అన్వేషించండి

AP Rains Update: కొన్ని గంటల్లో ఏపీలో భారీ వర్షాలు, ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్.. ప్రజలకు కీలక సూచనలు

Andhra Pradesh Rains | ఏపీలో 2 రోజులపాటు భిన్నమైన వాతావరణం నెలకొంటుందని, కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

AP Heavy Rain Alert | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రాగల మూడు గంటల్లో వాతావరణంలో పెను మార్పులు సంభవించనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. 

ఈ అకాల వర్షాల సమయంలో గంటకు 40- 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని ఏపీ వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కిందకు వెళ్లొద్దని లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని ప్రజలకు ఆయన సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి రెండు రోజుల పాటు భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ముఖ్యంగా కోస్తాంధ్రలోని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొన్నారు.

ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు తీవ్రమైన వడగాలులు

మరోవైపు, వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం కూడా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. సోమవారం నాడు చింతూరు, ఇబ్రహీంపట్నం వంటి మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని, సురక్షితమైన భవనాల్లో ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. ఏప్రిల్ 6, 7 తేదీల్లో వాతావరణం అస్థిరంగా ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఆదివారం (ఏప్రిల్ 6న) ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రికార్డు స్థాయిలో నమోదైంది. పార్వతీపురం మన్యం, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా 42.4°C ఉష్ణోగ్రత నమోదవగా, తిరుపతి, మార్కాపురం, కడప, కృష్ణా జిల్లాల్లో కూడా ఎండలు 41 డిగ్రీలు దాటాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 66 మండలాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ తీవ్రమైన ఎండలు, ఉక్కపోత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లేవారు వడదెబ్బ తగలకుండా జాగ్రత్త వహించాలని కోరారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dinner with the Real Winners: డిన్నర్ విత్ ది రియల్ విన్నర్స్ - చంద్రబాబు విందు భేటీ విశేషాలు ఇవిగో
డిన్నర్ విత్ ది రియల్ విన్నర్స్ - చంద్రబాబు విందు భేటీ విశేషాలు ఇవిగో
AP Crime News: చాట్‌జీపీటీ హెల్ప్‌తో మంత్రి సంతకం ఫోర్జరీ! తండ్రీ కొడుకుల మాస్టర్ ప్లాన్ తెలిసి పోలీసులే షాక్!  
చాట్‌జీపీటీ హెల్ప్‌తో మంత్రి సంతకం ఫోర్జరీ! తండ్రీ కొడుకుల మాస్టర్ ప్లాన్ తెలిసి పోలీసులే షాక్!  
Andhra Pradesh Cabinet meeting: ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి రూ.124 కోట్లు - కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి రూ.124 కోట్లు - కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
AP SSC Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో 85. 25 శాతం ఉత్తీర్ణత! మరోసారి బాలికలదే పైచేయి!
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో 85. 25 శాతం ఉత్తీర్ణత! మరోసారి బాలికలదే పైచేయి!
Advertisement

వీడియోలు

Mumbai Indians Batting Failure IPL 2026 | ముంబై వరుస పరాజయాలకు కారణం ఏంటి ?
Yuvi, Travis plan behind Abhishek Success IPL 2026 | అభిషేక్ విధ్వంసం వెనుక రహస్యం ఇదే
Ryan Rickelton Breaks Record IPL 2026 | 18 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన ర్యాన్ రికెల్టన్
Vaibhav Suryavanshi Performance IPl 2026 | వైభవ్ విధ్వంసానికి గవాస్కర్ ఫిదా
SRH vs MI Highlights IPL 2026 | ముంబైపై సన్‌రైజర్స్ అదిరే విక్టరీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dinner with the Real Winners: డిన్నర్ విత్ ది రియల్ విన్నర్స్ - చంద్రబాబు విందు భేటీ విశేషాలు ఇవిగో
డిన్నర్ విత్ ది రియల్ విన్నర్స్ - చంద్రబాబు విందు భేటీ విశేషాలు ఇవిగో
IPL 2026 GT VS RCB Result Update: లో స్కోరింగ్ థ్రిల్లర్ లో జీటీ ఈజీ విక్ట‌రీ.. శుభ‌మాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాణించిన అర్ష‌ద్, ర‌షీద్, ఆర్సీబీకి షాక్
లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో జీటీ ఈజీ విక్ట‌రీ.. శుభ‌మాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాణించిన అర్ష‌ద్, ర‌షీద్, ఆర్సీబీకి షాక్
AP Crime News: చాట్‌జీపీటీ హెల్ప్‌తో మంత్రి సంతకం ఫోర్జరీ! తండ్రీ కొడుకుల మాస్టర్ ప్లాన్ తెలిసి పోలీసులే షాక్!  
చాట్‌జీపీటీ హెల్ప్‌తో మంత్రి సంతకం ఫోర్జరీ! తండ్రీ కొడుకుల మాస్టర్ ప్లాన్ తెలిసి పోలీసులే షాక్!  
Riyan Parag Fined: డ్రెస్సింగ్ రూమ్‌లో రియాన్ పరాగ్ వేపింగ్.. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌పై బీసీసీఐ కొరడా! భారీ జరిమానా విధింపు
డ్రెస్సింగ్ రూమ్‌లో రియాన్ పరాగ్ వేపింగ్.. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌పై బీసీసీఐ కొరడా! భారీ జరిమానా విధింపు
Adilabad Latest News: ఫెయిల్ అయిన ఇంటర్, పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ విద్యాశాఖ!
ఫెయిల్ అయిన ఇంటర్, పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ విద్యాశాఖ!
Hyderabad Real Estate News: ప్రగతీనగర్, నిజాంపేట్‌ రియల్టర్స్‌ను వేధిస్తున్న ఏజ్‌బార్ సమస్య! పెళ్లికాని ప్రసాద్‌లా మిగిలిపోతున్న బిల్డింగ్స్!
ప్రగతీనగర్, నిజాంపేట్‌ రియల్టర్స్‌ను వేధిస్తున్న ఏజ్‌బార్ సమస్య! పెళ్లికాని ప్రసాద్‌లా మిగిలిపోతున్న బిల్డింగ్స్!
Andhra Pradesh Cabinet meeting: ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి రూ.124 కోట్లు - కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి రూ.124 కోట్లు - కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
Hansika: బికినీలో హన్సిక... మారిషస్‌లో మస్తీ మజా
బికినీలో హన్సిక... మారిషస్‌లో మస్తీ మజా
Embed widget