అన్వేషించండి

Andhra Pradesh: విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త చెప్పిన నారా లోకేష్‌- ఇంకా రెడ్‌బుక్ తెరవలేదని కామెంట్

Nara Lokesh: విద్యాకానుక పథకాన్ని కొనసాగిస్తామని మండలిలో నారా లోకేశ్ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిందన్ని కక్షగట్టమన్నారు. మరింత నాణ్యమైన కిట్‌ అందజేస్తామని విద్యాశాఖ మంత్రి తెలిపారు.

Jagan VS Nara Lokesh: రాష్ట్రంలో విద్యాకానుక(Vidya Kanuka) పథకాన్ని తప్పకుండా అమలు చేసి తీరతామని విద్యాశాఖ మంత్రి లోకేశ్(Lokesh) స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిందని పథకాలను తొలగించడం వంటి కక్షసాధింపు చర్యలకు తాము పాల్పడబోమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) సైతం ఇదే విషయాన్ని మంత్రులందరికీ చెప్పారని...గత ప్రభుత్వం తీసుకొచ్చిన మంచి పథకాలు ఏమైనా ఉంటే సమీక్షించి మరింత మిన్నగా అమలు చేయాలని చెప్పారే తప్ప...ప్రజలకు ఉపయోగపడే పథకాలను తొలగించొద్దన్నారని వివరించారు.

విద్యాకానుక కంటిన్యూ 
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్యాకానుక(Vidya Kanuka) పథకాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మండలిలో స్పష్టం చేశారు. అయితే పేదవిద్యార్థులకు ఇంకా మరింత నాణ్యమైన బట్టలు, షూ, బ్యాగులు అందిస్తామన్నారు. చదువుకునే పిల్లలపై ప్రభావం చూపేలా వాటికి మాత్రం పార్టీ రంగులు వేయమని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని...విద్యార్థులకు, పాఠశాలలకు, కళాశాలలకు సంబంధించిన వ్యవహారాల్లో రాజకీయ ప్రేరేపితం ఏమాత్రం ఉండకూడదని ఆదేశాలు జారీ చేశామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కదా అని పుస్తకాలు, బ్యాగులకు పసుపు రంగు వేస్తే సహించేది లేదన్నామన్నారు. విద్యార్థుల్లో ప్రేరణ కలిగించేలా...యూనివర్సల్‌ డ్రెస్‌కోడ్‌పై(Dress Code) అధ్యయనం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. గత ప్రభుత్వం విద్యాకానుక కిట్లకు టెండర్లు లేకుండానే పనులు అప్పగించిందని వాటిపై విచారణ జరిపిస్తామని లోకేశ్ (Lokesh)తెలిపాడు. విద్యాకానుక కొనుగోళ్లలోనూ భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయని లోకేశ్ మండిపడ్డారు. తొలి ఏడాది ఒక్కో విద్యార్థికి 1500 రూపాయలు అయిన ఖర్చు ఐదో ఏటకు వచ్చేసరికి 2700 చేశారని దీనిపైనా విచారణ జరిపిస్తామన్నారు.

Also Read: ఢిల్లీలో వైసీపీ ధర్నాకు కాంగ్రెస్‌ దూరంగా ఉందా? జగన్ దూరం పెట్టారా?

పుస్తకాల బరువు పెంచేశారు
ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం చేయకుండానే ఇంగ్లీష్‌మీడియం(English Medium) పేరు చెప్పి గత ప్రభుత్వం విద్యార్థులను అయోమయానికి గురిచేసిందని లోకేశ్ విమర్శించారు. దీనికోసం ఒక్కో పుస్తకం రెండు భాషల్లోనూ ముద్రించాల్సి రావడంతో బరువు పెరిగిపోయి విద్యార్థులు మోయలేకపోతున్నారని లోకేశ్ విమర్శించారు. అలాగే బైజూస్(Byjus) కంటెంట్‌పైనా, వారు అందించిన ట్యాబ్‌(TAB)లపైనా చాలా విమర్శలు వస్తున్నాయని దీనిపైనా సమీక్షిస్తామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న లోకేశ్ అందుకే...సీఎం తొలిసంతకమే డీఎస్సీ(DSC)పై పెట్టారన్నారు. ఉపాధ్యాయ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే త్వరలోనే విద్యా క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. చదువుకుని స్కిల్క్స్ ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు పెద్దఎత్తున ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే సంస్థలు....వారు ఏ మేరకు పెట్టుబడి పెడతారన్నది కాకుండా...ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తారన్న ప్రాతిపదికనే రాయితీలు ఇస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. ఎక్కువ మంది ఉద్యోగాలు కల్పిస్తే ఎక్కువ రాయితీలు ఇస్తామని వివరించారు.

ఢిల్లీలో జగన్ గగ్గోలు
కూటమి ప్రభుత్వం ఏర్పడి పట్టుమని రెండు నెలలు కాకముందే జగన్(Jagan) ఢిల్లీలో గగ్గోలు పెట్టడం చూస్తే ఆశ్చర్యమేస్తోందని లోకేశ్ అన్నారు. ఇక తన వద్ద ఉన్న రెడ్‌బుక్‌(Redbook) తెరిస్తే ఏమైపోతాడోనని చురకలంటించారు. అయితే రెడ్‌బుక్‌లో పేరు ఉన్న ప్రతి ఒక్కరికీ చట్టప్రకారం శిక్షించి తీరతామని ఇందులో ఎలాంటి రాజీలేదని లోకేశ్ మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లకాలంలో కనీసం ఒక్క ప్రెస్‌మీట్‌ కూడా  పెట్టని జగన్‌....ఓడిపోయి 11 సీట్లకు పరిమితం కాగానే మీడియా గుర్తుకు వచ్చిందన్నారు. ఢిల్లీలో జాతీయమీడియాను బ్రతిమిలాడి ప్రెస్‌మీట్‌కు రావాల్సిందిగా వేడుకోవడం చూస్తుంటే జాలేస్తుందన్నారు.

Also Read: మదనపల్లి అగ్ని ప్రమాదంపై స్పందించిన జగన్ - ఏపీకి కొత్త అర్థం చెప్పిన మాజీ సీఎం

టాప్ హెడ్ లైన్స్

Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
AP Governance Progress Report: విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏపీ - రెండేళ్ల పాలనపై ఆర్థిక ప్రగతి నివేదిక విడుదల చేసిన సీఎం చంద్రబాబు!
విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏపీ - రెండేళ్ల పాలనపై ఆర్థిక ప్రగతి నివేదిక విడుదల చేసిన సీఎం చంద్రబాబు!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Borugadda Anil Protest Outside YS Jagan Residence: తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద బోరుగడ్డ అనిల్ నిరసన - సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు!
తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద బోరుగడ్డ అనిల్ నిరసన - సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
Embed widget