అన్వేషించండి

CM Chandrababu: 'సీఎం చంద్రబాబును కలిసి వినతులు ఇవ్వొచ్చు' - టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!

AP News: ప్రజల నుంచి వినతులు భారీగా వస్తోన్న క్రమంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రాధాన్యతను బట్టి సీఎంను కలిసే అవకాశం కల్పిస్తామన్నారు.

Toll Free Number For Public Requests: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యల పరిష్కారంపై ఎక్కువ దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబుకు వినతులు ఇచ్చేందుకు ఉండవల్లిలోని నివాసానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మంత్రి నారా లోకేశ్ సైతం ప్రజా దర్బార్‌లా నిర్వహిస్తూ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఇటీవల తనకు వినతులు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలను చూసిన పవన్ కల్యాణ్.. కాన్వాయ్ ఆపి చెట్టు కిందే కుర్చీలో కూర్చుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు వాటిని చెప్పి పరిష్కారమయ్యేలా చేశారు. అటు, మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ సైతం ప్రజాదర్భార్ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ వందల సంఖ్యలో ప్రజలు ప్రజాదర్బార్‌కు తమ సమస్యలను లోకేశ్ దృష్టికి తీసుకువస్తున్నారు. వీటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా లోకేశ్ చర్యలు చేపడుతున్నారు. 

టోల్ ఫ్రీ నెంబర్

అయితే, సీఎం చంద్రబాబుకు ప్రజల నుంచి భారీగా వినతులు వస్తున్న క్రమంలో ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎంకు వినతులు ఇచ్చేందుకు జనం పోటెత్తుతున్నారని.. వినతుల స్వీకరణ సులభతరం చేసేలా.. ఫిర్యాదుదారులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఈ నెంబర్ అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ప్రజలు వారి సమస్యలను 7306299999 కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. ప్రాధాన్యతను బట్టి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పెంచిన పింఛన్ల పంపిణీ

ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే పెంచిన పింఛన్లు సోమవారం నుంచి పంపిణీ చేస్తామని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేస్తారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ పింఛన్ దారుల్ని మభ్యపెట్టారని విమర్శించారు. గత ఐదేళ్లలో రూ.వెయ్యి పెంచి హడావుడి చేశారని.. చంద్రబాబు ఒకేసారి రూ.వెయ్యి పెంచి.. వాటిని ఏప్రిల్ నెలతో పాటు కలిపి ఇస్తున్నారని అన్నారు. సోమవారం పెనుమాక గ్రామంలో ఉదయం 6 గంటలకు సీఎం చంద్రబాబు స్వయంగా పెన్షన్లు అందిస్తారని వివరించారు. రాజధాని అమరావతిని త్వరితగతిన పూర్తి చేస్తామని.. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

Also Read: AP Pensions: ఏపీలో పింఛన్‌దారులకు గుడ్ న్యూస్, కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
TGRTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
PM Modi: 'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
TGRTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
PM Modi: 'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Embed widget