By: ABP Desam | Updated at : 14 Dec 2021 06:00 PM (IST)
కర్నూలులో వక్ఫ్ బోర్డు ట్రిబ్యూనల్ ఏర్పాటుపై జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరణ
కర్నూలులో వక్ఫ్ బోర్డు ట్రిబ్యూనల్ ఏర్పాటు చేయకూడదని ఏ చట్టంలో ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిటిషనర్ను ప్రశ్నించింది. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత నెల 25న జీవో జారీ చేసింది. దీన్ని నిలిపివేయాలని కోరుతూ విజయవాడకు చెందిన మహ్మద్ ఫరూక్ షుబ్లీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ట్రిబ్యూనల్ను విజయవాడలో ఏర్పాటు చేస్తూ 2016లోనే జీవో జారీ అయిందని..ఇప్పుడు కర్నూలుకు తరలించడం మైనార్టీల హక్కులను హరించడమేనని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం సృష్టికి తీసుకెళ్లారు.
అయితే ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకునే పరిధి తమకెక్కడిదని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. కర్నూలులో ట్రిబ్యునల్ ఏర్పాటు వల్ల పిటిషనర్కొచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించింది. కర్నూలులో ట్రిబ్యూనల్ ఏర్పాటు చేయకూడదని ఏ చట్టంలో ఉందని ప్రశ్నించింది. కర్నూలులో ట్రిబ్యునల్ ఏర్పాటుకు స్పష్టమైన కారణాలున్నాయని ప్రభుత్వం తరపున వాదించిన ఏజీ శ్రీరామ్ తెలిపారు. అత్యధిక ముస్లిం జనాభా కర్నూలులో ఉందన్నారు. ఈ వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది. జీవో 16 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకూడదని ఏ చట్టంలో ఎలాంటి నిషేధం లేదని తేల్చిచెప్పింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఏ ఒక్కరి ప్రాథమిక హక్కులకు భంగం కలగడం లేదంది. విశాఖపట్నం, అనంతపురం నుంచి హైకోర్టుకు వస్తున్నారని, అలాంటప్పుడు కర్నూలుకు వెళ్లడానికి ఇబ్బంది ఏమిటని పిటిషనర్ను ప్రశ్నించింది. గతంలో వక్ఫ్బోర్డు ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి మూడో తేదీకి వాయిదా వేసింది.
Also Read: పీఆర్సీ పెంపుపై ఉద్యోగ సంఘాలతో సజ్జల భేటీ... సీఎం జగన్ న్యాయం చేస్తారని హామీ
Also Read: పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్... వ్యద్ధాప్య పింఛన్లు పెంచుతూ కీలక నిర్ణయం
Also Read: 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం... తిరుమలలో మూడో ఘాట్ రోడ్డు... టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు
Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు
YS Jagan: వ్యవసాయ శాఖపై జగన్ సమీక్ష - రబీ సీజన్ ధాన్యం సేకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
Lovers Suicide: ప్రేమ పెళ్లికి పెద్దలు నో, రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య కలకలం!
Balakrishna About NTR: నా తండ్రి ఎన్టీఆర్ కు మరణం లేదు, రాజకీయాల్లో విప్లవం తెచ్చారు: బాలకృష్ణ
Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్కు సుప్రీంకోర్టు నోటీసులు !
PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!
Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి