By: ABP Desam | Updated at : 05 Apr 2022 12:35 PM (IST)
ఏబీవీ కి మరోసారి ఏపీ సర్కార్ షోకాజ్ నోటీస్
సస్పెన్షన్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం మరో షోకాజ్ నోటీస్ జారీ చేసింది. పెగాసస్ అంశంతో పాటు తన సస్పెన్షన్ గురించి ఆయన మార్చి 21వ తేదీన ప్రెస్మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం సివిల్ సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని .. షోకాజ్ నోటీసు అందిన వారంలోపు వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఈ షోకాజ్ నోటీసు జారీ చేశారు. వారంలో సమాధానం ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ షోకాజ్ నోటీసు గత నెల 22వ తేదీనే అంటే ఏబీ వెంకటేశ్వరరావు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతి రోజునే జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ షోకాజ్ నోటీసులో ఇచ్చిన గడువు కూడా ముగిసిపోయింది. దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి వివరణ ఇచ్చారో లేదో స్పష్టత లేదు.
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ లేదు. గత రెండేళ్ల నుంచి ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. ఆయనపై ప్రభుత్వం నమోదు చేసిన కేసులపై విచారణ ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. ఆయన సర్వీసులో తప్పిదాలకు పాల్పడ్డారని ఆయనను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే కేంద్రం ఇంత వరకూ ఆ సిఫార్సుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇటీవల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చంద్రబాబు సీఎంగా ఉండగా పెగాసస్ను వాడారని బెంగాల్ అసెంబ్లీలో పేర్కొన్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలు, మంత్రులు చంద్రబాబు హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావుపై పలు రకాల ఆరోపణలు చేశారు. దీంతో ఆయన ప్రెస్మీట్ పెట్టి తనపై చేస్తున్న ఆరోపణలను ఖండించారు. వారిపై పరువు నష్టం దావా వేయడానికి చీఫ్ సెక్రటరీ అనుమతి కోసం లేఖ రాశానని తెలిపారు. అయితే సస్పెన్షన్లో ఉన్నప్పటికీ ఆయన ఐపీఎస్ అధికారి కాబట్టి సీఎస్ అనుమతి లేకుండా ప్రెస్ మీట్ నిర్వహించకూడదన్న నిబంధన ఉందని దీన్ని అధిగమించినందున ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇటీవల రెండేళ్ల సస్పెన్షన్ ముగిసింది. ఇక తన సస్పెన్షన్ పొడిగింపు కోసం కేంద్ర హోంశాఖ అనుమతి ఇవ్వలేదని తన పూర్తి జీతం ఇవ్వాలని ఆయన సీఎస్కు లేఖ రాశారు. అలాగే తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారిపై పరువు నష్టం దాఖలు చేసేందుకు అనుమతి కావాలని సీఎస్కు లేఖ రాశారు. వాటిపై సీఎస్ ఇంకా స్పందించలేదు.
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
TDP Mahanadu 2022 : టీడీపీ మహానాడుకు భారీ స్పందన, అటు చంద్రబాబు ఇటు బాలయ్య ప్రసంగాలతో దద్దరిల్లిన స్టేజ్
Mahanadu 2022 : జిల్లా విభజనను పునః సమీక్షిస్తా, బుల్లెట్లా దూసుకెళ్తా- మహానాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!
3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !
TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి