అన్వేషించండి

Low Rains: ముఖం చాటేసిన వరుణుడు, సాగు నీటికి కటకట - ఏపీలో అన్నదాతల ఆందోళన

Low Rains: ఏపీలో వర్షాభావ పరిస్థితులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పల్నాడులోని మిర్చి రైతులు పంట చేతికొస్తుందో లేదో తెలియక సతమతమవుతున్నారు.

ఆరుగాలం శ్రమించే అన్నదాతకు సాగు మధ్యలోనే కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది వానాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు నిల్వ లేక, కాలువల ద్వారా సాగు నీరందక ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ పరిస్థితి తీవ్రమవుతోంది. 

ఈ ప్రాంతాల్లో

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడు, డెల్టా ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. డెల్టాలో 4 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. అలాగే జిల్లా వ్యాప్తంగా 2.5 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. అయితే, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అటు డెల్టాలో టెయిల్ భూములకు, అప్ ల్యాండ్స్ కు నీరందడం లేదు. ఈ క్రమంలో కర్షకుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం ఓ పంటకు నీరందించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పులిచింతల, పట్టిసీమ ప్రాజెక్టుల నుంచి నీటిని డెల్టా ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో డెల్టాలో మొదటి పంటైనా చేతికొస్తుందన్న ఆశ రైతుల్లో నెలకొంది.

పల్నాడులోనూ

అటు పల్నాడులోనూ సాగు నీటి కొరత అధికంగా ఉంది. సాగర్ లో నీరు కనీస మట్టానికి తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వం కూడా సాగర్ ఆయకట్టులో వరి సాగు చెయ్యొద్దని రైతులకు సూచించింది. ఆరు తడి పంటలకు మాత్రమే ఈ ఏడాది వారబందీ పద్ధతిలో నీరు అందిస్తామని ప్రకటించింది. ఈ ప్రకటనతో రైతులు చాలా చోట్ల మిర్చి సాగు చేపట్టారు. అయితే, ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగర్ కాలువల ద్వారా ఆరు తడులకు కూడా నీరివ్వలేని దుస్థితి నెలకొంది. దీంతో మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు.

పంటను పీకేస్తోన్న రైతులు

ఈ క్రమంలో మిర్చి రైతులు ఆందోళనతో పంటను పీకేస్తున్నారు. పెదకూరపాడుకు చెందిన రైతు 5 ఎకరాల్లో మిర్చి సాగు చేపట్టగా, పంట ఎదుగుతున్న సమయంలో సాగు నీరు అందలేదు. కనీసం బోరు బావుల నుంచి కూడా నీరు అందివ్వలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశాడు. కళ్ల ముందే తన పంట ఎండిపోవడాన్ని తట్టుకోలేక 5 ఎకరాల్లో పంటను ట్రాక్టరుతో దుక్కి దున్నించేశాడు. దాదాపు నెల రోజులుగా సాగు నీటి కోసం ఎదురు చూస్తున్నామని, ఇక పెట్టుబడి పెట్టే పరిస్థితి లేకే ఇలా చేసినట్లు సదరు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పల్నాడులోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని కర్షకులు వాపోతున్నారు. మరో 10, 15 రోజుల్లో వర్షాలు పడకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి పంట ఈ ఏడాది చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు.

తగ్గిన ఉల్లి దిగుబడి

మరోవైపు, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉల్లి దిగుబడి సైతం తగ్గింది. దీంతో ధరలు సైతం పెరిగాయి. బహిరంగ మార్కెట్ లో ఉల్లి కిలో రూ.60 నుంచి రూ.86 వరకూ విక్రయిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే ఉల్లి సాగుకు అగ్ర స్థానంలో నిలిచేది. జూన్ నుంచి అక్టోబర్ వరకూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దిగుబడి తగ్గి, ఇతర ప్రాంతాలకు ఎగుమతి సక్రమంగా లేదు. దీంతో ధరలు పెరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.

Also Read: సామాన్యులకు షాక్ - ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు, అదే కారణమా?

టాప్ హెడ్ లైన్స్

Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Breaking News: యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత
యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Embed widget