అన్వేషించండి

AP Election Counting Updates: టీడీపీ, వైసీపీలో టెన్షన్, గెలుపు ఓటములను డిసైడ్ చేసేది వారే!

Counting Agents: కౌంటింగ్ ప్రక్రియపై పూర్తి అవగా­హ­న ఉన్నవారిని, నిబంధనలపై పట్టున్న వ్యక్తులను ఎంపిక చేసి కౌంటింగ్ కేంద్రాల్లో అనుసరించాల్సిన విధానంపై రాజకీయ పార్టీలు శిక్షణ ఇస్తున్నాయి. 

AP Election Counting Agents: ఓట్ల లెక్కింపు‌నకు సమయం సమీపిస్తుండడంతో ఏపీలోని ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలతో గెలుపు తమదంటే కాదు తమదంటూ చెప్పుకుంటున్నా.. ఓటర్ మహాశయుడు ఎవరి వైపు మొగ్గుచూపారో అనే ఆందోళన లోలోన ఉంది. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రాల్లో బలంగా నిలిచే, పార్టీ విజయాన్ని డిసైడ్ చేసే వారిని కౌంటింగ్‌ ఏజెంట్లుగా నియమించుకుంటున్నాయి. ఈ ప్రక్రియపై పూర్తి అవగా­హ­న ఉన్నవారిని, నిబంధనలపై పట్టున్న వ్యక్తులను ఎంపిక చేసి కౌంటింగ్ కేంద్రాల్లో అనుసరించాల్సిన విధానంపై రాజకీయ పార్టీలు శిక్షణ ఇస్తున్నాయి. 

అనుక్షణం అప్రమత్తత అవసరం
కౌంటింగ్‌ హాళ్లలో ఘర్ష­ణలకు దిగే అవకాశం ఉందని, ఉద్రిక్తత రేకెత్తించే ప్రణాళి­కలు ఉన్నాయంటూ టీడీపీ, వైసీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తమ పార్టీ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయా పార్టీలు సూచిస్తు­న్నాయి. కౌంటింగ్‌ ప్రక్రియ మొత్తం రికార్డు అవుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సంయమనం పాటించాలని ఆయా పార్టీల పెద్దలు సూచిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లు పదేపదే అభ్యంతరాలు, అనుమా­నాలు వ్యక్తం చేసినా వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, రిటర్నింగ్‌ ఆఫీసర్లదేనని, తమ పార్టీ ఏజెంట్లు అక్కడ జరుగుతున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 

లిఖిత పూర్వకంగా ఫిర్యాదు 
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏవైనా అభ్యంతరాలు, అనుమానాలుంటే కౌంటింగ్‌ ఏజెంట్లు కచ్చితంగా లిఖితపూర్వ­కంగా రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు అందజేసి అక్నాలెడ్జ్‌మెంట్‌ (ధ్రువీకరణ) పత్రం  తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. నోటితో అభ్యంతరం తెలిపితే అది చట్టం ముందు నిలబడదని, ప్రతీది లిఖితపూర్వకంగా తెలియజేయాలని పదే పదే సూచించారు. ప్రతి నియోజకవర్గానికి ఐదు చొప్పున లాటరీ ద్వారా ఎంపిక చేసిన బూతుల్లో వీవీ ప్యాట్‌లు లెక్కిస్తారు. ఈవీఎంలలో పడిన ఓట్లకు, వీవీ ప్యాట్లలో ఉన్న ఓట్లకు తేడా ఉంటే ఫైనల్‌గా వీవీ ప్యాట్లలోని ఓట్లనే పరిగణిస్తారు. ఈ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయా పార్టీలు తమ ఏజెంట్లకు అవగాహన కల్పిస్తున్నాయి.

ఆ సయమంలో రీ కౌంటింగ్‌ హక్కు 
ఓట్ల లెక్కింపు ప్రారంభంలోనే ఈవీఎంల సెక్యూరిటీని ఏజెంట్లు జాగ్రత్తగా పరిశీలించాలని రాజకీయ పార్టీలు తమ ఏజెంట్లకు సూచిస్తున్నాయి. ఈవీఎంలలో ఓట్ల వివరాలు, కౌంటింగ్‌ సిబ్బంది ద్వారా స్పష్టంగా వినిపించకపోతే ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలని ఆయా పార్టీల పెద్దలు కోరుతున్నారు. ఓట్ల లెక్కింపు మొదలైన క్షణం నుంచి చిట్ట చివరి వరకూ ఏజెంట్లు కేంద్రంలోనే ఉండాలని, లెక్కింపు పూర్తయి గెలిచిన అభ్యర్థి ధ్రువీ­కరణ పత్రం తీసుకున్న తర్వాతే బయటకు రావాలని అవగాహన కల్పిస్తున్నారు. కౌంటింగ్‌లో అనుమానాలు తలెత్తితే రీ కౌంటింగ్‌ కోరాలని ఏజెంట్లకు సూచిస్తున్నారు.

ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
మంగళవారం ఉదయం 8 గంటల కల్లా లెక్కింపు ప్రారంభం కానుంది. ఏజెంట్లు ఉదయం 6 గంటల లోపే కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఏజెంట్‌గా ఉంటున్న వ్యక్తులు భారత ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఏజెంట్‌ నియామక పత్రం రెండూ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. కౌంటింగ్‌ కేంద్రంలోకి ఫారం–17 సీ, పెన్ను లేదా పెన్సిల్, తెల్ల కాగితాన్ని మాత్రమే అనుమతిస్తున్నారు. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. ఈ క్రమంలో ప్రతి రౌండ్‌ కౌంటింగ్‌లో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయా పార్టీల పెద్దలు ఏజెంట్లకు సూచిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Amaravati Signature Bridge: విజయవాడ- అమరావతి మధ్య రూ.1,000 కోట్లతో సిగ్నేచర్‌ బ్రిడ్జి.. ఆరు లేన్లతో ప్రతిపాదన
విజయవాడ- అమరావతి మధ్య రూ.1,000 కోట్లతో సిగ్నేచర్‌ బ్రిడ్జి.. ఆరు లేన్లతో ప్రతిపాదన
Veligonda Project: వెలిగొండ రెండో ఫేజ్‌ 2028 నాటికి పూర్తి! తొలి దశ ప్రారంభోత్సవ వేదికపై నుంచే చంద్రబాబు ప్రకటన! 
వెలిగొండ రెండో ఫేజ్‌ 2028 నాటికి పూర్తి! తొలి దశ ప్రారంభోత్సవ వేదికపై నుంచే చంద్రబాబు ప్రకటన! 
Veligonda Project: 'వెలిగొండకి YSR వెలుగైతే, చంద్రబాబు చీకటి' షర్మిలా రెడ్డి తీవ్ర విమర్శలు 
'వెలిగొండకి YSR వెలుగైతే, చంద్రబాబు చీకటి' షర్మిలా రెడ్డి తీవ్ర విమర్శలు 
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేదికపై పూల సుబ్బయ్య కుటుంబానికి పెద్ద పీట! కుమార్తెలను సన్మానించిన చంద్రబాబు
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేదికపై పూల సుబ్బయ్య కుటుంబానికి పెద్ద పీట! కుమార్తెలను సన్మానించిన చంద్రబాబు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lionel Messi Retirement: అభిమానులకు షాక్.. అంతర్జాతీయ ఫుట్ బాల్ కు మెస్సీ గుడ్‌బై, అర్జెంటీనా లెజెండ్ భావోద్వేగ ప్రకటన
అభిమానులకు షాక్.. అంతర్జాతీయ ఫుట్ బాల్ కు మెస్సీ గుడ్‌బై, అర్జెంటీనా లెజెండ్ భావోద్వేగ ప్రకటన
Kavitha: హరీష్, సంతోష్‌లను క్షమిస్తానేమో! ఆయనకు మాత్రం నా ఉసురు తగులుతుంది: కవిత
హరీష్, సంతోష్‌లను క్షమిస్తానేమో! ఆయనకు మాత్రం నా ఉసురు తగులుతుంది: కవిత
PM Modi Pezeshkian Meeting: యుద్ధం వేళ ఇరాన్ అధ్యక్షుడితో మోదీ కీలక భేటీ- అందరి కళ్లూ వీరిపైనే! ఎందుకింత ప్రాధాన్యం
యుద్ధం వేళ ఇరాన్ అధ్యక్షుడితో PM Modi కీలక భేటీ- అందరి కళ్లూ వీరిపైనే! ఎందుకింత ప్రాధాన్యం
Veligonda Project: వెలిగొండ రెండో ఫేజ్‌ 2028 నాటికి పూర్తి! తొలి దశ ప్రారంభోత్సవ వేదికపై నుంచే చంద్రబాబు ప్రకటన! 
వెలిగొండ రెండో ఫేజ్‌ 2028 నాటికి పూర్తి! తొలి దశ ప్రారంభోత్సవ వేదికపై నుంచే చంద్రబాబు ప్రకటన! 
Android Apps వినియోగదారులకు అలర్ట్ ! మీ మొబైల్‌లో ఈ యాప్స్ ఉంటే రిమూవ్ చేయండి: MHA వార్నింగ్
Android Apps వినియోగదారులకు అలర్ట్ ! మీ మొబైల్‌లో ఈ యాప్స్ ఉంటే రిమూవ్ చేయండి: MHA వార్నింగ్
High Tension At BJP Office: బీజేపీ ఆఫీసు ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత
బీజేపీ ఆఫీసు ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత
Viral News: కూతురి ఫీజు కోసం చెప్పులు లేకుండా పరుగు.. ఒట్టి కాళ్లతో మారథాన్ గెలిచిన తల్లి!
కూతురి ఫీజు కోసం చెప్పులు లేకుండా పరుగు.. ఒట్టి కాళ్లతో మారథాన్ గెలిచిన తల్లి!
Musarambagh High Level Bridge: మూసారాంబాగ్‌ హైలెవెల్‌ బ్రిడ్జి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ ట్రాఫిక్ సమస్యకు చెక్
మూసారాంబాగ్‌ హైలెవెల్‌ బ్రిడ్జి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ ట్రాఫిక్ సమస్యకు చెక్
Embed widget