైసీపీ నేతలను పొడుగుతున్న విషయంపై నేను చూడలా.. నేను వినలా... అంటూ మంత్రి జోగి రమేష్ ఈ కామెంట్స్ చేశారు.

నేను చూడలా.. నేను వినలా... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి చెందిన మంత్రి జోగి రమేష్ చేసిన కామెంట్స్ ఇవి. తెలుగు దేశం పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, వైసీపీ నేతలను పొడుగుతున్న విషయంపై జోగి ఈ తరహా కామెంట్స్ చేశారు.

జోగి కామెంట్స్ వెనుక పెద్ద కథే ఉంది...
ప్రస్తుత రాజకీయాల్లో తెలుగు దేశం పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులను పొగడ్తలతో మాట్లాడటం చర్చనీయాశంగా మారింది. అయితే ఈ వ్యవహరంపై మంత్రి జోగి రమేష్ స్పందిస్తూ నేను చూడలా... నేను వినలా అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహరం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో చర్చకు దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా కేశినేని నాని చేసిన కామెంట్స్ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి చెందిన శాసన సభ్యులు సైతం కేశినేని నానిని అభినందించటం అందరికి తెలిసిందే. అయితే ఈ విషయాలేవి తనకు తనకు తెలియదన్నట్లుగా మంత్రి జోగి రమేష్ మాట్లాడారు.
 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వసంత, మొండితోక తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తున్నారన్న కేశినేని కామెంట్లపై జోగి రమేష్ ఆసక్తికర కామెంట్లు చేశారు. కేశినేని కామెంట్లు నేను చూడలా.. నేను వినలా అంటూ స్పందించారు. వసంత కృష్ణప్రసాద్ కు మంత్రి జోగి రమేష్ కు మధ్య గ్యాప్ ఉండటంతోనే ఈ విధంగా జోగి రమేష్ మాట్లాడారని అంటున్నారు.

గతంలో ఇద్దరి నేతల మధ్య సీఎం పంచాయితీ..
తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ జోక్యం చేసుకోవటం, ఇసుక ర్యాంపుల విషయంలో జోగి ఇష్టాను సారంగా వ్యవహరిచటం, స్దానికంగా ఉన్న ఎమ్మెల్యే వసంతను కనీసం పట్టించుకోకుండా వ్యవహరించటంపై పెద్ద దుమారమే చెలరేగింది. దీనిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో కూడా పంచాయితీ జరిగింది. అక్కడ కూడ జోగి రమేష్ కే జగన్ సర్దిచెప్పినట్లుగా చెబుతున్నారు. అయినా ఇప్పటికీ ఇద్దరు నేతల మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికి జోగి రమేష్ మైలవరం నియోజకవర్గంలో తనదే పైచేయి కావాలని ప్రయత్నాలు చేయటంపై శాసన సభ్యుడు వసంత గుర్రుగా ఉన్నారు. మంత్రి జోగి తన పెడన నియోజకవర్గంను పట్టించుకోకుండా, మైలవరం నియోజకవర్గంలో వేలు పెట్టటంపై ఇప్పటికి వసంత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వారసుడి కోసం జోగి ప్రయత్నాలు...
మంత్రి జోగి రమేష్ తన రాజకీయ వారసుడి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే జోగి రమేష్ మైలవరంపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారని అంటున్నారు. 2019ఎన్నికల ముందు వరకు జోగి రమేష్ మైలవరం నియోజకవర్గం కేంద్రంగానే పని చేశారు. అయితే ఆఖరి నిమిషంలో జోగి రమేష్ ను పార్టి అధినేత జగన్ పెడన నియోజకవర్గానికి పంపారు. మైలవరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కీలక నేత, అప్పటి మంత్రి దేవినేని ఉమాను ఓడించాలంటే అక్కడ అదే సామాజిక వర్గానికి చెందిన కీలక నేత అవసరం ఏర్పడింది. దీంతో సర్వే రిపోర్ట్ ల ఆధారంగా సీఎం జగన్ మైలవరం నియోజకవర్గం నుండి పని చేస్తున్న జోగి రమేష్ ను పెడనకు పంపి, అక్కడ వసంత ను రంగంలోకి దింపారు. వ్యూహం ప్రకారం దేవినేని ఉమాపై వసంత విజయం సాధించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి జెండా ఎగిరింది. ఇక్కడ వరకు సీన్ బాగానే నడిచింది.ఆ తరువాత నుండి అసలు సమస్య మెదలైంది. రెండో విడత మంత్రి వర్గ విస్తరణలో జోగి రమేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత నుండి ఆయన మైలవరం పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. తన రాజకీయ వారసుడిని మైలవరం నుండి గెలిపించాలనే ప్రయత్నాలు చేసుకుంటున్నారని, అందుకే జోగి రమేష్ ఎక్కువగా మైలవరం పైనే ఫోకస్ పెడుతున్నారని అంటున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Vijaya ghee issue: విజయా నెయ్యిపై ఆగని దుమారం - లోకేష్‌కు గుత్తా అమిత్ మరో ఘాటు ట్వీట్
విజయా నెయ్యిపై ఆగని దుమారం - లోకేష్‌కు గుత్తా అమిత్ మరో ఘాటు ట్వీట్
Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Iran War Updates: దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
Embed widget